టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉచిత ఇసుక పథకానికి గ్రహణం వీడడం లేదు. ఎన్నోసార్లు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని తమ్ముళ్లకు చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. అయినా.. ఎక్కడా అధినేత మాటను వంటబట్టించుకున్న నాయకులు కనిపించడం లేదు. దాదాపు నాలుగు నెలలుగా ఇదే తంతు నడుస్తోంది. చంద్రబాబు చెబుతున్నా.. నాయకులు వినిపించుకోవడం లేదు.
తాజాగా మరోసారి చంద్రబాబు హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు తాజాగా ఇసుక విషయంపై చంద్రబాబును కలుసుకున్నారు. చిత్రం ఏంటంటే వీరంతా కూడా.. టీడీపీ సానుకూల కాంట్రాక్టర్లు. అయినప్పటికీ.. వీరికిసైతం ఇసుక లభించడం లేదన్నది వారు చెబుతున్న మాట. ప్రతి లారీకీ ఇంతని వసూలు చేస్తున్నారని పేర్కొంటూ.. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల పేర్లతో జాబితానే ఇచ్చారు.
ఇదేసమయంలో ఎయే లారీలకు ఎప్పుడెప్పుడు ఎంతెంత వసూలు చేసింది కూడా ఆధారాలతో చంద్ర బాబు ముందు పెట్టారని తెలిసింది. ఈ వివరాలు చూసిన అధినేత నివ్వెరపోయారు. పరిస్థితిలో మార్పు రావడం లేదని.. ఇలా అయితే కష్టేనని చంద్రబాబు భావిస్తున్నారు. కాంట్రాక్టర్ల పరిస్థితి, అందునా టీడీపీ అనుకూల కాంట్రాక్టర్ల పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని అధికారులను నిలదీశారు. ఇసుక విషయంలో మాట రావడానికి వీల్లేదని చెప్పారు.
ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం నుంచి తానే స్వయంగా ఇసుకపై పరిశీలన చేస్తానని కూడా చంద్రబా బు తేల్చిచెప్పారు. ప్రతి విషయాన్ని తనకు చెప్పాలని.. ఎవరు ఎక్కడ దందాలకు పాల్పడినా ఊరుకునేది లేదన్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు సీనియర్లు కావడం.. వారికి పార్టీతో ఎనలేని అనుబంధం ఉండడంతో చంద్రబాబు వారిని నేరుగా హెచ్చరించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన తలపట్టుకుంటున్నారు.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…