కొన్ని రోజుల కిందట నయనతార-ధనుష్ మధ్య గొడవ సోషల్ మీడియాను ఎలా కుదిపేసిందో తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం, ఫిలిం కెరీర్ నేపథ్యంగా నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ కోసం ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ‘నానుం రౌడీ దా’ సినిమా నుంచి ఫుటేజ్ వాడుకోవడానికి అంగీకరించకపోవడాన్ని తప్పుబడుతూ, ధనుష్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నయన్ రాసిన బహిరంగ లేఖ వైరల్ అయింది.
ఈ వివాదంలో కొందరు ధనుష్ను తప్పుబడితే.. ఇంకొందరు నయన్ను నిందించారు. కొన్ని రోజుల పాటు దీని మీద పెద్ద చర్చే జరిగింది. ధనుష్ ఈ వివాదం మీద ఏమైనా స్పందిస్తాడేమో అని అంతా ఎదురు చూశారు. కానీ అతను మౌనంగా ఉండిపోయాడు.
కాగా ఇప్పుడు నయన్ మళ్లీ లైన్లోకి వచ్చింది. తన డాక్యుమెంటరీకి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఆమె ఒక నోట్ రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీలో కంటెంట్ వాడుకోవడానికి సహకరించి, ఎన్వోసీ ఇచ్చిన వివిధ ఇండస్ట్రీలకు చెందిన నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతూ ఆమె ఈ నోట్ రిలీజ్ చేసింది. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ (సైరా).. శివప్రసాద్ రెడ్డి (బాస్), యలమంచిలి సాయిబాబు (శ్రీరామరాజ్యం)లకు నయనతార థ్యాంక్స్ చెప్పింది.
బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ (జవాన్)లకు.. ఇంకా తమిళం, మలయాళంలో తాను నటించిన సినిమాల నుంచి ఫుటేజ్ వాడుకోవడానికి అనుమతించిన ఎంతోమంది నిర్మాతలకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పింది. ఐతే ఇక్కడ ధనుష్ పేరు ఎత్తకపోయినా ఈ నోట్ ద్వారా పరోక్షంగా ధనుష్ మీద కౌంటర్ వేసినట్లే భావిస్తున్నారు నెటిజన్లు. ఫుటేజ్ వాడుకోవడానికి పెద్ద మనసుతో అంగీకరించారంటూ వీళ్లకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పిందంటే.. ‘నానుం రౌడీ దా’ కంటెంట్ ఇవ్వని ధనుస్ను కౌంటర్ చేసినట్లే కదా.
This post was last modified on November 21, 2024 4:17 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…