ఇప్పుడున్న ప్యాన్ ఇండియా హీరోల్లో ప్రభాస్ అంత వేగంగా సినిమాలు చేస్తున్న వాళ్ళు టాలీవుడ్ లోనే కాదు ఏ భాషలోనూ లేరు. ఒకేసారి రెండు మూడు సెట్ల మీద ఉంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా కూల్ గా ఉండటం డార్లింగ్ కే చెల్లింది. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ ( ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలో ది రాజా సాబ్ బ్యాలన్స్ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సెట్లలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఇటీవలే సలార్ నిర్మించిన హోంబాలే ఫిలిమ్స్ తో తనతో మూడు ప్రాజెక్టులు ప్రకటించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ ఏంటంటే ఒక ప్యాన్ ఇండియా మూవీకి కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కథను సమకూరుస్తారట. ప్రస్తుతం ఆయన కాంతార 2ని ఇదే బ్యానర్ లో చేస్తుండగా ఒక పవర్ఫుల్ సబ్జెక్టుని ఇటీవలే హోంబేలే మేకర్స్ కి వినిపించగా అది ప్రభాస్ కు బాగా సూటవుతుందని భావించి ఆ మేరకు లాక్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది. అయితే దర్శకుడు ఎవరన్నది మాత్రం సస్పెన్స్. సలార్ 2 కాకుండా మిగిలిన రెండింటిలో ఒకటి ప్రశాంత్ వర్మ మరొకటి లోకేష్ కనగరాజ్ చేస్తారని తొలుత వినిపించింది. కానీ అందులో వాస్తవం ఎంతవరకు ఉందో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతానికి హోంబాలే ప్రభాస్ ట్రయోలో పక్కాగా ఫిక్స్ అయినది సలార్ 2 శౌర్యంగ పర్వం మాత్రమే. మిగిలిన రెండింటికి డైరెక్టర్లు, ఇతర క్రూ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఇక రిషబ్ శెట్టి కాంతార 2 కాకుండా జై హనుమాన్, ఛత్రపతి వీరశివాజీలకు అఫీషియల్ గా ఓకే చెప్పాడు. మరో టాలీవుడ్ మూవీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇంకా ఫైనల్ కాలేదు. చూస్తుంటే ప్రభాస్ రాబోయే సంవత్సరాల్లో కూడా తగ్గేదేలే తరహాలో ఇదే దూకుడు కొనసాగించడం ఖాయమనేలా ఉంది. కల్కి 2898 ఏడి సీక్వెల్ కల్కి 2ని ఇంకో ఏడాది లేదా సంవత్సరంన్నర తర్వాత మొదలయ్యే అవకాశముంది. ఎప్పుడు రిలీజని మాత్రం అడగొద్దు.
This post was last modified on December 9, 2024 1:50 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…