2024 మెగా ఫ్యామిలీ బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడం ఆ కుటుంబంలో ఎప్పుడూ లేనంత పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఇక ఫ్యాన్స్ కు ఏ రేంజ్ లో కిక్కిచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం మెగా హీరోలను రెగ్యులర్ గా కలుసుకోలేకపోతున్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కోసం ఆయన సినిమా వేడుకకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలకానున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఆంద్రప్రదేశ్ లోనే వేడుకకు ఏర్పాట్లు జరగనున్నట్లు టాక్. అయితే, ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ప్రత్యేక బంధం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాబాయ్, అబ్బాయ్ కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారనే వార్త మెగా అభిమానుల్లో ఆనందాన్ని పంచుతోంది. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్న నేపథ్యంలో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
ఈ ఈవెంట్ జనవరి 4న హైదరాబాద్లో గ్రాండ్గా జరగనుందని సమాచారం. చిరంజీవి బిజీ షెడ్యూల్ కారణంగా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారట. ఇక వేడుకలో గేమ్ ఛేంజర్ గురించి పవన్ మాట్లాడితే, సినిమా పట్ల జనాల్లో ఉత్సాహం మరింత పెరిగే అవకాశం ఉంది. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడిప్పుడే కాస్త సౌండ్ పెంచుకుంటోంది. ఇక పవన్ రాకతో అంచనాల స్థాయి ఇంకా ఏ లెవెల్లో పెరిగుతుందో చూడాలి.
This post was last modified on December 20, 2024 4:45 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…