ఆలూ లేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనేది పాత సామెత. అయినా సరే ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ స్పిరిట్ స్టోరీ ఇదేనంటూ ఒక ఆన్ లైన్ డిస్కషన్ ప్లాట్ ఫార్మ్ నుంచి తీసుకున్న పాయింట్ తో ప్రభాస్ అభిమానులు ట్విట్టర్ వేదికగా తెగ చర్చలు చేస్తున్నారు. పోయిన తన ఉద్యోగం రాబట్టుకోవడం కోసం ఎంతకైనా తెగించే ఒక పోలీస్ ఆఫీసర్ క్రూరమైన ఇంటర్నేషనల్ ముఠా అంతు చూస్తాడనే కథతో సందీప్ రెడ్డి వంగా మెంటల్ ఎక్కిస్తాడట. నిజానికి ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ తో గతంలో కొన్ని వందల సినిమాలు వచ్చాయి.
కానీ సందీప్ వంగా ఆలోచనలు అంత రొటీన్ గా ఖచ్చితంగా ఉండవు. నెక్స్ట్ లెవెల్ మేకింగ్ తో థియేటర్ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తాడు. దాయాది అన్నదమ్ముల మధ్య యుద్ధాన్ని తండ్రి సెంటిమెంట్ కి ముడిపెట్టి వయొలెంట్ గా చూపించిన తీరు యానిమల్ ని బ్లాక్ బస్టర్ చేసింది. స్పిరిట్ కూడా అదే తరహాలో ఊహించని ట్రీట్ మెంట్ తో ఉంటుంది. సో ఇప్పుడు చక్కర్లు కొడుతున్న కథ నిజమైనా కాకపోయినా స్పిరిట్ గురించి ఇంత త్వరగా డిస్కషన్లు మాత్రం తొందరపాటే. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం సీరియస్ గా ఫోకస్ చేసిన ప్యాన్ ఇండియా సినిమాలు రెండు. ఒకటి ఫౌజీ, రెండోది ది రాజా సాబ్.
ముందు ఇవి రిలీజవుతాయి కాబట్టి వాటి గురించి మాట్లాడుకుంటే బెటరని ఇతర ఫ్యాన్స్ అభిప్రాయం. ఏప్రిల్ 10 రాజా సాబ్ వస్తుందో రాదోననే అనుమానాల నేపథ్యంలో ఒకవేళ అది కనక వాయిదా పడితే వేసవి బదులు దసరాకో దీపావళికో వెళ్ళిపోతుంది. అప్పుడు ఫౌజి 2026కి షిఫ్ట్ అవుతుంది. స్పిరిట్ ని వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో మొదలుపెట్టినా పూర్తవ్వడానికి కనీసం ఏడాదిన్నర పడుతుంది. సందీప్ వంగా పర్ఫెక్షన్ కోసం సమయాన్ని పట్టించుకోడనే సంగతి తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియని సలార్ 2 శౌర్యంగపర్వం, కల్కి 2ల గురించి కూడా ట్రెండింగ్ జరగడం గమనార్హం.
This post was last modified on December 12, 2024 5:31 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…