నాగచైతన్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తండేల్ నుంచి నిన్న మొదటి ఆడియో సింగల్ రిలీజయ్యింది. అక్కినేని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అందుకే ముందు సంక్రాంతికే అనుకున్నా పోటీ ఒత్తిడిలో నలిగిపోకూడదనే ఉద్దేశంతో ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు. ఖచ్చితంగా వంద కోట్ల గ్రాస్ తెస్తుందనే నమ్మకాన్ని నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాస్ వ్యక్తం చేయడం హైప్ ని పెంచేసింది. ఇక బుజ్జి తల్లి పాట విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ లోని వింటేజ్ స్టైల్ ని బయటికి తెచ్చిందని మూవీ లవర్స్ సంతోషపడుతున్నారు.
చాలా కూల్ మెలోడీగా, ఇష్టసఖిని ప్రియుడు ఎంతగా ఆరాధిస్తున్నాడో గీత రచయిత శ్రీమణి వర్ణించిన తీరు హృద్యంగా ఉంది. నీరు లేని చాపల్లే, తారలేని నింగల్లే అంటూ బుజ్జితల్లి గురించి సముద్రం భాషలోనే వ్యక్తపరచడం అచ్చ తెలుగులో స్వచ్ఛంగా సాగింది. జావేద్ ఆలీ గాత్రం ప్రాణం పోయగా వీడియోలో పొందుపరిచిన చైతు, సాయిపల్లవి విజువల్స్ అంతే ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఒకప్పుడు వర్షం, ఆర్య, నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో వినిపించే స్మూత్ నెస్ దేవి మళ్ళీ ఇందులో వినిపించాడు. రంగస్థలం, ఉప్పెన తర్వాత డిఎస్పి నుంచి మళ్ళీ ఆ రేంజ్ ఆల్బమ్ తండేల్ అవ్వడం చాలా అవసరం.
పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు వేరొకరికి ఇవ్వడం, కంగువ మ్యూజిక్ గురించి నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడం దేవి అభిమానులను కలవరానికి గురి చేసింది. తిరిగి తానేంటో ప్రూవ్ చేయడానికి ఉన్న ఆయుధం తండేల్. ఎమోషనల్ లవ్ స్టోరీ అయినప్పటికీ దేవి మార్కు ఉంటే ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు కనక సరిగ్గా పడితే సినిమా విజయానికి దోహదం చేస్తాయి. బుజ్జితల్లి విన్నాక ఫ్యాన్స్ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ మీద వంద కోట్ల దాకా బడ్జెట్ పెట్టారనే టాక్ ఉంది. చైతు దీని కోసమే మానసికంగా, శారీరకంగా చాలా కష్టపడ్డాడు. దానికి తగ్గ ఫలితం దక్కాలి.
This post was last modified on November 22, 2024 11:15 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…