వరుణ్ తేజ్ మట్కా సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అతని గత 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనీసం 10 కోట్లు కూడా దాటలేకపోయాయి. డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు కానీ అవి జనాలకు అంతగా కనెక్ట్ కావడం లేదు. కొన్ని సినిమాలు అయితే కనీసం థియేటర్ వరకు కూడా రప్పించడం లేదు.
గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు బడ్జెట్ పరంగా గట్టి సినిమాలే. 35 నుంచి 40 కోట్ల మధ్యలో ఖర్చు చేశారు. ఇక ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే మినిమమ్ బజ్ లేక ఓపెనింగ్స్ రాబట్టలేకపోయాయి. ఏ ఒక్క సినిమా లెక్క పది కోట్లు దాటలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ గాయాన్ని మాన్పించాలి అంటే మట్కా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వాల్సిందే.
అసలే సినిమాకు బడ్జెట్ 40 కోట్ల దాటినట్లు నిర్మాత క్లారిటీ ఇచ్చారు. నిర్మాత అయితే బిజినెస్ పరంగా సేఫ్ గేమ్ ఆడారు. నాన్ థియేట్రికల్ రైట్స్ అలాగే మరికొన్ని స్ట్రాంగ్ ఏరియాల రైట్స్ అమ్మేసుకున్నరు. దీంతో లాస్ అవ్వకుండా ముందే జాగ్రత్త పడ్డారు. కానీ వరుణ్ తేజ్ స్టార్ ఇమేజ్ తో బాక్సాఫీస్ వద్ద నెంబర్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగైతేనే భవిష్యత్తు ఉంటుంది.
1980 బ్యాక్ డ్రాప్ కాబట్టి నటనకు ఎలివేషన్స్ కు పట్టున్న సినిమా. ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇక ఓపెనింగ్స్ బాగుంటేనే వీకెండ్ అనంతరం కూడా కలెక్షన్లు బాగుంటాయి. విడుదలకు మరికొన్ని గంటల సమయమే ఉంది. పరిస్థితి చూస్తుంటే మౌత్ టాక్ సినిమాకు చాలా అవసరమయ్యేలా ఉంది. మరి వరుణ్ తేజ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నెంబర్లను చూస్తాడో చూడాలి.
గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు…
సుప్రీంకోర్టు హెచ్చరికలు, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న వేలాది ఫిర్యాదులతో కేంద్ర ప్రభుత్వం కదిలింది. దేశంలో ఏదో ఒక రూపంలో…
వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత…
విదేశాలకు వెళ్లాలన్నా, మన జాతీయతను నిరూపించుకోవాలన్నా పాస్పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. అయితే ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సినీ సందడి నెలకొంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో…
వారణాసి మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పిన కొన్ని విషయాలు…