క్రిస్మస్ పండక్కి బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన పోటీ ఉంటుందని భావించారు ముందు. కానీ ఆ సీజన్ దగ్గర పడేసరికి కథ మారిపోతోంది. ముందు ఈ పండక్కి అనుకున్న ‘తండేల్’ సినిమా వాయిదా పడిపోయింది. ఒక దశలో ‘గేమ్ చేంజర్’ క్రిస్మస్కే వస్తుందన్నారు. అది సంక్రాంతికి వెళ్లిపోయింది. ఇక లేటెస్ట్గా మరో క్రేజీ మూవీ రేసు నుంచి తప్పుకుంది. అదే.. రాబిన్ హుడ్. కొన్ని రోజుల ముందు వరకు క్రిస్మస్ రిలీజ్ డేట్కే కట్టుబడి ఉన్న ఈ చిత్రాన్ని తాజాగా పోటీ నుంచి తప్పించారు. ‘పుష్ప-2’ నిర్మాతలే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయగా.. పుష్ప-2కు క్రిస్మస్ సెలవుల్లోనూ మంచి ఆక్యుపెన్సీలు వస్తాయన్న ఉద్దేశంతో దానికి పోటీగా తమ బేనర్ నుంచి మరో సినిమాను రిలీజ్ చేయడం ఎందుకని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఇవి కాక ప్రియదర్శి-ఇంద్రగంటి మోహనకృష్ణల ‘సారంగపాణి జాతకం’ కూడా ఏవో కారణాలతో పోటీ నుంచి తప్పుకుంది. ఇలా తెలుగు నుంచి ఒక్కో క్రేజీ సినిమా పోటీ నుంచి తప్పుకున్నాయి . దీంతో లేటుగా క్రిస్మస్ రేసులోకి అల్లరి నరేష్ సినిమా ‘బచ్చలమల్లి’ మాత్రమే పోటీలో నిలిచింది. క్రిస్మస్ వీకెండ్లో రానున్న మిగతా చిత్రాలన్నీ డబ్బింగ్వే. ఉపేంద్ర ‘యుఐ’, విజయ్ సేతుపతి ‘విడుదల-2’తో పాటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ‘ముషాసా’ కూడా మంచి అంచనాలతోనే రిలీజవుతున్నప్పటికీ.. తెలుగు సినిమా కావడం ‘బచ్చలమల్లి’కి అడ్వాంటేజ్.
ఈ సినిమా ప్రోమోలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాకు మంచి బజ్ వచ్చింది. కాబట్టి క్రిస్మస్ లాంటి క్రేజీ సీజన్లో ఈ చిత్రానికి మంచి అడ్వాంటేజ్ ఉన్నట్లే. ఇది బచ్చలమల్లి అనే నిజ జీవిత వ్యక్తి కథ కావడం విశేషం. ఒకప్పుడు కామెడీ సినిమాలు చేసిన అల్లరోడు.. ఇంత వైల్డ్ క్యారెక్టర్ చేయడం అనూహ్యం. సాయిధరమ్ తేజ్తో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తీసిన సుబ్బు మంగాదేవి ఈ చిత్రాన్ని రూపొందించగా.. ఇందులో నరేష్ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటించింది. ఈ నెల 20న సినిమా రిలీజవుతుండగా.. ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on December 16, 2024 5:38 pm
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…