ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ కు సంబంధించిన చర్చే జరుగుతోంది. సంధ్య థియేటర్ దుర్ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు తనను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్న తరుణంలో బేబీ జాన్ ప్రమోషన్ ఈవెంట్లో హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు దాన్ని ఒకే వ్యక్తిపై నెట్టకూడదని, రక్షణ కల్పించాల్సిన బాధ్యత వ్యవస్థదని, చుట్టూ ఉన్న వాళ్లకు జాగ్రత్తలు చెప్పడం తప్ప మనమేం చేయగలమని అన్నాడు. చనిపోయిన వాళ్ళ పట్ల సానుభూతి ఉందని, వాళ్లకు సంతాపం ప్రకటిస్తున్నానని చెప్పిన వరుణ్ ధావన్ ప్రాక్టికల్ గా మాట్లాడాడు.
నిజానికి ఇలాంటివి జరగడం కొత్త కాదు. గతంలో థియేటర్ల దగ్గర కటవుట్లు కడుతున్నప్పుడు, బ్యానర్లు అలంకరిస్తున్నప్పుడు ఫ్యాన్స్ చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్లకు డబ్బు రూపంలో పరిహారం అందజేసిన హీరోలు టాలీవుడ్ లోనే ఎక్కువ. కానీ పుష్ప 2 మీద విపరీతమైన ఫోకస్ ఉన్న టైంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జాతీయ స్థాయిలో టాపిక్ గా మారిపోయింది. దానికి అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదని తెలిసినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. హీరో వస్తున్నాడని రెండు రోజుల ముందే పోలీసులను సెక్యూరిటీ అడిగిన థియేటర్ యాజమాన్యం లెటర్ తాజాగా బయటికొచ్చింది.
తేరి రీమేక్ గా రూపొందిన బేబీ జాన్ డిసెంబర్ 25 విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుణ్ ధావన్ పూర్తిగా ప్రమోషన్ల మీద దృష్టి పెట్టాడు. పుష్ప 2 హ్యాంగోవర్ లో ఉన్న బాలీవుడ్ ఆడియన్స్ ని దీనివైపు తిప్పడం పెద్ద సవాల్ గా మారింది. డిస్ట్రిబ్యూటర్లు సైతం కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో రావడం వల్ల ఓపెనింగ్స్ దెబ్బ తింటాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ ఇది కూడా ఫుల్ మాస్ కంటెంట్ ఉన్న మసాలా మూవీ. తెరీ ని మించి హీరోయిజమ్, విలన్ ట్రాక్ ని జోడించారు. కీర్తి సురేష్ ఒక హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం మీద మంచి బజ్ ఏర్పడుతోంది. దీన్ని తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ గా పవన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 13, 2024 4:13 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…