ఈ రోజు సాయంత్రం జరగబోయే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమండ్రి సిద్ధమయ్యింది. సుమారు లక్షన్నర మందికి సరిపడా ఏర్పాట్లతో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు నిర్వాహకులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న తొలి టాలీవుడ్ వేడుక ఇదే కావడంతో ఒక ప్యాన్ ఇండియా సినిమాకు సరిపడా హైప్ దీని మీద ఉంది. అందులోనూ బాబాయ్ అబ్బాయ్ ఒకే వేదికపై కలయికను రంగస్థలం తర్వాత చూసే అవకాశం దక్కడంతో అభిమానుల ఉద్వేగం మాములుగా లేదు. లైవ్ లోనూ కోట్లాది ప్రేక్షకులు చూడబోతున్నారు.
ఇప్పుడు అందరి దృష్టి పవన్ ఏమేం మాట్లాడతారనే దాని మీదే ఉంది. చరణ్, గేమ్ ఛేంజర్ లో ఉన్న సోషల్ మెసేజ్ గురించి చెప్పడంలో ఆశ్చర్యం ఏముండదు కానీ ఇటీవల టాలీవుడ్ లో జరిగిన పరిణామాలు, టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు, మెగా ఫ్యామిలీ సంగతులు ఏమైనా ఉంటాయనే దాని మీద ఎక్కువ ఆసక్తి నెలకొంది. పైగా ఎక్కడికి వెళ్లినా పవర్ ఫాన్స్ ఓజి ఓజి అంటూ జపం చేస్తున్నారు. దానితో పాటు హరిహర వీరమల్లు ప్రస్తావన వచ్చే అవకాశాలు లేకపోలేదు. కీలకమైన ఉప పాలకుడి పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో కొంత పొలిటికల్ టచ్ లేకుండా స్పీచ్ ఊహించలేం.
భారీ జనసందోహం మధ్య జరుగుతున్న ఈ ఈవెంటే గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో అతి పెద్ద మజిలీ. ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరగడంతో దిల్ రాజు బృందం ఈ వేడుక మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఓపెనింగ్స్ మీద ప్రభావం ఉంటుందని ఆశిస్తోంది. మాములుగా సోలో రిలీజ్ అయితే టెన్షన్ తగ్గేది కానీ డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాంలతో తలపడాల్సిన నేపథ్యంలో చరణ్ కు బాక్సాఫీస్ ఫైట్ గట్టిగానే ఉంటుంది. దర్శకుడు శంకర్, తమన్, అంజలి, ఎస్జె సూర్య తదితరులు చాలా కాన్ఫిడెంట్ గా బ్లాక్ బస్టరని చెబుతున్నారు. చూడాలి మరి రామ్ నందన్ వసూళ్ల వేట ఎలా ఉండబోతోందో.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…