పుష్ప 2 ది రూల్ నేపధ్య సంగీతం ఇతరులకు వెళ్ళిపోయిన నేపథ్యంలో చెన్నైలో జరిగే కిస్సిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ ఏం మాట్లాడతాడనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్టే దేవి చాలా స్మూత్ గా సెటైర్లు వేసి ఫ్యాన్స్ కి విషయం చెప్పీ చెప్పనట్టు ఊరించాడు. ఏదైనా మనం అడిగి తీసుకోవాలని, అడగకుండా ఎవరూ ఇవ్వరని, నిర్మాతల దగ్గర పేమెంట్ అయినా తెరమీద దక్కాల్సిన క్రెడిట్ అయినా అడగాల్సిందేననన్నాడు. దీని వెనుక ఎన్నో అర్థాలు వస్తాయి. ఫలానా టైంకి బీజీఎమ్ కావాలని తనను అడగకపోవడం వల్లే తప్పుకోవాల్సి వచ్చిందనే భావన వినిపించింది.
దేవిని నిర్మాతలు అడగలేదా లేక, ఎందుకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకొకరికి ఇస్తున్నారని తనే ప్రొడ్యూసర్లను అడగలేదా, లేక ఇంత ఒత్తిడితో చేస్తే క్వాలిటీ తగ్గుతుందని భావించి తనే తప్పుకున్నాడా కారణాలు తెలియదు కానీ మొత్తానికి దేవి చురకలు బాగున్నాయి. ఇక ఇతర విషయాల గురించి మాట్లాడుతూ స్టార్ హీరోయిన్లు మొదటిసారి ఐటెం సాంగ్ చేసేటప్పుడు తన కంపోజింగ్ లోనే వచ్చాయని కొన్ని ఉదాహరణలు వివరించాడు. రంగస్థలం (పూజా హెగ్డే), అందమైన తారల స్పెషల్ సాంగ్ (కింగ్), పుష్ప 1 (సమంత), నే పక్కా లోకల్ (జనతా గ్యారేజ్) ఇవన్నీ తన పాటలేనని చెప్పుకొచ్చాడు.
ఇక్కడితో అయిపోలేదు. నిర్మాత రవిని ఉద్దేశించి నా మీద ప్రేమతో పాటు కంప్లయింట్స్ కూడా మీకు ఎక్కువని, టైంకి చెప్పినవి ఇవ్వలేదని ఫీలవుతారని చెబుతూ స్టేజి మీద ఆలస్యానికి కారణం కూడా తనదైన శైలిలో వివరించాడు. మొత్తానికి స్పీచ్ లో మాత్రం కూల్ ఫైర్ కనిపిచింది. ఇక తాజాగా వదిలిన కిస్ కిస్ కిసిక్కు దెబ్బలు పడతాయి కూడా హిట్టు ఖాతాలో వెళ్లేలా ఉంది.. శ్రీలీల గ్లామర్ తో పాటు బన్నీతో కలిసి ఆమె చేసిన హుషారు డాన్సులు ఓ రేంజ్ లో పేలేలా ఉన్నాయి. ఈ పాట మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో అభిమానుల చూపు దీని మీదే ఉంది. ఏ రేంజ్ అన్నది ఇంకో రెండు మూడు రోజులు ఆగాలి.
This post was last modified on November 24, 2024 10:58 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…