ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ కోసం తెలుగులోనే కాదు తమిళంలో కూడా చెప్పుకోదగ్గ బజ్ కనిపిస్తోంది. దర్శకుడు శంకర్ బ్రాండ్ తో పాటు పొంగల్ బరిలో ఇది తప్ప చెప్పుకోదగ్గ ప్యాన్ ఇండియా మూవీ వేరేది లేకపోవడంతో మీడియా అటెన్షన్ దీనివైపు బాగానే ఉంది. దానికి తోడు నిర్మాత దిల్ రాజు చెన్నైలో ప్లాన్ చేసుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టులుగా రజనీకాంత్, విజయ్ ను ఆహ్వానించారని వస్తున్న వార్త హాట్ టాపిక్ అయ్యింది. వీళ్లిద్దరిలో ఒక్కరు వచ్చినా అదిచ్చే బూస్ట్ మాములుగా ఉండదు. అయితే ఖరారుగా తెలియాలంటే ఇంకొంచెం ఆగాలి. ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ టాపిక్ ఉంది.
గేమ్ ఛేంజర్ కథకు ముందు శంకర్ అనుకున్న హీరో విజయ్. కానీ కుదరలేదు. ఈ కాంబోలో 3 ఇడియట్స్ రీమేక్ నన్బన్ (స్నేహితుడు) వచ్చింది కానీ ఆశించిన ఫలితం అందుకోలేదు. స్ట్రెయిట్ సబ్జెక్టు ఏదైనా చేసి ఉంటే బాగుండేదని అప్పట్లో ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు. ఆ టైంలోనే కార్తీక్ సుబ్బరాజ్ ఒక కథ రాసుకుని శంకర్ కు వినిపించడం, అది కాస్తా తలపతికి చేరడం జరిగిపోయాయి. స్టోరీ నచ్చినా కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడు. దీని స్థానంలోనే బీస్ట్ ఒప్పుకున్నాడు. అలా చేయి మారిపోయి దిల్ రాజు ద్వారా శంకర్ రామ్ చరణ్ ని కలుసుకోవడం, వెంటనే ఎస్ చెప్పించుకోవడం జరిగాయి.
ఇదంతా విశ్వసనీయ తమిళ మీడియాలో వచ్చిన కథనమే. ఒకవేళ విజయ్ కనక గేమ్ ఛేంజర్ చేసి రాజకీయ తెరంగేట్రానికి ముందు చేయాల్సిన సరైన సినిమాగా నిలిచిపోయేది. కానీ జరిగింది వేరు. మూడేళ్లు నిర్మాణంలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి విజయ్ అంత సమయం కేటాయించే వాడు కాదు కానీ ఇండియన్ 2 వల్ల వచ్చిన అడ్డంకులు లేట్ చేశాయి తప్పించి మాములుగా అయితే శంకర్ టార్గెట్ రెండు సంవత్సరాలలోపే రిలీజ్ చేయాలని. అజిత్ విడాముయార్చి వాయిదా పడటం వల్ల ఆ ఆనందంతో విజయ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ కు పూర్తి మద్దతు ఇస్తున్న వైనం సోషల్ మీడియా ట్రెండ్స్ లో కనిపిస్తోంది.
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…