కొన్ని రోజుల కిందట నయనతార-ధనుష్ మధ్య గొడవ సోషల్ మీడియాను ఎలా కుదిపేసిందో తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం, ఫిలిం కెరీర్ నేపథ్యంగా నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ కోసం ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ‘నానుం రౌడీ దా’ సినిమా నుంచి ఫుటేజ్ వాడుకోవడానికి అంగీకరించకపోవడాన్ని తప్పుబడుతూ, ధనుష్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నయన్ రాసిన బహిరంగ లేఖ వైరల్ అయింది.
ఈ వివాదంలో కొందరు ధనుష్ను తప్పుబడితే.. ఇంకొందరు నయన్ను నిందించారు. కొన్ని రోజుల పాటు దీని మీద పెద్ద చర్చే జరిగింది. ధనుష్ ఈ వివాదం మీద ఏమైనా స్పందిస్తాడేమో అని అంతా ఎదురు చూశారు. కానీ అతను మౌనంగా ఉండిపోయాడు.
కాగా ఇప్పుడు నయన్ మళ్లీ లైన్లోకి వచ్చింది. తన డాక్యుమెంటరీకి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఆమె ఒక నోట్ రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీలో కంటెంట్ వాడుకోవడానికి సహకరించి, ఎన్వోసీ ఇచ్చిన వివిధ ఇండస్ట్రీలకు చెందిన నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతూ ఆమె ఈ నోట్ రిలీజ్ చేసింది. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ (సైరా).. శివప్రసాద్ రెడ్డి (బాస్), యలమంచిలి సాయిబాబు (శ్రీరామరాజ్యం)లకు నయనతార థ్యాంక్స్ చెప్పింది.
బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ (జవాన్)లకు.. ఇంకా తమిళం, మలయాళంలో తాను నటించిన సినిమాల నుంచి ఫుటేజ్ వాడుకోవడానికి అనుమతించిన ఎంతోమంది నిర్మాతలకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పింది. ఐతే ఇక్కడ ధనుష్ పేరు ఎత్తకపోయినా ఈ నోట్ ద్వారా పరోక్షంగా ధనుష్ మీద కౌంటర్ వేసినట్లే భావిస్తున్నారు నెటిజన్లు. ఫుటేజ్ వాడుకోవడానికి పెద్ద మనసుతో అంగీకరించారంటూ వీళ్లకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పిందంటే.. ‘నానుం రౌడీ దా’ కంటెంట్ ఇవ్వని ధనుస్ను కౌంటర్ చేసినట్లే కదా.
This post was last modified on November 21, 2024 4:17 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…