రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో క్వాలిటీ గురించి మాట్లాడుకునే రోజులు ఎప్పుడో పోయాయి. వివాదాస్పద అంశాల నేపథ్యంలో లేదంటే బూతు కంటెంట్తో సినిమాలు తీయడం.. పబ్లిసిటీ గిమ్మిక్కులతో వాటి పట్ల ఓ వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడం.. అలా సొమ్ము చేసుకోవడం.. ఇదీ వరస. ఇలా కొన్నేళ్ల నుంచి బాగానే వెనకేసుకుంటూ వస్తున్నాడు వర్మ.
లాక్ డౌన్ టైంలో పే పర్ వ్యూ పద్ధతిలో కొన్ని సినిమాలు రిలీజ్ చేసిన వర్మకు మొదట్లో బాగానే గిట్టుబాటైంది. కొన్ని లక్షల పెట్టుబడితో కోట్లు రాబట్టాడు కూడా. కానీ ఇప్పుడు అలాంటి గిమ్మిక్కులేవీ పని చేయడం లేదు. వర్మ ఎంతో సెన్సేషనల్ స్టోరీ తీసుకున్నా జనాల్లో ఆసక్తి కనిపించడం లేదు. చివరగా వర్మ పే పర్ వ్యూ స్టయిల్లో రిలీజ్ చేసిన సినిమాకు మినిమం రెస్పాన్స్ కరవైంది.
దీనికి తోడు ఆయన సినిమాలకు వరుసగా లీగల్ ఇష్యూస్ తలెత్తుతున్నాయి. మిర్యాలగూడ ప్రణయ్-అమృతల కథతో తెరకెక్కించిన మర్డర్ విడుదలకు నోచుకోలేకపోయింది. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ సినిమా పరిస్థితీ ఇలాగే తయారైంది. కరోనా వైరస్ అంటూ ఓ సినిమా తీస్తే అది ఏమాత్రం జనాల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఈ సినిమాను పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేసినా ఆశించిన రెస్పాన్స్ వచ్చేలా లేదు.
లాక్ డౌన్ తర్వాత తొలి థియేట్రికల్ రిలీజ్ ఇదే అని వర్మ ప్రకటించగా.. పట్టించుకున్న నాథుడు లేడు. ఈ సినిమా అలా రిలీజైతే మెయింటైనెన్స్ ఖర్చులైనా వస్తాయా అన్నది డౌటు. ఆర్జీవీ మిస్సింగ్ అంటూ ఇంకేదో సిల్లీ సినిమా తీస్తున్నాడు కానీ.. దాని పట్లా ఎవరికీ ఆసక్తి కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే వర్మ పబ్లిసిటీ గిమ్మిక్కులకు జనం పడిపోయే రోజులు పోయినట్లే ఉంది. ఇక జనం నుంచి వర్మ డబ్బులు లాగాలంటే కష్టమే.
This post was last modified on October 13, 2020 7:27 pm
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…
ఏపీ మంత్రి నారా లోకేష్పై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఏకబిగిన ఏడున్నర గంటల పాటు నిలబడి.. ప్రజలకు…