టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉచిత ఇసుక పథకానికి గ్రహణం వీడడం లేదు. ఎన్నోసార్లు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని తమ్ముళ్లకు చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. అయినా.. ఎక్కడా అధినేత మాటను వంటబట్టించుకున్న నాయకులు కనిపించడం లేదు. దాదాపు నాలుగు నెలలుగా ఇదే తంతు నడుస్తోంది. చంద్రబాబు చెబుతున్నా.. నాయకులు వినిపించుకోవడం లేదు.
తాజాగా మరోసారి చంద్రబాబు హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు తాజాగా ఇసుక విషయంపై చంద్రబాబును కలుసుకున్నారు. చిత్రం ఏంటంటే వీరంతా కూడా.. టీడీపీ సానుకూల కాంట్రాక్టర్లు. అయినప్పటికీ.. వీరికిసైతం ఇసుక లభించడం లేదన్నది వారు చెబుతున్న మాట. ప్రతి లారీకీ ఇంతని వసూలు చేస్తున్నారని పేర్కొంటూ.. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల పేర్లతో జాబితానే ఇచ్చారు.
ఇదేసమయంలో ఎయే లారీలకు ఎప్పుడెప్పుడు ఎంతెంత వసూలు చేసింది కూడా ఆధారాలతో చంద్ర బాబు ముందు పెట్టారని తెలిసింది. ఈ వివరాలు చూసిన అధినేత నివ్వెరపోయారు. పరిస్థితిలో మార్పు రావడం లేదని.. ఇలా అయితే కష్టేనని చంద్రబాబు భావిస్తున్నారు. కాంట్రాక్టర్ల పరిస్థితి, అందునా టీడీపీ అనుకూల కాంట్రాక్టర్ల పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని అధికారులను నిలదీశారు. ఇసుక విషయంలో మాట రావడానికి వీల్లేదని చెప్పారు.
ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం నుంచి తానే స్వయంగా ఇసుకపై పరిశీలన చేస్తానని కూడా చంద్రబా బు తేల్చిచెప్పారు. ప్రతి విషయాన్ని తనకు చెప్పాలని.. ఎవరు ఎక్కడ దందాలకు పాల్పడినా ఊరుకునేది లేదన్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు సీనియర్లు కావడం.. వారికి పార్టీతో ఎనలేని అనుబంధం ఉండడంతో చంద్రబాబు వారిని నేరుగా హెచ్చరించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన తలపట్టుకుంటున్నారు.
This post was last modified on November 28, 2024 12:55 pm
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. బాలీవుడ్ నిర్మాత జాకీ…
టిడిపి తరఫున బలమైన గళం వినిపించే వారి కోసం పార్టీలో వెతుకుతున్నారు. వివాదరహితంగా పార్టీ పరంగా ప్రజలకు సంక్షేమ పథకాలు…
బాలీవుడ్లో వచ్చిన కల్ట్ బ్లాక్ బస్టర్ విక్కీ డోనర్ చూసిన ప్రేక్షకులు ఎవ్వరూ అందులో డాక్టర్ గా కీలక పాత్ర…
ఆరేళ్ల ముందు కొవిడ్ టైంలో థియేటర్లు మూతపడడంతో.. ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం ఒక్కసారిగా ఓటీటీలు విజృంభించేశాయి. ఫిలిం…
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…