Movie News

రామ్ చరణ్ దర్గా వివాదంపై ఉపాసన కౌంటర్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించడంపై ఒక వర్గం నుంచి భిన్నమైన అభిప్రాయాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే చరణ్ మాత్రం రెహమాన్ కు ఇచ్చిన మాట కోసం వచ్చాను అని చాలా గౌరవంగా అక్కడి మతాలను గౌరవించారు. ఇక ఈ విషయంలో చాలామంది చరణ్ మత సామరస్యానికి పాజిటివ్ గానే స్పందిస్తున్నారు.

అయితే ఓ వర్గం నుంచి వస్తున్న భిన్నమైన కామెంట్స్ కు చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఎక్స్‌లో రామ్ చరణ్ దర్గా సందర్శన ఫొటోను షేర్ చేసిన ఉపాసన, భారతీయ సంస్కృతిలో అన్ని మతాల గౌరవానికి ప్రాధాన్యత ఉందని స్పష్టం చేశారు. “విశ్వాసం మనలను కలిపే పద్ధతులలో ఒకటి. భారతీయులుగా మతానికి సంబంధించిన ప్రతి విధానాన్ని గౌరవించాలి. ఐక్యతలోనే అసలైన బలం ఉంది. రామ్ చరణ్ తన సొంత విశ్వాసాలను గౌరవిస్తూనే ఇతర మతాల పట్ల కూడా ఆదరణ చూపుతారు” అని ఉపాసన రాసుకొచ్చారు.

ఒక మరో నెటిజన్ ఉపాసన వ్యాఖ్యలపై స్పందిస్తూ, “ఇతర మతాలను గౌరవించడమంటే అయ్యప్ప మాలతో దర్గాను సందర్శించడం కాదంటూ” వ్యాఖ్యానించాడు. దీనికి ఉపాసన తెలివైన సమాధానంగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేశారు. శబరిమలకు వెళ్లే భక్తులు మసీదులో ప్రార్థనలు చేసే సంప్రదాయం గురించి ఆ కథనంలో స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

ఉపాసన సమాధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. “విశ్వాసాల మధ్య చీలికలను కాదని, సమగ్రతను ప్రోత్సహించాలన్నది ఉపాసన సందేశం,” అంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, రామ్ చరణ్ దర్గా సందర్శన అంశం వివిధ కోణాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇతర మతాలను గౌరవించడం, భారతీయ సమాజంలో మత సామరస్యానికి రామ్ చరణ్ తీసుకున్న ఈ అడుగు కొత్త స్ఫూర్తిగా నిలుస్తుందంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on November 20, 2024 5:11 pm

Share

Recent Posts

ఫౌజీ ప్లానింగ్ విభిన్నంగా ఉంటుందా?

డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…

7 minutes ago

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

2 hours ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

2 hours ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

2 hours ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

3 hours ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

4 hours ago