కరోనా దెబ్బకు అన్ని రంగాలూ దెబ్బ తిన్నవే. అందులోనూ సినీ రంగంపై పడ్డ ప్రభావం అలాంటిలాంటిది కాదు. ముఖ్యంగా సినీ రంగానికి ప్రాణవాయువు అనదగ్గ థియేటర్ ఇండస్ట్రీ కరోనా దెబ్బకు దారుణంగా దెబ్బ తింది. ఏడు నెలల పాటు థియేటర్లు మూతపడి వాటిని నమ్ముకున్న లక్షలాది మంది రోడ్ల మీదికి వచ్చేశారు. వాళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ నెల 15 నుంచి థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది.
కానీ థియేటర్లు నడిపించడానికి పెట్టిన షరతులు చూసి యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. అసలే కొత్త సినిమాలు లేవు. పైగా 50 శాతం కెపాసిటీతో నడిపించాలి. ప్రతి షోకు ముందు థియేటర్ మొత్తాన్ని శానిటైజ్ చేయించాలి. ఎక్కడికక్కడ థర్మల్ శానిటైజర్లు పెట్టాలి. థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి. ఇన్ని చేసినా జనాలు థియేటర్లకు ఏమాత్రం వచ్చి సినిమాలు చూస్తారన్నది అర్థం కావడం లేదు. అన్నింటికీ మించి వాళ్లను ఆకర్షించే పేరున్న కొత్త సినిమాలు రిలీజవుతాయా అన్నది ప్రశ్న.
మల్టీప్లెక్స్లను నడిపించే వాళ్ల స్థాయి వేరు. వాటిని తెరవడం, నామమాత్రంగా అయినా నడిపించడం అనివార్యం. కనీసం ఇంగ్లిష్ సినిమాలైనా ఏవైనా వేసి నడిపిస్తారు. కానీ సింగిల్ స్క్రీన్ల పరిస్థితే అయోమయంగా ఉంది. అక్కడ ఆడించే సినిమాలు ఇప్పట్లో రిలీజయ్యే అవకాశం లేదు. ఆ థియేటర్లను ప్రభుత్వం చెప్పిన పద్ధతిలో నడిపించడం చాలా కష్టం. పైగా అవి లీజుల్లో ఉంటాయి. వాళ్లు అంత బాధ్యత తీసుకుని షరతుల ప్రకారం థియేటర్లు నడిపిస్తారా అన్నది డౌటు. వీటిలో కరోనా నిబంధనలు పాటించడం, వాటిని మానిటర్ చేయడం అన్నది అంత తేలికైన విషయం కాదు.
ఇదిలా ఉంటే.. సింగిల్ స్క్రీన్లను మరింత ఇబ్బందికి గురి చేసే షరతు ఒకటి పెట్టారు. టికెట్లను కౌంటర్ దగ్గర అమ్మకూడదట. ఆన్ లైన్లోనే అమ్మకాలు చేపట్టాలట. బి, సి సెంటర్లలో చాలా థియేటర్లకు ఈ సౌలభ్యం లేదు. అసలు థియేటర్లు నడుస్తాయో లేదో తెలియకుండా ఇప్పటికిప్పుడు ఆన్ లైన్ టికెటింగ్లోకి వెళ్తారని అనుకోలేం. ఇక క్యాంటీన్లో అమ్మకాలపైనా షరతులున్నాయి.
కరోనాకు ముందే సింగిల్ స్క్రీన్ల పరిస్థితి ఏమంత బాగా లేదు. వైరస్ దెబ్బకు వాటి మనుగడే ప్రశ్నార్థకం అయింది. వాటిలో పని చేసేవాళ్లు చెల్లాచెదురైపోయారు. ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి జీతాలిస్తారో లేదో తెలియని స్థితిలో పని చేయించడం అంత తేలిక కాదు. ఈ పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్లను పూర్తిగా చంపేసేలా కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు.
This post was last modified on October 7, 2020 3:05 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…