Trends

చివరిస్తానంలో హైదరాబాద్.. బయట ఫుడ్ తో జాగ్రత్త

హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ. ముఖ్యంగా బిర్యానీ, హలీం, మొఘలాయి వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. కానీ, ఇటీవల కాలంలో నగరంలోని ఆహార నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని హోటళ్ళలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, కుళ్లిన పదార్థాల వినియోగం వంటి సమస్యలు నగరపు ఖ్యాతిని దెబ్బతీస్తున్నాయి.

గత రెండు నెలలలో నగరంలో 84 శాతం ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని హోటళ్ళలో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా కనిపించడం లేదు. బిర్యానీల్లో బొద్దింకలు, గడువు తీరిన పదార్థాల వినియోగం వంటి ఘటనలు భోజన ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ ఘటనల కారణంగా పలు రెస్టారెంట్లలో భోజనం చేయడం సాహసంగా మారింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ఇటీవల నిర్వహించిన సర్వేలో కల్తీ ఆహార అంశంలో హైదరాబాద్ అత్యంత దారుణ స్థాయిలో నిలిచింది. భారతదేశంలోని 19 ప్రధాన నగరాల మధ్య చేపట్టిన ఈ సర్వేలో హైదరాబాద్ చివరిస్తానంలో ఉండటం గమనార్హం. ఇది నగరంలో ఆహార నాణ్యతా ప్రమాణాల పరిస్థితి ఎంత దిగజారిందో చూపిస్తోంది.

హైదరాబాద్‌లోని 62 శాతం హోటళ్ళలో గడువు తీరిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నారన్న నివేదిక మరింత ఆందోళనకరంగా మారింది. నగరంలోని పర్యాటక ఆహార పట్ల ఉన్న నమ్మకాన్ని ఈ పరిస్థితి తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో ఆహార నాణ్యతను పునరుద్ధరించడం తక్షణ అవసరం. అధికారులు కఠిన చర్యలు తీసుకొని, నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూసేందుకు కృషి చేయాలి. హైదరాబాద్ ప్రఖ్యాతి తిరిగి నిలబడాలంటే ఆహార పరిశ్రమపై కఠిన నియంత్రణలు తప్పనిసరి అని సోషల్ మీడియాలో కామెంట్స్ వెలువడుతున్నాయి.

This post was last modified on November 17, 2024 8:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణలో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ సెంటర్లు

ఇప్పుడంతా కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మీదే చర్చ జరుగుతోంది. ఏఐ రంగం వైపు దాదాపుగా అన్ని దేశాలు పరుగులు…

43 minutes ago

పుష్కరం తర్వాత ‘సిరిమల్లె చెట్టు’ దర్శనం

గత రెండేళ్లుగా రీ రిలీజుల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయి ఆఖరికి వాటి మీద ఆసక్తి సన్నగిల్లే దాకా వచ్చేసింది. అయితే…

1 hour ago

వంశీ అరెస్టు తర్వాత హై డ్రామా

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వంశీ…

2 hours ago

కింగ్ డమ్ దాచిపెట్టిన రహస్యాలు ఎన్నో…

నిన్న విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్ కు భారీ స్పందన కనిపిస్తోంది. దేవర, సలార్ తరహా షేడ్స్…

2 hours ago

ప్రాణాపాయంలో రిషభ్ పంత్ ప్రాణాలు కాపాడిన రజత్

భారత క్రికెటర్ రిషభ్ పంత్ ప్రాణాలు కాపాడి వార్తల్లో నిలిచిన రజత్ కుమార్ జీవితంలో ఇప్పుడు విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్…

2 hours ago

మంచు మోహన్ బాబుకు బెయిల్ మంజూరు

ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబుకు గురువారం భారీ ఊరట లభించింది. టీవీ జర్నలిస్టుపై…

3 hours ago