అతి తక్కువ గ్యాప్ లో తమ కుటుంబానికి సంబంధించిన రెండు శుభవార్తలు పంచుకున్న నాగార్జున ఇద్దరు కొడుకులు వైవాహిక జీవితాల్లోకి అడుగుపెట్టే క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4 అన్నపూర్ణ స్టూడియోస్ లో పరిమిత అతిథుల మధ్య జరగబోతున్న సంగతి తెలిసిందే. బాగా సన్నిహితులైన మూడు వందల అతిథుల మధ్య ఏఎన్ఆర్ విగ్రహం సాక్షిగా ఈ మధురఘట్టం జరగబోతోంది. ఈ ఆనందాన్ని ఫ్యాన్స్ ఆస్వాదిస్తూ ఉండగానే అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రవ్ జీ తో జరిగిన గుడ్ న్యూస్ ని వెంటనే పంచుకున్నారు నాగ్. దీంతో అభిమానులు డబుల్ హ్యాపీ.
అయితే రెండు వేడుకలు ఒకేసారి జరుగుతాయన్న ప్రచారాన్ని నాగ్ కొట్టిపారేశారు. ముందు చైతు పెళ్ళయ్యాక 2025 ప్రారంభంలో అఖిల్ ది జరిపించేలా ప్లాన్ చేస్తున్నారట. మాములుగా హిందూ సంప్రదాయాల్లో ఒకే రోజు అన్నదమ్ముల పెళ్లిళ్లు చేయడం అరుదు. మంచిది కాదని కూడా అంటారు. సినిమాల్లో చేసినట్టు చూపిస్తారు కానీ నిజ జీవితంలో తక్కువ. అందుకే చైతు, అఖిల్ వేడుకలు వేర్వేరుగా ఉండబోతున్నాయి. నెట్ ఫ్లిక్స్ చైతు పెళ్లి హక్కులను యాభై కోట్లకు తీసుకుందనే ప్రచారానికి చెక్ పెడుతూ అలాంటిదేమి లేదని అక్కినేని ఫ్యామిలీ నుంచి మొన్నే క్లారిటీ వచ్చేసింది.
అఖిల్ పెళ్ళి ఎక్కడ ఎప్పుడు జరగబోతోందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ముహూర్తం తదితర వివరాలు ఇంకా వెల్లడి చేయలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే తండేల్ ఫిబ్రవరిలో విడుదల కానుండగా అఖిల్ 6 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. నాగార్జున కుబేర, కూలిలతో వచ్చే సంవత్సరం పలకరించబోతున్నారు. కొంత కాలంగా హిట్ లేక డల్లుగా ఉన్న అక్కినేని ఫ్యాన్స్ కు 2025 ఫుల్ జోష్ ఇవ్వనుంది. బ్రదర్స్ పెళ్లిళ్లతో పాటు కొత్త రిలీజులు వరసగా సందడి చేయబోతున్నాయి. ఫ్యామిలీలో అడుగు పెట్టబోతున్న శోభిత, జైనబ్ లు ఎలాంటి లక్కు తీసుకొస్తారో చూడాలి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…