పుష్ప 2 ది రూల్ కు బ్యాక్ గ్రౌండ్ అందించే బాధ్యతను దేవిశ్రీ ప్రసాద్ నుంచి తమన్ తో పాటు మరో ఇద్దరికీ బదలాయింపు చేయడం కొద్దిరోజుల క్రితం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు ఏమిటనే కారణాలు రకరకాలుగా వినిపించాయి కానీ తెరవెనుక ఏం జరిగిందనేది ఇప్పటికీ సస్పెన్సే. ప్రీ రిలీజ్ ప్రమోషన్లలో దేవినో సుకుమారో ఎవరో ఒకరు దీని గురించి మాట్లాడితే తప్ప క్లారిటీ రాదు. బీజీఎమ్ ఇవ్వడంలో వన్ అఫ్ ది బెస్ట్ గా రెండు దశాబ్దాలుగా పేరు తెచ్చుకున్న డిఎస్పికి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం విచిత్రమే. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. మరో సినిమా ఈ లిస్టులో చేరుతోందట.
అజిత్ హీరోగా మార్క్ ఆంటోనీ ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీకు తొలుత తీసుకున్న సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాదే. అయితే దీని నేపధ్య సంగీతాన్ని జివి ప్రకాష్ కుమార్ తో చేయించే ఆలోచనలు జరుగుతున్నట్టు వచ్చిన వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. దీనికీ అధికారిక ధృవీకరణ లేదు కానీ నిప్పు లేనిదే పొగరాదు తరహాలో చెన్నై వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. గమనించాల్సిన విషయం ఏంటంటే పుష్ప 2, గుడ్ బ్యాడ్ ఆగ్లీ రెండూ మైత్రి మూవీ మేకర్స్ వే. ఈ మతలబు ఏమైనా దేవిశ్రీ ప్రసాద్ మార్పుకు దారి తీసిందేమో ప్రస్తుతానికి సస్పెన్స్.
2025 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేసుకున్న గుడ్ బ్యాడ్ అగ్లీ తొలుత పండక్కు రాదనే ప్రచారం జరిగింది కానీ మైత్రి మాత్రం పొంగల్ ని వదలుకుంటే భారీ వసూళ్లు మిస్ అవుతామనే ఉద్దేశంతో ఆఘమేఘాల మీద పనులు చేయిస్తున్నట్టు టాక్. అందుకే ఆ ఒత్తిడి వద్దనుకునే దేవి నో చెప్పాడో లేక అజిత్ టీమ్ వద్దనుకున్నారో తెలియదు. తెలుగులో డిస్ట్రిబ్యూటర్లకు రిలీజ్ డేట్ గురించి ఇప్పటికే సమాచారం వెళ్లిపోయింది. కొన్ని ఏరియాల్లో డాకు మహారాజ్ ని పంపిణి చేస్తున్న మైత్రి దాంతో పాటుగా గుడ్ బ్యాడ్ అగ్లీ అగ్రిమెంట్లు చేసుకుంటోందని వినికిడి. స్పష్టత కోసం ఇంకొద్దిరోజుల్లో వేచి చూడక తప్పదు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…