కొన్ని రోజుల కిందట నయనతార-ధనుష్ మధ్య గొడవ సోషల్ మీడియాను ఎలా కుదిపేసిందో తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం, ఫిలిం కెరీర్ నేపథ్యంగా నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ కోసం ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ‘నానుం రౌడీ దా’ సినిమా నుంచి ఫుటేజ్ వాడుకోవడానికి అంగీకరించకపోవడాన్ని తప్పుబడుతూ, ధనుష్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నయన్ రాసిన బహిరంగ లేఖ వైరల్ అయింది.
ఈ వివాదంలో కొందరు ధనుష్ను తప్పుబడితే.. ఇంకొందరు నయన్ను నిందించారు. కొన్ని రోజుల పాటు దీని మీద పెద్ద చర్చే జరిగింది. ధనుష్ ఈ వివాదం మీద ఏమైనా స్పందిస్తాడేమో అని అంతా ఎదురు చూశారు. కానీ అతను మౌనంగా ఉండిపోయాడు.
కాగా ఇప్పుడు నయన్ మళ్లీ లైన్లోకి వచ్చింది. తన డాక్యుమెంటరీకి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఆమె ఒక నోట్ రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీలో కంటెంట్ వాడుకోవడానికి సహకరించి, ఎన్వోసీ ఇచ్చిన వివిధ ఇండస్ట్రీలకు చెందిన నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతూ ఆమె ఈ నోట్ రిలీజ్ చేసింది. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ (సైరా).. శివప్రసాద్ రెడ్డి (బాస్), యలమంచిలి సాయిబాబు (శ్రీరామరాజ్యం)లకు నయనతార థ్యాంక్స్ చెప్పింది.
బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ (జవాన్)లకు.. ఇంకా తమిళం, మలయాళంలో తాను నటించిన సినిమాల నుంచి ఫుటేజ్ వాడుకోవడానికి అనుమతించిన ఎంతోమంది నిర్మాతలకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పింది. ఐతే ఇక్కడ ధనుష్ పేరు ఎత్తకపోయినా ఈ నోట్ ద్వారా పరోక్షంగా ధనుష్ మీద కౌంటర్ వేసినట్లే భావిస్తున్నారు నెటిజన్లు. ఫుటేజ్ వాడుకోవడానికి పెద్ద మనసుతో అంగీకరించారంటూ వీళ్లకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పిందంటే.. ‘నానుం రౌడీ దా’ కంటెంట్ ఇవ్వని ధనుస్ను కౌంటర్ చేసినట్లే కదా.
This post was last modified on November 21, 2024 4:17 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…