ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ కు సంబంధించిన చర్చే జరుగుతోంది. సంధ్య థియేటర్ దుర్ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు తనను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్న తరుణంలో బేబీ జాన్ ప్రమోషన్ ఈవెంట్లో హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు దాన్ని ఒకే వ్యక్తిపై నెట్టకూడదని, రక్షణ కల్పించాల్సిన బాధ్యత వ్యవస్థదని, చుట్టూ ఉన్న వాళ్లకు జాగ్రత్తలు చెప్పడం తప్ప మనమేం చేయగలమని అన్నాడు. చనిపోయిన వాళ్ళ పట్ల సానుభూతి ఉందని, వాళ్లకు సంతాపం ప్రకటిస్తున్నానని చెప్పిన వరుణ్ ధావన్ ప్రాక్టికల్ గా మాట్లాడాడు.
నిజానికి ఇలాంటివి జరగడం కొత్త కాదు. గతంలో థియేటర్ల దగ్గర కటవుట్లు కడుతున్నప్పుడు, బ్యానర్లు అలంకరిస్తున్నప్పుడు ఫ్యాన్స్ చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్లకు డబ్బు రూపంలో పరిహారం అందజేసిన హీరోలు టాలీవుడ్ లోనే ఎక్కువ. కానీ పుష్ప 2 మీద విపరీతమైన ఫోకస్ ఉన్న టైంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జాతీయ స్థాయిలో టాపిక్ గా మారిపోయింది. దానికి అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదని తెలిసినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. హీరో వస్తున్నాడని రెండు రోజుల ముందే పోలీసులను సెక్యూరిటీ అడిగిన థియేటర్ యాజమాన్యం లెటర్ తాజాగా బయటికొచ్చింది.
తేరి రీమేక్ గా రూపొందిన బేబీ జాన్ డిసెంబర్ 25 విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుణ్ ధావన్ పూర్తిగా ప్రమోషన్ల మీద దృష్టి పెట్టాడు. పుష్ప 2 హ్యాంగోవర్ లో ఉన్న బాలీవుడ్ ఆడియన్స్ ని దీనివైపు తిప్పడం పెద్ద సవాల్ గా మారింది. డిస్ట్రిబ్యూటర్లు సైతం కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో రావడం వల్ల ఓపెనింగ్స్ దెబ్బ తింటాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ ఇది కూడా ఫుల్ మాస్ కంటెంట్ ఉన్న మసాలా మూవీ. తెరీ ని మించి హీరోయిజమ్, విలన్ ట్రాక్ ని జోడించారు. కీర్తి సురేష్ ఒక హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం మీద మంచి బజ్ ఏర్పడుతోంది. దీన్ని తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ గా పవన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 13, 2024 4:13 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…