నిన్న పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ల సందర్భంగా ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో జరిగిన తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి కన్నుమూయడం అభిమానులను తీవ్రంగా కలవరపరిచింది. పోలీసులు సకాలంలో స్పందించి ప్రాధమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆమె పిల్లలు శ్రీతేజ, శాన్వి ఐసియులో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. తండ్రి భాస్కర్ మాట్లాడుతూ కొడుకు అల్లు అర్జున్ వీరాభిమాని కావడం వల్లే బెనిఫిట్ షోకు వచ్చామని, బన్నీ రాకతో రద్దీ పెరిగి తమ కుటుంబానికి తీరని నష్టం జరిగిందని పేర్కొన్నాడు.
జరిగిన దుర్ఘటనకు అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. దురదృష్టకరంగా జరిగిన ఈ విషాదం నుంచి త్వరగా కోలుకునేందుకు తమ బృందం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని, పిల్లాడికి హాస్పిటల్ లో జరుగుతున్న ట్రీట్ మెంట్ ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని ట్వీట్ ద్వారా పేర్కొంది. తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. బన్నీ ఇప్పటిదాకా స్పందించలేదు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నట్టు సమాచారం. తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీస్ విచారణ జరుగుతోంది.
ఏది ఏమైనా ఇకపై స్పెషల్ షోలకు వెళ్లేముందు కుటుంబాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లల్ని తీసుకెళ్ళెప్పుడు పొంచి ఉన్న రిస్క్ గుర్తించాలి. రీ రిలీజులకే క్రాస్ రోడ్స్ ప్రాంతం బ్లాక్ అవుతూ ఉంటుంది. అలాంటిది పుష్ప 2 లాంటి ప్యాన్ ఇండియా మూవీ వచ్చినప్పుడు అందులోనూ హీరో స్వయంగా థియేటర్ విజిట్ చేసినప్పుడు జనాన్ని కంట్రోల్ చేయడం అంత సులభం కాదు. పెద్దలు ఆ ఒత్తిడిని తట్టుకుంటారు కానీ చిన్నపిల్లలు,మహిళలకు ఊపిరి ఆడని పరిస్థితి ఒక్కోసారి నెలకొంటుంది. పోయిన ప్రాణాలు ఎలాగూ తీసుకురాలేక పోయినా మిగిలినవాళ్ళకు ఈ ఉదంతం ఒక హెచ్చరికగా నిలిచిపోతుంది.
This post was last modified on December 5, 2024 3:23 pm
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…