నిన్న జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకవేళ హైదరాబాద్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ పాట్నాలో వచ్చిన స్పందన చూసి నేషనల్ మీడియా సైతం షాక్ తింది. నాలుగు వందలకు పైగా పోలీస్ ప్లస్ ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నప్పటికీ రద్దీ నియంత్రించడానికి చుక్కలు కనిపించాయంటే బీహార్ జనాలు పుష్పని ఎంతగా స్వంతం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. పాతిక వేల జనాలని ఆశిస్తే రెండు లక్షలకు పైగా రావడం నిర్వాహకులు ఊహించలేదు. పాసులు బ్లాక్ లో అమ్మారంటేనే పీక్స్ క్రేజని వేరే చెప్పాలా. కనివిని ఎరుగని జన సందోహం చూసి స్థానిక రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.
కొద్దిరోజుల క్రితం గేమ్ ఛేంజర్ ఈవెంట్ లక్నోలో చేసినప్పుడు కొత్త ఐడియా అనుకున్నారు. కానీ చేసిన ప్రాంగణం చిన్నది కావడం వల్ల జనంతో నిండిపోయినా సరే పదే పదే మాట్లాడుకునే స్థాయిలో కనిపించలేదు. కానీ పుష్ప 2కి అలా కాదు. విపరీతమైన పబ్లిక్, ఎక్కడ చూసినా ఇసుక వేసినా రాలనంత జనం. ఆన్ లైన్ స్ట్రీమింగ్ లోనూ మూడు లక్షలకు కొంచెం అటుఇటుగా లైవ్ లో చూశారు. తెలుగు రాష్ట్రాల అభిమానులు న్యూస్ ఛానల్స్ ని ఎంచుకున్నారు. మొత్తానికి పుష్ప 2 మానియా చూస్తుంటే ర్యాంపేజ్ అనే మాట చిన్నది అనిపిస్తోంది. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు మొదలైంది.
ఇంకో ఆరు ఈవెంట్లను పుష్ప 2 కోసం ప్లాన్ చేసుకున్నారు. అవి ఖచ్చితంగా పాట్నాను తలపించే స్థాయిలో జరగాలి. ట్రైలర్ చూశాక పెరిగిన హైప్ గమనిస్తే అదేం కష్టం కాదనిపిస్తోంది. విడుదలకు కేవలం ఇంకో పదిహేడు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో అందరూ ఉరుకులు పరుగుల మీదున్నారు. దర్శకుడు సుకుమార్ ఎక్కువ శాతం వేడుకలకు హాజరయ్యే పరిస్థితి లేదు. చివరి నిమిషం పనుల్లో బిజీగా ఉన్నారు. నిర్మాతలు నవీన్, రవి, ఉత్తరాది డిస్ట్రిబ్యూటర్ అనిల్ తదాని పాట్నా ఈవెంట్ బ్లాక్ బస్టర్ కావడం చూసి మాములు ఆనందంలో లేరు. ఓపెనింగ్స్ మీద నమ్మకానికి ఇది పునాది మాత్రమే.
This post was last modified on November 18, 2024 10:10 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…