వరుణ్ తేజ్ మట్కా సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అతని గత 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనీసం 10 కోట్లు కూడా దాటలేకపోయాయి. డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు కానీ అవి జనాలకు అంతగా కనెక్ట్ కావడం లేదు. కొన్ని సినిమాలు అయితే కనీసం థియేటర్ వరకు కూడా రప్పించడం లేదు.
గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు బడ్జెట్ పరంగా గట్టి సినిమాలే. 35 నుంచి 40 కోట్ల మధ్యలో ఖర్చు చేశారు. ఇక ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే మినిమమ్ బజ్ లేక ఓపెనింగ్స్ రాబట్టలేకపోయాయి. ఏ ఒక్క సినిమా లెక్క పది కోట్లు దాటలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ గాయాన్ని మాన్పించాలి అంటే మట్కా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వాల్సిందే.
అసలే సినిమాకు బడ్జెట్ 40 కోట్ల దాటినట్లు నిర్మాత క్లారిటీ ఇచ్చారు. నిర్మాత అయితే బిజినెస్ పరంగా సేఫ్ గేమ్ ఆడారు. నాన్ థియేట్రికల్ రైట్స్ అలాగే మరికొన్ని స్ట్రాంగ్ ఏరియాల రైట్స్ అమ్మేసుకున్నరు. దీంతో లాస్ అవ్వకుండా ముందే జాగ్రత్త పడ్డారు. కానీ వరుణ్ తేజ్ స్టార్ ఇమేజ్ తో బాక్సాఫీస్ వద్ద నెంబర్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగైతేనే భవిష్యత్తు ఉంటుంది.
1980 బ్యాక్ డ్రాప్ కాబట్టి నటనకు ఎలివేషన్స్ కు పట్టున్న సినిమా. ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇక ఓపెనింగ్స్ బాగుంటేనే వీకెండ్ అనంతరం కూడా కలెక్షన్లు బాగుంటాయి. విడుదలకు మరికొన్ని గంటల సమయమే ఉంది. పరిస్థితి చూస్తుంటే మౌత్ టాక్ సినిమాకు చాలా అవసరమయ్యేలా ఉంది. మరి వరుణ్ తేజ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నెంబర్లను చూస్తాడో చూడాలి.
This post was last modified on November 13, 2024 5:59 pm
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…