కోలీవుడ్కు ‘బాహుబలి’ అవుతుందని.. వెయ్యి కోట్ల వసూళ్లు గ్యారెంటీ అని ‘కంగువ’కు అక్కడి జనాలు ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. నిర్మాత జ్ఞానవేల్ రాజా అయితే ఏకంగా రూ.2 వేల కోట్ల వసూళ్ల మాట కూడా అన్నాడు. ఐతే ప్రోమోలు చూస్తే మరీ నిర్మాత చెప్పిన స్థాయిలో కాకపోయినా భారీగానే వసూళ్లు సాధిస్తుందని, పెద్ద హిట్ అవుతుందని అనిపించింది. కానీ తీరా థియేటర్లకు వెళ్లి బొమ్మ చూస్తే దిమ్మ దిరిగిపోయింది.
ఊరికే హడావుడి తప్ప సినిమాలో విషయం లేదని అర్థమైంది. ‘కంగువ’కు తొలి రోజు మిక్స్డ్ టాక్ రాగా.. రాను రానూ అది పూర్తి నెగెటివ్ టాక్గా మారిపోయింది. ‘కంగువ’ను ట్రోల్ మెటీరియల్గా మార్చేశారు నెటిజన్లు. ఈ సినిమాలో సన్నివేశాల గురించి.. అరుపులు కేకల గురించి విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇక వసూళ్ల సంగతి చూస్తే పరిస్థితి దయనీయంగా ఉంది. వీకెండ్లో కూడా సరైన ఆక్యుపెన్సీలు లేవు.
తెలుగు రాష్ట్రాల్లో అయితే సినిమాకు కలెక్షన్లు బాగా పడిపోయాయి. తమిళంలో కూడా పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. తొలి రోజు వచ్చింది 40 కోట్ల వసూళ్లే కాగా.. పోస్టర్ మాత్రం ఘనంగా రూ.58 కోట్లతో దించేశారు. రెండో రోజు వసూళ్లు నాలుగో వంతుకు పడిపోయినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. శని, ఆదివారాల్లో కూడా సినిమా గొప్పగా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఫుల్ రన్లో సినిమా రూ.100 కోట్ల మార్కును అందుకుంటే గొప్ప అన్నట్లుంది పరిస్థితి.
దీన్ని బట్టి ‘కంగువ’ పెద్ద డిజాస్టర్ కాబోతోందన్నది స్పష్టం. కానీ నిర్మాత జ్ఞానవేల్ రాజా మాత్రం సినిమాకు మంచి స్పందన వస్తోందని.. వసూళ్లు నిలకడగా ఉన్నాయని అంటున్నాడు. అంతే కాక ‘కంగువ’ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కానీ సినిమా ఆడుతున్న తీరు.. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ చూస్తుంటే ‘కంగువ-2’ మీద ఆశలు వదులుకోక తప్పదని అర్థమవుతోంది. రిజల్ట్ బాలేని ఏ సినిమాకూ సీక్వెల్ తీసి ప్రయోజనం ఉండదు. ఆల్రెడీ షూట్ పూర్తయితే చెప్పలేం కానీ.. లేదంటే మాత్రం సీక్వెల్ ఆపేయక తప్పదు.
This post was last modified on November 18, 2024 1:30 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…