ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ కు సంబంధించిన చర్చే జరుగుతోంది. సంధ్య థియేటర్ దుర్ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు తనను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్న తరుణంలో బేబీ జాన్ ప్రమోషన్ ఈవెంట్లో హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు దాన్ని ఒకే వ్యక్తిపై నెట్టకూడదని, రక్షణ కల్పించాల్సిన బాధ్యత వ్యవస్థదని, చుట్టూ ఉన్న వాళ్లకు జాగ్రత్తలు చెప్పడం తప్ప మనమేం చేయగలమని అన్నాడు. చనిపోయిన వాళ్ళ పట్ల సానుభూతి ఉందని, వాళ్లకు సంతాపం ప్రకటిస్తున్నానని చెప్పిన వరుణ్ ధావన్ ప్రాక్టికల్ గా మాట్లాడాడు.
నిజానికి ఇలాంటివి జరగడం కొత్త కాదు. గతంలో థియేటర్ల దగ్గర కటవుట్లు కడుతున్నప్పుడు, బ్యానర్లు అలంకరిస్తున్నప్పుడు ఫ్యాన్స్ చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్లకు డబ్బు రూపంలో పరిహారం అందజేసిన హీరోలు టాలీవుడ్ లోనే ఎక్కువ. కానీ పుష్ప 2 మీద విపరీతమైన ఫోకస్ ఉన్న టైంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జాతీయ స్థాయిలో టాపిక్ గా మారిపోయింది. దానికి అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదని తెలిసినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. హీరో వస్తున్నాడని రెండు రోజుల ముందే పోలీసులను సెక్యూరిటీ అడిగిన థియేటర్ యాజమాన్యం లెటర్ తాజాగా బయటికొచ్చింది.
తేరి రీమేక్ గా రూపొందిన బేబీ జాన్ డిసెంబర్ 25 విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుణ్ ధావన్ పూర్తిగా ప్రమోషన్ల మీద దృష్టి పెట్టాడు. పుష్ప 2 హ్యాంగోవర్ లో ఉన్న బాలీవుడ్ ఆడియన్స్ ని దీనివైపు తిప్పడం పెద్ద సవాల్ గా మారింది. డిస్ట్రిబ్యూటర్లు సైతం కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో రావడం వల్ల ఓపెనింగ్స్ దెబ్బ తింటాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ ఇది కూడా ఫుల్ మాస్ కంటెంట్ ఉన్న మసాలా మూవీ. తెరీ ని మించి హీరోయిజమ్, విలన్ ట్రాక్ ని జోడించారు. కీర్తి సురేష్ ఒక హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం మీద మంచి బజ్ ఏర్పడుతోంది. దీన్ని తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ గా పవన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 13, 2024 4:13 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…