తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై పోలీసులు ఆమెను హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని, కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. దీంతో కస్తూరిని చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. “హిందూ మక్కల్ కచ్చి” సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలతో ఈ కేసు గొడవ ప్రారంభమైంది.
ఈ సమావేశంలో ద్రవిడ పార్టీలను విమర్శిస్తూ, తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 300 ఏళ్ల కిందట రాజుగారి అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు.. తామే తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారంటూ కస్తూరి వ్యాఖ్యానించారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో తెలుగు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కస్తూరి ప్రయత్నించినప్పటికీ, అది పెద్దగా ఫలితం ఇవ్వలేదు. తాను తెలుగువారిని అవమానించలేదని, ద్రవిడ పార్టీల బ్రాహ్మణ వ్యతిరేకతను మాత్రమే ప్రశ్నించానని ఆమె స్పష్టం చేసింది. అయితే, ఈ వివరణ ప్రజలను శాంతింపజేయలేకపోయింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆమెను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు.
కస్తూరి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ తిరస్కరించబడింది. ఈ పరిణామంతో ఆమెను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచారు. కాగా, ఈ కేసు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో కూడా హాట్ టాపిక్గా మారింది. కస్తూరి వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…