రమణ గోగుల.. 2000 సంవత్సరానికి అటు ఇటు ఓ పదేళ్ల పాటు తెలుగు సినిమా సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన మ్యుజీషియన్. విదేశాల్లో ఉన్న అతను ‘ప్రేమంటే ఇదేరా’తో సంగీత దర్శకుడిగా పరిచయమై.. యువరాజు, తమ్ముడు, బద్రి, జానీ, లక్ష్మి, మౌనమేలనోయి లాంటి మ్యూజిక్ హిట్లతో అప్పటి యువతను ఒక ఊపు ఊపేశాడు. ఐతే తర్వాత దేవిశ్రీ ప్రసాద్, చక్రి, తమన్ లాంటి యువ సంగీత తరంగాల జోరును తట్టుకోలేక ఆయన కనుమరుగైపోయారు.
గత పదేళ్లలో రమణ గోగుల ఏ చిత్రానికీ సంగీతం అందించలేదు. ఆయన్ని అందరూ మరిచిపోయారు. ఇలాంటి సమయంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ దర్వకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో.. అనూహ్యంగా రమణ గోగులను తెరపైకి తీసుకొచ్చి ఒక పాట పాడించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అనుకోకుండా ఈ పాట పాడిన రమణ గోగుల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ను ఒక ఊపు ఊపేస్తున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో మధుప్రియతో కలిసి రమణ గోగుల పాడిన ‘గోదారి గట్టు మీద..’ పాట ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్లో మోత మోగిపోతోంది.
ముందు ఈ పాట విని మామూలుగానే ఉంది కదా అనుకున్నారు కానీ.. ఇది నెమ్మదిగా జనాలకు బాగా ఎక్కేస్తోంది. సింపుల్గా అనిపిస్తూనే మంచి బీట్తో జనాలు పాడుకునేలా, స్టెప్పులేసేలా ఉండడంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్ వైరల్ అయిపోతోంది. ఈ పాటకు ప్రత్యేకతను తీసుకొచ్చింది రమణ గోగుల వాయిసే అనడంలో సందేహం లేదు.
‘ప్రేమంటే ఇదేరా’ సినిమాతో వెంకీకి సంగీత దర్శకుడిగా మరపురాని ఆల్బం ఇచ్చిన రమణ గోగుల.. ఇప్పుడు ‘గోదారి గట్టు మీద..’ పాటతో సింగర్గా గుర్తుండిపోయే పాటను అందించాడు. ఇంత గ్యాప్ తర్వాత వచ్చి ఇలా ఒక పాటతో ఊపేయడం రమణ గోగులకే చెల్లింది. ఈ పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే.. మున్ముందు గోగులతో సంగీత దర్శకులు మరిన్ని పాటలు పాడించేలా ఉన్నారు.
This post was last modified on December 17, 2024 2:58 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…