రమణ గోగుల.. 2000 సంవత్సరానికి అటు ఇటు ఓ పదేళ్ల పాటు తెలుగు సినిమా సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన మ్యుజీషియన్. విదేశాల్లో ఉన్న అతను ‘ప్రేమంటే ఇదేరా’తో సంగీత దర్శకుడిగా పరిచయమై.. యువరాజు, తమ్ముడు, బద్రి, జానీ, లక్ష్మి, మౌనమేలనోయి లాంటి మ్యూజిక్ హిట్లతో అప్పటి యువతను ఒక ఊపు ఊపేశాడు. ఐతే తర్వాత దేవిశ్రీ ప్రసాద్, చక్రి, తమన్ లాంటి యువ సంగీత తరంగాల జోరును తట్టుకోలేక ఆయన కనుమరుగైపోయారు.
గత పదేళ్లలో రమణ గోగుల ఏ చిత్రానికీ సంగీతం అందించలేదు. ఆయన్ని అందరూ మరిచిపోయారు. ఇలాంటి సమయంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ దర్వకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో.. అనూహ్యంగా రమణ గోగులను తెరపైకి తీసుకొచ్చి ఒక పాట పాడించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అనుకోకుండా ఈ పాట పాడిన రమణ గోగుల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ను ఒక ఊపు ఊపేస్తున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో మధుప్రియతో కలిసి రమణ గోగుల పాడిన ‘గోదారి గట్టు మీద..’ పాట ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్లో మోత మోగిపోతోంది.
ముందు ఈ పాట విని మామూలుగానే ఉంది కదా అనుకున్నారు కానీ.. ఇది నెమ్మదిగా జనాలకు బాగా ఎక్కేస్తోంది. సింపుల్గా అనిపిస్తూనే మంచి బీట్తో జనాలు పాడుకునేలా, స్టెప్పులేసేలా ఉండడంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్ వైరల్ అయిపోతోంది. ఈ పాటకు ప్రత్యేకతను తీసుకొచ్చింది రమణ గోగుల వాయిసే అనడంలో సందేహం లేదు.
‘ప్రేమంటే ఇదేరా’ సినిమాతో వెంకీకి సంగీత దర్శకుడిగా మరపురాని ఆల్బం ఇచ్చిన రమణ గోగుల.. ఇప్పుడు ‘గోదారి గట్టు మీద..’ పాటతో సింగర్గా గుర్తుండిపోయే పాటను అందించాడు. ఇంత గ్యాప్ తర్వాత వచ్చి ఇలా ఒక పాటతో ఊపేయడం రమణ గోగులకే చెల్లింది. ఈ పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే.. మున్ముందు గోగులతో సంగీత దర్శకులు మరిన్ని పాటలు పాడించేలా ఉన్నారు.
This post was last modified on December 17, 2024 2:58 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…