ఆలూ లేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనేది పాత సామెత. అయినా సరే ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ స్పిరిట్ స్టోరీ ఇదేనంటూ ఒక ఆన్ లైన్ డిస్కషన్ ప్లాట్ ఫార్మ్ నుంచి తీసుకున్న పాయింట్ తో ప్రభాస్ అభిమానులు ట్విట్టర్ వేదికగా తెగ చర్చలు చేస్తున్నారు. పోయిన తన ఉద్యోగం రాబట్టుకోవడం కోసం ఎంతకైనా తెగించే ఒక పోలీస్ ఆఫీసర్ క్రూరమైన ఇంటర్నేషనల్ ముఠా అంతు చూస్తాడనే కథతో సందీప్ రెడ్డి వంగా మెంటల్ ఎక్కిస్తాడట. నిజానికి ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ తో గతంలో కొన్ని వందల సినిమాలు వచ్చాయి.
కానీ సందీప్ వంగా ఆలోచనలు అంత రొటీన్ గా ఖచ్చితంగా ఉండవు. నెక్స్ట్ లెవెల్ మేకింగ్ తో థియేటర్ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తాడు. దాయాది అన్నదమ్ముల మధ్య యుద్ధాన్ని తండ్రి సెంటిమెంట్ కి ముడిపెట్టి వయొలెంట్ గా చూపించిన తీరు యానిమల్ ని బ్లాక్ బస్టర్ చేసింది. స్పిరిట్ కూడా అదే తరహాలో ఊహించని ట్రీట్ మెంట్ తో ఉంటుంది. సో ఇప్పుడు చక్కర్లు కొడుతున్న కథ నిజమైనా కాకపోయినా స్పిరిట్ గురించి ఇంత త్వరగా డిస్కషన్లు మాత్రం తొందరపాటే. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం సీరియస్ గా ఫోకస్ చేసిన ప్యాన్ ఇండియా సినిమాలు రెండు. ఒకటి ఫౌజీ, రెండోది ది రాజా సాబ్.
ముందు ఇవి రిలీజవుతాయి కాబట్టి వాటి గురించి మాట్లాడుకుంటే బెటరని ఇతర ఫ్యాన్స్ అభిప్రాయం. ఏప్రిల్ 10 రాజా సాబ్ వస్తుందో రాదోననే అనుమానాల నేపథ్యంలో ఒకవేళ అది కనక వాయిదా పడితే వేసవి బదులు దసరాకో దీపావళికో వెళ్ళిపోతుంది. అప్పుడు ఫౌజి 2026కి షిఫ్ట్ అవుతుంది. స్పిరిట్ ని వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో మొదలుపెట్టినా పూర్తవ్వడానికి కనీసం ఏడాదిన్నర పడుతుంది. సందీప్ వంగా పర్ఫెక్షన్ కోసం సమయాన్ని పట్టించుకోడనే సంగతి తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియని సలార్ 2 శౌర్యంగపర్వం, కల్కి 2ల గురించి కూడా ట్రెండింగ్ జరగడం గమనార్హం.
This post was last modified on December 12, 2024 5:31 pm
ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేస్తూ తనకో బ్లాక్ బస్టర్ ఇస్తాడని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మీద సూర్య పెట్టుకున్న నమ్మకం…
అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలకు ఇకపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఒక్కసారిగా…
గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా…
టీడీపీకి ప్రాణ సమానమైన కార్యక్రమం ఏదైనా ఉంటే.. అది మహానాడే. దివంగత ముఖ్యమంత్రి, తెలుగువారిఅన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని..…
మే 9 విడుదల కాబోతున్న సినిమాల్లో సమంత నిర్మించిన శుభం ఉంది. ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాదు ఒక క్యామియో…