దృశ్యంతో ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని సృష్టించిన జీతూ జోసెఫ్ ప్రభావం మలయాళ పరిశ్రమ మీద చాలా బలంగా ఉంది. ఒక ట్రెండ్ గా మారిపోయిన ఈ విభాగంలో తర్వాత చాలా సినిమాలొచ్చాయి. అధిక శాతం విజయం సాధించాయి. ఆ మధ్య కిష్కింద కాండం థియేటర్లో వచ్చినప్పుడు తెలుగు రిలీజ్ కాకపోయినా సరే హైదరాబాద్ జనాలు సబ్ టైటిల్స్ తో చూసి మరీ ఎంజాయ్ చేశారు. ఇటీవలే హాట్ స్టార్ లో అన్ని బాషల డబ్బింగ్ తో పొందుపరిచాక సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా ఇదే కోవలో రిలీజైన సూక్ష్మదర్శిని సైతం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తూ వసూళ్లు కొల్లగొడుతోంది.
అంటే సుందరానికిలో నాని సరసన నటించి టాలీవుడ్ కు పరిచయమైన నజ్రియా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథ కాదు. వినడానికి సింపుల్ గా అనిపిస్తుంది. పక్కింట్లో ఉన్న బామ్మ హఠాత్తుగా మాయం కావడంతో ఆమె కొడుకు మాన్యుయెల్ మీద నజ్రియా అనుమానం పడుతుంది. స్వతహాగా డిటెక్టివ్ స్వభావమున్న ఈ గృహిణి పెద్దావిడ ఎక్కడికి వెళ్లిందన్న దాని మీద పరిశోధన మొదలుపెడుతుంది. తర్వాత జరిగేది తెరమీద చూస్తేనే మజా. ఊహించని మలుపులు, ఆడియన్స్ ని చిక్కుముడిలో పెడుతూ క్లైమాక్స్ లో అదిరిపోయే షాక్ ఇస్తాయి.
ఇది రీమేక్ జరిగితే మన దగ్గర వర్కౌట్ అవుతుందా అంటే చెప్పలేం కానీ అలాంటి రిస్క్ చేయకుండా యధావిధిగా ఒరిజినల్ వెర్షన్ చూస్తేనే కిక్ దక్కుతుంది. హింస, రక్తపాతం, జుగుప్స కలిగించే సన్నివేశాలు ఇవేవి లేకుండా ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే రాయొచ్చని దర్శకుడు ఎంసి జితిన్ నిరూపించాడు. మంజుమ్మల్ బాయ్స్, తలవన్, ఇరట్ట లాంటి థ్రిల్లర్స్ సరసన ప్రత్యేక చోటు దక్కించుకుంటున్న సూక్ష్మ దర్శిని ప్రస్తుతం హైదరాబాద్ లో హౌస్ ఫుల్ షోలతో ప్రదర్శించబడుతోంది. డైరెక్ట్ ఓటిటిలో కాకుండా తెలుగు అనువాదాలు థియేటర్లకు తీసుకొస్తే వర్కౌట్ అవుతుందేమో చూడాలి.
This post was last modified on November 24, 2024 6:30 pm
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…