Movie News

తనికెళ్ల భరణిపై బాలు అలిగిన వేళ..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆప్తులైన వ్యక్తుల్లో తనికెళ్ల భరణి ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాల అనుబంధం వీరిది. ఎన్నో సినిమాలకు కలిసి పని చేశారు. భరణి దర్శకత్వంలో బాలు ‘మిథునం’ సినిమాలో లీడ్ రోల్ చేసి అద్భుత అభినయం ప్రదర్శించడం, ఆ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకోవడం తెలిసిన సంగతే.

ఐతే ఈ కథను ముందు బాలుకు చెప్పినపుడు.. భరణినే ప్రధాన పాత్ర చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారట. ఐతే కథ రాసి, దర్శకత్వం చేస్తూ తనే అందులో నటిస్తే.. ఇక ఆ సినిమాను తాను మాత్రమే చూసుకోవాల్సి వస్తుందని చమత్కరించాడట భరణి. దీంతో బాలు ఈ పాత్రన ఒప్పుకుని చాలా తక్కువ పారితోషకానికి సినిమా చేశారని భరణి ఆయనకు నివాళి అర్పిస్తూ రాసిన ఒక వ్యాసంలో వెల్లడించారు.

ఇక ‘మిథునం’ చిత్రీకరణ జరిగే సమయంలో తనకు, బాలుకు చిన్న అభిప్రాయ భేదాలు కూడా వచ్చినట్లు భరణి వెల్లడించారు. ఒక రోజు చిత్రీకరణ బాగా ఆలస్యం అయిందని.. దీంతో అసహనానికి గురైన బాలు కెమెరామన్, సెట్లో ఉన్న వారి మీద అరిచేశారని.. ఐతే ఎక్కడేం తప్పు జరిగినా దర్శకుడిగా బాధ్యత తనదే కాబట్టి తాను చిన్నబుచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నానని భరణి వెల్లడించారు.

దీంతో తమ మధ్య రెండు రోజులు మాటలు లేకుండా పోయాయని.. ఇంతలో షూటింగ్ పూర్తయి బాలు గారు వీడ్కోలు తీసుకోబోతుంటే అన్యమనస్కంగా కారు దగ్గరికి వచ్చానని.. ఐతే బాలు వెంటనే తనను దగ్గరికి తీసుకుని హత్తుకున్నారని.. తనకు బాగా ఏడుపొచ్చేసిందని, ఆయన కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకోబోతుంటే తనను లేపి ముద్దు పెట్టుకున్నారని.. తాను ‘మిథునం’ సినిమాను అద్భుతంగా తీశానని, తనతో పాటు ఆయనకూ చాలా మంచి పేరొస్తుందని సంబరంగా అన్నారని భరణి గుర్తు చేసుకున్నారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బాలు గారి కోసం ఒక వంట మనిషిని పెట్టి రకరకాల వంటకాలు చేయించామని.. కానీ తాను బేరియాట్రిక్ సర్జరీ చేసుకోవడం వల్ల రెండు పిడికెళ్ల కంటే ఎక్కువ అన్నం తినలేనంటూ వాపోయారని భరణి వెల్లడించారు.

This post was last modified on October 12, 2020 11:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

36 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago