మాటల మాంత్రికుడు కం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటిదాకా ప్యాన్ ఇండియా మూవీ తీయలేదు. రాజమౌళి, సుకుమార్ ల సరసన నిలుస్తున్నా సరే ఆయన పేరు ఇంకా హిందీ మార్కెట్ దాకా రీచ్ కాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా ఆ అవకాశం ఇస్తోంది. ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కాంబోనో చెప్పనక్కర్లేదు. జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి ఒకదాన్ని మించి మరొకటి ఘనవిజయం సాధించాయి. అల వైకుంఠపురములో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు సాధించింది. ఇప్పుడు నాలుగో సారి ఈ కాంబో చేతులు కలపబోతోంది. ఈసారి త్రివిక్రమ్ బాధ్యత చాలా అంటే చాలా పెరగనుంది. ఎలాగో చూద్దాం.
పుష్ప 2 ది రూల్ బాలీవుడ్ రికార్డుల బూజు దులిపాక బన్నీకి నేషన్ వైడ్ ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏ సినిమా అయినా సరే దాన్ని ఒకేసారి అన్ని భాషల్లో పెద్ద ఎత్తున విడుదల చేయాల్సి ఉంటుంది. అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సో త్రివిక్రమ్ ఇప్పటిదాకా చేసినవి తెలుగు ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా మెప్పించినవి. నార్త్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుంటే కొన్ని కీలక మార్పులు అవసరమవుతాయి. పుష్పలో సుకుమార్ చేసింది అదే. బాహుబలి ద్వారా జక్కన్న మాస్ పల్స్ అందుకుని దీని వల్లే. సో త్రివిక్రమ్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే యునివర్సల్ అప్పీల్ ఉంటుంది.
గుంటూరు కారంని హ్యాండిల్ చేసిన తీరు త్రివిక్రమ్ మీద విమర్శలు వచ్చేలా చేసింది. కమర్షియల్ గా డబ్బులు వచ్చాయేమో కానీ ఫ్యాన్స్ ని పూర్తిగా సంతృప్తిపరచని మాట వాస్తవం. ఆ మరక పోవాలంటే బన్నీ ప్రాజెక్టు నభూతో నభవిష్యత్ అనే రేంజ్ లో ఉండాలి. నాగవంశీ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఇది రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ అయితే కనక వెయ్యి కోట్లకు పైగానే టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎలాగూ అల్లు అర్జున్ పెరిగిన మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని మరింత కష్టపడతాడు. జనవరిలో అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేసి మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టే ప్రణాళిక జరుగుతోంది.
This post was last modified on December 11, 2024 11:09 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…