Trends

బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం: మానవ తప్పిదమే..

2021 డిసెంబర్ 8న త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక రావత్ అలాగే మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఇటీవల ఈ ఘటనపై రక్షణ శాఖ స్థాయి సంఘం తన నివేదికను లోక్ సభలో ప్రవేశపెట్టింది.

స్థాయి కమిటీ నివేదిక ప్రకారం, హెలికాప్టర్ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని స్పష్టమైంది. పైలట్ నిర్ణయాల్లో వచ్చిన లోపాల వల్ల ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు నివేదిక తెలిపింది. 2017-2022 మధ్య భారతీయ వైమానిక దళానికి చెందిన మొత్తం 34 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. వీటిలో 2021-2022లో జరిగిన 9 ప్రమాదాల్లో, జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం మానవ తప్పిదానికి తార్కాణమని తేల్చారు.

కూనూరులో జరిగిన ఈ ప్రమాదం అప్పట్లో దేశం మొత్తాన్ని కదిలించింది. జనరల్ బిపిన్ రావత్ భారతదేశ మొదటి త్రివిధ దళాధిపతిగా దేశ రక్షణ వ్యవస్థకు చేసిన సేవలు అనిర్వచనీయమని ప్రముఖులు పేర్కొన్నారు. ఈ నివేదికతో ఈ ప్రమాదం వెనుక కారణాలు బయటపడటమే కాకుండా, రక్షణ వ్యవస్థలో మెరుగుదల కొరకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రిపోర్టు ప్రకారం, ఈ ప్రమాదం తర్వాత హెలికాప్టర్, విమానాల నిర్వహణకు సంబంధించి రక్షణ శాఖ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక శిక్షణ, నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటామని రక్షణ శాఖ ప్రతినిధులు పేర్కొన్నారు.

This post was last modified on December 20, 2024 2:29 pm

Share

Recent Posts

సాక్షిలో రెండో పేజీకి చేరిన రాజన్న

ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…

2 minutes ago

తెలంగాణా బీజేపీలో కారు లొల్లి

తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…

1 hour ago

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…

2 hours ago

రెండో భాస్కర్ అంత వేగంగా రాగలడా

సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…

3 hours ago

ఆ ఆలయాల్లో సెల్ ఫోన్ వినియోగంపై నిషేధం… విజయ్ సంచలనం

తమిళనాడులో నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జోసెఫ్ విజయ్ ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో అనేక…

3 hours ago

నాపై కాదు రేవంత్ పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…

3 hours ago