2021 డిసెంబర్ 8న త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య మధులిక రావత్ అలాగే మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఇటీవల ఈ ఘటనపై రక్షణ శాఖ స్థాయి సంఘం తన నివేదికను లోక్ సభలో ప్రవేశపెట్టింది.
స్థాయి కమిటీ నివేదిక ప్రకారం, హెలికాప్టర్ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని స్పష్టమైంది. పైలట్ నిర్ణయాల్లో వచ్చిన లోపాల వల్ల ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు నివేదిక తెలిపింది. 2017-2022 మధ్య భారతీయ వైమానిక దళానికి చెందిన మొత్తం 34 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. వీటిలో 2021-2022లో జరిగిన 9 ప్రమాదాల్లో, జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం మానవ తప్పిదానికి తార్కాణమని తేల్చారు.
కూనూరులో జరిగిన ఈ ప్రమాదం అప్పట్లో దేశం మొత్తాన్ని కదిలించింది. జనరల్ బిపిన్ రావత్ భారతదేశ మొదటి త్రివిధ దళాధిపతిగా దేశ రక్షణ వ్యవస్థకు చేసిన సేవలు అనిర్వచనీయమని ప్రముఖులు పేర్కొన్నారు. ఈ నివేదికతో ఈ ప్రమాదం వెనుక కారణాలు బయటపడటమే కాకుండా, రక్షణ వ్యవస్థలో మెరుగుదల కొరకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రిపోర్టు ప్రకారం, ఈ ప్రమాదం తర్వాత హెలికాప్టర్, విమానాల నిర్వహణకు సంబంధించి రక్షణ శాఖ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక శిక్షణ, నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటామని రక్షణ శాఖ ప్రతినిధులు పేర్కొన్నారు.
This post was last modified on December 20, 2024 2:29 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…