Trends

చివరిస్తానంలో హైదరాబాద్.. బయట ఫుడ్ తో జాగ్రత్త

హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ. ముఖ్యంగా బిర్యానీ, హలీం, మొఘలాయి వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. కానీ, ఇటీవల కాలంలో నగరంలోని ఆహార నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని హోటళ్ళలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, కుళ్లిన పదార్థాల వినియోగం వంటి సమస్యలు నగరపు ఖ్యాతిని దెబ్బతీస్తున్నాయి.

గత రెండు నెలలలో నగరంలో 84 శాతం ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని హోటళ్ళలో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా కనిపించడం లేదు. బిర్యానీల్లో బొద్దింకలు, గడువు తీరిన పదార్థాల వినియోగం వంటి ఘటనలు భోజన ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ ఘటనల కారణంగా పలు రెస్టారెంట్లలో భోజనం చేయడం సాహసంగా మారింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ఇటీవల నిర్వహించిన సర్వేలో కల్తీ ఆహార అంశంలో హైదరాబాద్ అత్యంత దారుణ స్థాయిలో నిలిచింది. భారతదేశంలోని 19 ప్రధాన నగరాల మధ్య చేపట్టిన ఈ సర్వేలో హైదరాబాద్ చివరిస్తానంలో ఉండటం గమనార్హం. ఇది నగరంలో ఆహార నాణ్యతా ప్రమాణాల పరిస్థితి ఎంత దిగజారిందో చూపిస్తోంది.

హైదరాబాద్‌లోని 62 శాతం హోటళ్ళలో గడువు తీరిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నారన్న నివేదిక మరింత ఆందోళనకరంగా మారింది. నగరంలోని పర్యాటక ఆహార పట్ల ఉన్న నమ్మకాన్ని ఈ పరిస్థితి తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో ఆహార నాణ్యతను పునరుద్ధరించడం తక్షణ అవసరం. అధికారులు కఠిన చర్యలు తీసుకొని, నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూసేందుకు కృషి చేయాలి. హైదరాబాద్ ప్రఖ్యాతి తిరిగి నిలబడాలంటే ఆహార పరిశ్రమపై కఠిన నియంత్రణలు తప్పనిసరి అని సోషల్ మీడియాలో కామెంట్స్ వెలువడుతున్నాయి.

This post was last modified on November 17, 2024 8:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

1 hour ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

2 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

3 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

3 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

3 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

4 hours ago