తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై పోలీసులు ఆమెను హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని, కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. దీంతో కస్తూరిని చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. “హిందూ మక్కల్ కచ్చి” సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలతో ఈ కేసు గొడవ ప్రారంభమైంది.
ఈ సమావేశంలో ద్రవిడ పార్టీలను విమర్శిస్తూ, తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 300 ఏళ్ల కిందట రాజుగారి అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు.. తామే తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారంటూ కస్తూరి వ్యాఖ్యానించారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో తెలుగు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కస్తూరి ప్రయత్నించినప్పటికీ, అది పెద్దగా ఫలితం ఇవ్వలేదు. తాను తెలుగువారిని అవమానించలేదని, ద్రవిడ పార్టీల బ్రాహ్మణ వ్యతిరేకతను మాత్రమే ప్రశ్నించానని ఆమె స్పష్టం చేసింది. అయితే, ఈ వివరణ ప్రజలను శాంతింపజేయలేకపోయింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆమెను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు.
కస్తూరి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ తిరస్కరించబడింది. ఈ పరిణామంతో ఆమెను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచారు. కాగా, ఈ కేసు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో కూడా హాట్ టాపిక్గా మారింది. కస్తూరి వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.
This post was last modified on November 17, 2024 5:52 pm
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…