Movie News

DSP వెనుక ఏం జరుగుతోంది

పుష్ప 2 ది రూల్ కు బ్యాక్ గ్రౌండ్ అందించే బాధ్యతను దేవిశ్రీ ప్రసాద్ నుంచి తమన్ తో పాటు మరో ఇద్దరికీ బదలాయింపు చేయడం కొద్దిరోజుల క్రితం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు ఏమిటనే కారణాలు రకరకాలుగా వినిపించాయి కానీ తెరవెనుక ఏం జరిగిందనేది ఇప్పటికీ సస్పెన్సే. ప్రీ రిలీజ్ ప్రమోషన్లలో దేవినో సుకుమారో ఎవరో ఒకరు దీని గురించి మాట్లాడితే తప్ప క్లారిటీ రాదు. బీజీఎమ్ ఇవ్వడంలో వన్ అఫ్ ది బెస్ట్ గా రెండు దశాబ్దాలుగా పేరు తెచ్చుకున్న డిఎస్పికి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం విచిత్రమే. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. మరో సినిమా ఈ లిస్టులో చేరుతోందట.

అజిత్ హీరోగా మార్క్ ఆంటోనీ ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీకు తొలుత తీసుకున్న సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాదే. అయితే దీని నేపధ్య సంగీతాన్ని జివి ప్రకాష్ కుమార్ తో చేయించే ఆలోచనలు జరుగుతున్నట్టు వచ్చిన వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. దీనికీ అధికారిక ధృవీకరణ లేదు కానీ నిప్పు లేనిదే పొగరాదు తరహాలో చెన్నై వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. గమనించాల్సిన విషయం ఏంటంటే పుష్ప 2, గుడ్ బ్యాడ్ ఆగ్లీ రెండూ మైత్రి మూవీ మేకర్స్ వే. ఈ మతలబు ఏమైనా దేవిశ్రీ ప్రసాద్ మార్పుకు దారి తీసిందేమో ప్రస్తుతానికి సస్పెన్స్.

2025 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేసుకున్న గుడ్ బ్యాడ్ అగ్లీ తొలుత పండక్కు రాదనే ప్రచారం జరిగింది కానీ మైత్రి మాత్రం పొంగల్ ని వదలుకుంటే భారీ వసూళ్లు మిస్ అవుతామనే ఉద్దేశంతో ఆఘమేఘాల మీద పనులు చేయిస్తున్నట్టు టాక్. అందుకే ఆ ఒత్తిడి వద్దనుకునే దేవి నో చెప్పాడో లేక అజిత్ టీమ్ వద్దనుకున్నారో తెలియదు. తెలుగులో డిస్ట్రిబ్యూటర్లకు రిలీజ్ డేట్ గురించి ఇప్పటికే సమాచారం వెళ్లిపోయింది. కొన్ని ఏరియాల్లో డాకు మహారాజ్ ని పంపిణి చేస్తున్న మైత్రి దాంతో పాటుగా గుడ్ బ్యాడ్ అగ్లీ అగ్రిమెంట్లు చేసుకుంటోందని వినికిడి. స్పష్టత కోసం ఇంకొద్దిరోజుల్లో వేచి చూడక తప్పదు.

This post was last modified on November 25, 2024 6:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

8 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago