డిసెంబర్ 5 విడుదల తేదీకి ముందు ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రచారాలు. ఒక కమర్షియల్ సినిమా సీక్వెల్ ఇంత బడ్జెట్ తో తీస్తే వర్కౌట్ అవుతుందా అని ఒకరు. అధిక శాతం మెగా ఫ్యాన్స్ సానుకూలంగా లేరు కాబట్టి వసూళ్ల మీద ప్రభావముంటుందని మరొకరు. అసలు బీహార్ వెళ్లి ఈవెంట్ చేస్తే హైప్ వస్తుందా అని ఇంకొందరు. మూడేళ్ళ సమయానికి న్యాయం జరుగుతుందా అని వేరొకరు. ఇలా చెప్పుకుంటూ పోతే పుష్ప 2 ది రూల్ రాకముందు ఎన్నెన్నో అనుమానాలు. కానీ ఈ ప్రచారమంతా గాలి బుడగేనని అడ్వాన్స్ బుకింగ్స్ తోనే తేటతెల్లమయ్యింది. కట్ చేస్తే వారం తిరక్కుండానే వెయ్యి కోట్ల గ్రాస్ దాటేసి పుష్ప 2 విజయగర్వంతో నిలిచింది.
ఇండియన్ ఫిలిం హిస్టరీలో అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ అందుకున్న తొలి సినిమాగా పుష్ప 2 ది రూల్ నిలిచింది. ఈ విషయంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాంటివాటిని దాటేయడం అరుదైన ఘనత. ఊహించని స్థాయిలో ఉత్తరాది రాష్ట్రాల్లో బన్నీ సాగించిన వసూళ్ల విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటిరోజు షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డునే దులిపేయడం మాములు విషయం కాదు. ముంబై, రాయ్ గడ్, పాట్నా ఇలా ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులతో అదిరిపోతున్న పబ్లిక్ టాక్ తో పుష్ప 2 దూసుకుపోయిన వైనం చూసి తలలు పండిన ట్రేడ్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టిన వైనం వాళ్ళ రిపోర్ట్స్ లో కనిపించింది.
కేవలం ఆరు రోజులకే ఈ ఫీట్ సాధించడం చాలా రోజులు గుర్తుండిపోతుంది. దగ్గర్లో గేమ్ ఛేంజర్ లాంటి ప్యాన్ ఇండియా రిలీజులు ఉన్నప్పటికీ పుష్ప 2ని దాటడం అంత సులభంగా ఉండదు. పుష్ప 3 ఉంటుందో లేదో ఖరారుగా తెలియకుండానే దాని కోసం ఎదురు చూస్తున్నామని హిందీ ఫ్యాన్స్ ఊగిపోతూ చెప్పడం పుష్పరాజ్ క్రేజ్ కు నిదర్శనం. టికెట్ రేట్లు ఈ వసూళ్లకు దోహదం చేసినా ఒకవేళ టాక్ ఏ మాత్రం అటుఇటు అయినా అదే శాపంగా మారేది. కానీ ప్రతి పైసాకు కంటెంట్ న్యాయం చేకూర్చడంతో ప్రేక్షకులు ఫిర్యాదు చేయలేదు. గంగమ్మ జాతరలోనే కాదు బాక్సాఫీస్ వద్ద కూడా పుష్పరాజ్ తాండవం మాములుగా లేదు.
This post was last modified on December 11, 2024 12:39 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…