రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో క్వాలిటీ గురించి మాట్లాడుకునే రోజులు ఎప్పుడో పోయాయి. వివాదాస్పద అంశాల నేపథ్యంలో లేదంటే బూతు కంటెంట్తో సినిమాలు తీయడం.. పబ్లిసిటీ గిమ్మిక్కులతో వాటి పట్ల ఓ వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడం.. అలా సొమ్ము చేసుకోవడం.. ఇదీ వరస. ఇలా కొన్నేళ్ల నుంచి బాగానే వెనకేసుకుంటూ వస్తున్నాడు వర్మ.
లాక్ డౌన్ టైంలో పే పర్ వ్యూ పద్ధతిలో కొన్ని సినిమాలు రిలీజ్ చేసిన వర్మకు మొదట్లో బాగానే గిట్టుబాటైంది. కొన్ని లక్షల పెట్టుబడితో కోట్లు రాబట్టాడు కూడా. కానీ ఇప్పుడు అలాంటి గిమ్మిక్కులేవీ పని చేయడం లేదు. వర్మ ఎంతో సెన్సేషనల్ స్టోరీ తీసుకున్నా జనాల్లో ఆసక్తి కనిపించడం లేదు. చివరగా వర్మ పే పర్ వ్యూ స్టయిల్లో రిలీజ్ చేసిన సినిమాకు మినిమం రెస్పాన్స్ కరవైంది.
దీనికి తోడు ఆయన సినిమాలకు వరుసగా లీగల్ ఇష్యూస్ తలెత్తుతున్నాయి. మిర్యాలగూడ ప్రణయ్-అమృతల కథతో తెరకెక్కించిన మర్డర్ విడుదలకు నోచుకోలేకపోయింది. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ సినిమా పరిస్థితీ ఇలాగే తయారైంది. కరోనా వైరస్ అంటూ ఓ సినిమా తీస్తే అది ఏమాత్రం జనాల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఈ సినిమాను పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేసినా ఆశించిన రెస్పాన్స్ వచ్చేలా లేదు.
లాక్ డౌన్ తర్వాత తొలి థియేట్రికల్ రిలీజ్ ఇదే అని వర్మ ప్రకటించగా.. పట్టించుకున్న నాథుడు లేడు. ఈ సినిమా అలా రిలీజైతే మెయింటైనెన్స్ ఖర్చులైనా వస్తాయా అన్నది డౌటు. ఆర్జీవీ మిస్సింగ్ అంటూ ఇంకేదో సిల్లీ సినిమా తీస్తున్నాడు కానీ.. దాని పట్లా ఎవరికీ ఆసక్తి కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే వర్మ పబ్లిసిటీ గిమ్మిక్కులకు జనం పడిపోయే రోజులు పోయినట్లే ఉంది. ఇక జనం నుంచి వర్మ డబ్బులు లాగాలంటే కష్టమే.
This post was last modified on October 13, 2020 7:27 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…