పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్ దాటిన ఇండియన్ మూవీగా మరో మైలురాయి అందుకుంది. ముఖ్యంగా హిందీ బెల్టులో ఊహించని ఊచకోత సాగించిన ఈ బ్లాక్ బస్టర్ అక్కడ ఇప్పుడప్పుడే నెమ్మదించేలా లేదు. వచ్చే వారం రిలీజ్ కానున్న బేబీ జాన్ కన్నా బన్నీ మూవీకే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ ఉండటం గమనించాల్సిన విషయం. బాలీవుడ్ నుంచి 600 కోట్ల మార్కుని దాటేసి ఏకంగా షారుఖ్ ఖాన్ ని సవాల్ చేసిన అల్లు అర్జున్ ఫైనల్ రన్ ఎక్కడ ఆపుతాడో అంతు చిక్కడం లేదు. ఇప్పుడు అందరి మదిలో ఒకటే ప్రశ్న తలెత్తుతోంది.
మొత్తం రన్ పూర్తయ్యేసరికి పుష్ప 2 రెండు వేల కోట్లను సాధిస్తాడా లేదాని. జోరు చూస్తుంటే అదేం కష్టం కాదు కానీ మరీ ఈజీ అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇంకో 500 కోట్లు రావాలంటే అనూహ్యమైన పికప్ ఉండాలి. ఇప్పటికే అధిక శాతం ఆడియన్స్ థియేటర్లలో చూసేశారు. టికెట్ రేట్లు సాధారణం అయ్యాయి కాబట్టి ఫ్యాన్స్ రిపీట్ షోలు వేసుకోవచ్చేమో కానీ ఇంకా చూడని జనాలు ఎంత శాతం ఉన్నారనే దాన్ని బట్టి టార్గెట్ ఆధారపడి ఉంటుంది. పైగా క్రిస్మస్ సందర్భంగా నాలుగు భాషల్లో మూకుమ్మడిగా వస్తున్న కొత్త సినిమాలు ఖచ్చితంగా పుష్ప 2 మీద ప్రభావం చూపిస్తాయి. వాటికొచ్చే టాక్ కీలకం కానుంది.
ఒకవేళ కొత్త సినిమాల్లో ఏదైనా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే చెప్పలేం కానీ లేదంటే పుష్ప 2 లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యం కాదు. రెండో వారం నుంచి ప్రమోషన్లు ఫ్రెష్ గా చేద్దామని ప్లాన్ చేసుకున్న మైత్రి బృందానికి సంధ్య థియేటర్ దుర్ఘటన స్పీడ్ బ్రేకర్ లా అడ్డుపడింది. బెంగళూరు, హైదరాబాద్ తదితర చోట్ల చేయాలనుకున్న సక్సెస్ ఈవెంట్లు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. బన్నీ అరెస్ట్ జరగకపోయి ఉంటే మరో రౌండ్ ప్యాన్ ఇండియా ప్రమోషన్లకు అవకాశముండేది.
ఏది ఏమైనా టాలీవుడ్ గర్వపడే స్థాయిలో పుష్ప 2 సాధించిన ఘనవిజయం మాములుది కాదు. అల్లు అర్జున్ అన్నట్టు దీన్ని ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి. మైత్రి అధికారికంగా వదిలిన 1508 కోట్ల పోస్టర్ లో బన్నీతో సమానంగా దర్శకుడు సుకుమార్ ని కూడా పొందుపరిచారు. క్రెడిట్ ఇవ్వడమంటే ఇదే కదా.
This post was last modified on December 19, 2024 8:32 pm
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…
సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో శ్రీవిష్ణు రెండు సినిమాలు రిలీజ్ కానుండటం గురించి అభిమానుల కంటే ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్…