నిన్న పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ల సందర్భంగా ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో జరిగిన తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి కన్నుమూయడం అభిమానులను తీవ్రంగా కలవరపరిచింది. పోలీసులు సకాలంలో స్పందించి ప్రాధమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆమె పిల్లలు శ్రీతేజ, శాన్వి ఐసియులో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. తండ్రి భాస్కర్ మాట్లాడుతూ కొడుకు అల్లు అర్జున్ వీరాభిమాని కావడం వల్లే బెనిఫిట్ షోకు వచ్చామని, బన్నీ రాకతో రద్దీ పెరిగి తమ కుటుంబానికి తీరని నష్టం జరిగిందని పేర్కొన్నాడు.
జరిగిన దుర్ఘటనకు అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. దురదృష్టకరంగా జరిగిన ఈ విషాదం నుంచి త్వరగా కోలుకునేందుకు తమ బృందం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని, పిల్లాడికి హాస్పిటల్ లో జరుగుతున్న ట్రీట్ మెంట్ ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని ట్వీట్ ద్వారా పేర్కొంది. తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. బన్నీ ఇప్పటిదాకా స్పందించలేదు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నట్టు సమాచారం. తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీస్ విచారణ జరుగుతోంది.
ఏది ఏమైనా ఇకపై స్పెషల్ షోలకు వెళ్లేముందు కుటుంబాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లల్ని తీసుకెళ్ళెప్పుడు పొంచి ఉన్న రిస్క్ గుర్తించాలి. రీ రిలీజులకే క్రాస్ రోడ్స్ ప్రాంతం బ్లాక్ అవుతూ ఉంటుంది. అలాంటిది పుష్ప 2 లాంటి ప్యాన్ ఇండియా మూవీ వచ్చినప్పుడు అందులోనూ హీరో స్వయంగా థియేటర్ విజిట్ చేసినప్పుడు జనాన్ని కంట్రోల్ చేయడం అంత సులభం కాదు. పెద్దలు ఆ ఒత్తిడిని తట్టుకుంటారు కానీ చిన్నపిల్లలు,మహిళలకు ఊపిరి ఆడని పరిస్థితి ఒక్కోసారి నెలకొంటుంది. పోయిన ప్రాణాలు ఎలాగూ తీసుకురాలేక పోయినా మిగిలినవాళ్ళకు ఈ ఉదంతం ఒక హెచ్చరికగా నిలిచిపోతుంది.
This post was last modified on December 5, 2024 3:23 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…