మొన్న ఈటీవీ విన్ ఓటిటిలో రిలీజైన ‘క’ దాదాపుగా ఒక రోజు మొత్తం పైరసీ కాకుండా కట్టడి చేయడంలో సదరు టీమ్ చేసిన కృషికి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి ఇంటర్నేషనల్ సంస్థలే ఈ సమస్యని పరిష్కరించలేక చేతులు ఎత్తేస్తే ప్యూర్ తెలుగు కంటెంట్ తో రనయ్యే లోకల్ యాప్ దాన్ని చేసి చూపించడం మాములు విషయం కాదు. అతి వేగంగా వంద మిలియన్ మినిట్స్ అందుకున్న సందర్భంగా ఆ విజయాన్ని పంచుకోవడానికి కిరణ్ అబ్బవరంతో పాటు ‘క’ టీమ్ ఇవాళ మీడియాతో ముచ్చట్టించింది. అందులో భాగంగా కొన్ని విశేషాలు, ఛాలెంజులు చోటు చేసుకున్నాయి.
ముప్పై సంవత్సరాల లోపు వయసున్న పాతిక మంది ఈటీవీ బృందంలో ఉన్నారని, ప్యాషన్ తో పని చేయడం వల్లే ‘క’ పైరసీని నిలవరించగలిగామని అన్నారు. కొందరు స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ని వాడి చేసినా తమ ఒరిజినల్ ఫైల్ ని క్రాక్ చేయలేకపోయారని, భవిష్యత్తులో ఏ రూపంలో అయినా పైరసీ చేయలేని విధంగా పలు మార్పులు చేయబోతున్నట్టు సంస్థ తరఫున ప్రతినిధి చెప్పుకొచ్చారు. మరో రెండు మూడు నెలల్లో సాధ్యమయ్యేలా ప్రణాళిక ఉందట. ఇదే నిజమైతే ఇండస్ట్రీకి, ఓటిటి సంస్థలు చాలా మేలు చేసినట్టు అవుతుంది. రీచ్, ఆదాయం రెండూ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి.
ఇతర ఓటిటి సంస్థలు దీన్ని అందిపుచ్చుకుంటాయి. వీడియో క్యాసెట్ల కాలం నుంచే ఇండస్ట్రీకి భూతంలా అవతరించిన పైరసీ రూపం మార్చుకుందే తప్ప చనిపోలేదు. బాహుబలి లాంటి ప్యాన్ ఇండియా సినిమాని సైతం వాళ్ళు వదల్లేదు. అప్పట్లో ఇది చేస్తున్న వాళ్లను ఇతర రాష్ట్రానికి వెళ్లి పట్టుకున్నారు కానీ తర్వాత మళ్ళీ పరిస్థితి మొదటికే వచ్చింది. సిడి ల నుంచి టొరెంట్ల దాకా, పెన్ డ్రైవ్ ల నుంచి టెలిగ్రామ్ దాకా ఇది కొనసాగుతూనే ఉంది. ఈటీవీ ఇలాంటి కఠిన చర్యలకు పూనుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏదైనా కొత్త సినిమా చూడాలంటే సదరు యాప్ లోకే వెళ్లడం ప్రేక్షకులకు అలవాటవుతుంది.
This post was last modified on November 30, 2024 6:58 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…