Movie News

SSMB29: రంగంలోకి మాస్టర్ మైండ్

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న SSMB29 పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే KL నారాయణ నిర్మాణంలో శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమా నిర్మాణంలో మరో మాస్టర్ మైండ్ కూడా చేరబోతున్నట్టు తెలుస్తోంది. నిర్మాణంలో అనుభవజ్ఞుడైన శోభు యార్లగడ్డను కూడా టీమ్ లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

జక్కన్న ఆయనకు కార్యనిర్వాహక నిర్మాతగా ( executive producer) హోదా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న, బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో నిర్మాతగానే కాకుండా శోభు మార్కెటింగ్ లో కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా సినిమా మార్కెటింగ్ చేయడం, సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం వంటి అంశాల్లో ఆయన అనుభవం రాజమౌళికి హెల్ప్ అయ్యింది.

RRR ఆస్కార్ గెలవడం ఒక ఎత్తైతే. దాని వెనకాల నామినేషన్ కోసం జరిగిన ప్రాసెస్‌లో శోభు పాత్ర చాలానే ఉంది. శోభు యార్లగడ్డ తెలివితేటలతో సినిమా ప్రొడక్షన్, మార్కెటింగ్‌లో మంచి పట్టు ఉంది. అంతర్జాతీయ స్థాయిలో సినిమాను ప్రోత్సహించడం, అక్కడి ప్రేక్షకుల మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవడం, అలాగే అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించడం వంటి విషయాల్లో ఆయన ముందుంటారు.

ఇక బిజినెస్ యాంగిల్స్ లో కూడా ఆయన మాస్టర్ మైండ్. ప్రమోషన్ ఖర్చు విషయంలో ఆయన విజన్ బెస్ట్ అని జక్కన్న చాలాసార్లు చెప్పారు. ఇక మహేష్ సినిమా కేవలం పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాకుండా పాన్ వరల్డ్ లెవెల్‌లో రూపొందుతుండటంతో, అంతర్జాతీయ స్థాయిలో దీన్ని ప్రమోట్ చేయడం చాలా ముఖ్యమైంది. ఈ క్రమంలో రాజమౌళి నమ్మకంతో శోభును తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా నిర్మాణానికి శోభు మైండ్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

This post was last modified on November 21, 2024 4:09 pm

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

5 minutes ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

1 hour ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

2 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

3 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

4 hours ago