ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార బహిరంగ లేఖ రాయడం సంచలనం రేపింది. ఇందులో నయన్ పేర్కొన్న అంశాలు చూస్తే తప్పంతా ధనుష్దే అనిపిస్తుంది. తన డాక్యుమెంటరీలో తాను నటించిన సినిమాల వీడియోలు, ఫొటోలు వాడుకుంటే తప్ప.. దానికి ధనుష్ అడ్డు చెప్పడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. చాలామంది ఈ విషయంలో ధనుష్ను తప్పుబడుతున్నారు. కానీ ధనుష్ వెర్షన్ తెలియకుండా అతణ్ని మాత్రమే విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. అతను ఈ విమర్శలు, ఆరోపణలపై ఏమని స్పందిస్తాడో చూడాలి. కానీ ఈ లోపు తన ఫ్యాన్స్ నయన్ మీద కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు.
నయనతార భర్త విఘ్నేష్ శివన్కు అవకాశమిచ్చి ప్రోత్సహించింది ధనుషే అని అందరికీ తెలుసు. గతంలో విఘ్నేష్ కూడా ధనుష్ పట్ల తన గౌరవ భావాన్ని చాటాడు. ధనుష్ వల్లే తాను నిలబడ్డానని చెప్పాడు. కానీ ఒక దశ దాటాక ధనుష్తో అతను అనుచితంగా ప్రవర్తించాడని వాళ్లంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఒక సినిమా నిర్మాతకు దాని మీద సర్వ హక్కులూ ఉంటాయని.. నయన్ కోట్లు పుచ్చుకుని నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ హక్కులు ఇచ్చినపుడు.. ధనుష్ ప్రొడ్యూస్ చేసిన సినిమా నుంచి కంటెంట్ ఉచితంగా ఎలా అడుగుతుందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. తన పెళ్లి వీడియోలను కూడా నెట్ ఫ్లిక్స్కు అమ్మేసిన కమర్షియల్ హీరోయిన్ నయన్ అని.. అంతే కాక తన సినిమాల ప్రమోషన్లకు కూడా ఆమె ఎప్పుడూ హాజరు కాదని.. ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటుందని.. కానీ తన భర్త డైరెక్ట్ చేసిన సినిమాలను మాత్రం ప్రమోట్ చేస్తుందని.. ఇలా ద్వంద్వ ప్రమాణాలు పాటించే కమర్షియల్ హీరోయిన్గా పేరున్న నయన్.. ధనుష్ పక్కా కమర్షియల్ అని విమర్శించడం, తన నైతికతను ప్రశ్నించడం ఎంత వరకు కరెక్ట్ అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ…
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…