శివమణి సినిమా గుర్తుందా. అందులో నాగార్జున ఫోన్ నెంబర్ గా కొన్ని అంకెలను క్యాప్షన్ గా పెడితే దాన్ని సొంతం చేసుకునేందుకు లక్షల మంది ఫ్యాన్స్ పోటీ పడ్డారు. అది దొరకదని తెలిసినా ఏదో ప్రయత్నించారు. అందులో ఎంఎస్ నారాయణకు షేక్ ఇమాం పేరుతో వచ్చే రాంగ్ కాల్స్ తో నరకం అనుభవించే కామెడీ ఎపిసోడ్ భలేగా పేలింది.
ఇప్పుడలాంటి అనుభవమే ఒక విదార్థికి ఎదురయ్యింది. బాక్సాఫీస్ వద్ద మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసిన బ్లాక్ బస్టర్ అమరన్ లో సాయిపల్లవి తన ఫోన్ నెంబర్ శివ కార్తికేయన్ కు ఇచ్చే సీన్ ఒకటి ఉంటుంది. చూసేవాళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది.
కట్ చేస్తే అది తమిళనాడుకి చెందిన వివి వగీశన్ అనే ఇంజనీరింగ్ విద్యార్ధిది. అమరన్ రిలీజయ్యాక అది నిజమనుకుని సాయిపల్లవి అభిమానులు ఏకధాటిగా దానికి కాల్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో వగీషన్ జీవితం మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ఎవరెవరో చేస్తున్న ఫోన్లకు తల్లడిల్లిపోయాడు. కనీసం క్యాబ్ బుక్ చేసుకుందామన్న వీలు లేనంతగా ఎంగేజ్ ఉండాల్సి రావడంతో ఇతని సహనం పతాక స్థాయికి చేరుకుంది. దాంతో కోటి పది లక్షల పరిహారం డిమాండ్ చేస్తూ ఏకంగా న్యాయ స్థానాన్ని ఆశ్రయించి నిర్మాతకు కోర్టు నోటీసులు పంపాడు.
ఇంకా హియరింగ్ కు రాలేదు కానీ కుర్రాడికి ఎలాంటి న్యాయం దక్కుతుందో చూడాలి. అయినా డైలాగులు రాసేటప్పుడు ఆ నెంబర్ చెలామణిలో ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత రచయిత, దర్శకుడిదే. ఏదో తోచింది పెట్టేస్తే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. ఎందుకంటే ఫ్యాన్స్ కి ఎమోషన్స్ తో పనుండదు. ఎగ్జైట్ మెంట్ తప్ప ఇంకేదీ పట్టించుకోరు.
సాయిపల్లవి నెంబరని భావించడానికి వాళ్ళ అమాయకత్వం ప్రేరేపించి ఉంటుంది. కానీ వగీషన్ ప్రత్యక్షంగా చూస్తున్న నరకానికి ఎవరు బాధ్యులు. అమరన్ నిర్మాత రాజ్ కమల్ అధినేత కమల్ హాసన్ దీన్ని ఎలా ఎదురుకుంటారో.
This post was last modified on November 21, 2024 7:35 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…