ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన అగ్రశ్రేణి హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ వ్యక్తిగత జీవితం గురించి తరచూ చర్చ జరుగుతుంటుంది. ఆమె ప్రేమ.. పెళ్లి గురించి గతంలో పలుమార్లు వార్తలు వచ్చాయి.
ఒక కమెడియన్తో ప్రేమ అని.. ఒక సంగీత దర్శకుడిని పెళ్లి చేసుకోబోతందని.. అలాగే ఒక బిజినెస్మ్యాన్తో ఆమెకు నిశ్చితార్థం జరగబోతందని.. ఇలా వేర్వేరు సందర్భాల్లో రూమర్లు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాదని తేలింది.
చివరగా వచ్చిన పెళ్లి రూమర్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ కీర్తి పెళ్లి గురించి జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి పెళ్లి డేట్ కూడా ఫిక్సయిపోయిందని అంటున్నారు. డిసెంబరులో కీర్తి సురేష్ పెళ్లికూతురు కాబోతోందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తుండడం విశేషం.
కీర్తి తన తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధమే చేసుకోబోతందని.. వరుడు వారి బంధువే అని అంటున్నారు. డిసెంబరులో గోవా వేదికగా వీరి పెళ్లి జరగబోతోందట. గతంలో తన ప్రేమ, పెళ్లి గురించి వార్తలు వచ్చినపుడల్లా.. వాటిని ఖండిస్తూ తాను తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటానని చెప్పేది కీర్తి.
ఆమె తల్లి మేనక ఒకప్పటి నటి కాగా, తండ్రి సురేష్ నిర్మాత. మేనక.. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ‘పున్నమినాగు’ సినిమాలో నటించడం విశేషం. తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోయిన్గా కెరీర్ను ఆరంభించిన కీర్తికి మొదట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. బబ్లీ హీరోయిన్ లాగే చూసేవాళ్లు ప్రేక్షకులు.
కానీ ‘మహానటి’తో ఆమె రాత మారిపోయింది. ఆ సినిమాలో అద్భుత అభినయంతో ఆశ్చర్యపరిచిన అక్కడ్నుంచి మంచి పెర్ఫామర్గా గుర్తింపు తెచ్చుకుని పెద్ద హీరోయిన్గా ఎదిగింది. ఇప్పుడు బహు భాషల్లో కథానాయికగా ఒక వెలుగు వెలుగుతున్న కీర్తి.. ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటుందా అన్నది సందేహం.
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…