శివమణి సినిమా గుర్తుందా. అందులో నాగార్జున ఫోన్ నెంబర్ గా కొన్ని అంకెలను క్యాప్షన్ గా పెడితే దాన్ని సొంతం చేసుకునేందుకు లక్షల మంది ఫ్యాన్స్ పోటీ పడ్డారు. అది దొరకదని తెలిసినా ఏదో ప్రయత్నించారు. అందులో ఎంఎస్ నారాయణకు షేక్ ఇమాం పేరుతో వచ్చే రాంగ్ కాల్స్ తో నరకం అనుభవించే కామెడీ ఎపిసోడ్ భలేగా పేలింది.
ఇప్పుడలాంటి అనుభవమే ఒక విదార్థికి ఎదురయ్యింది. బాక్సాఫీస్ వద్ద మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసిన బ్లాక్ బస్టర్ అమరన్ లో సాయిపల్లవి తన ఫోన్ నెంబర్ శివ కార్తికేయన్ కు ఇచ్చే సీన్ ఒకటి ఉంటుంది. చూసేవాళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది.
కట్ చేస్తే అది తమిళనాడుకి చెందిన వివి వగీశన్ అనే ఇంజనీరింగ్ విద్యార్ధిది. అమరన్ రిలీజయ్యాక అది నిజమనుకుని సాయిపల్లవి అభిమానులు ఏకధాటిగా దానికి కాల్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో వగీషన్ జీవితం మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ఎవరెవరో చేస్తున్న ఫోన్లకు తల్లడిల్లిపోయాడు. కనీసం క్యాబ్ బుక్ చేసుకుందామన్న వీలు లేనంతగా ఎంగేజ్ ఉండాల్సి రావడంతో ఇతని సహనం పతాక స్థాయికి చేరుకుంది. దాంతో కోటి పది లక్షల పరిహారం డిమాండ్ చేస్తూ ఏకంగా న్యాయ స్థానాన్ని ఆశ్రయించి నిర్మాతకు కోర్టు నోటీసులు పంపాడు.
ఇంకా హియరింగ్ కు రాలేదు కానీ కుర్రాడికి ఎలాంటి న్యాయం దక్కుతుందో చూడాలి. అయినా డైలాగులు రాసేటప్పుడు ఆ నెంబర్ చెలామణిలో ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత రచయిత, దర్శకుడిదే. ఏదో తోచింది పెట్టేస్తే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. ఎందుకంటే ఫ్యాన్స్ కి ఎమోషన్స్ తో పనుండదు. ఎగ్జైట్ మెంట్ తప్ప ఇంకేదీ పట్టించుకోరు.
సాయిపల్లవి నెంబరని భావించడానికి వాళ్ళ అమాయకత్వం ప్రేరేపించి ఉంటుంది. కానీ వగీషన్ ప్రత్యక్షంగా చూస్తున్న నరకానికి ఎవరు బాధ్యులు. అమరన్ నిర్మాత రాజ్ కమల్ అధినేత కమల్ హాసన్ దీన్ని ఎలా ఎదురుకుంటారో.
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…
టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…