వరుణ్ తేజ్ మట్కా సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అతని గత 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనీసం 10 కోట్లు కూడా దాటలేకపోయాయి. డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు కానీ అవి జనాలకు అంతగా కనెక్ట్ కావడం లేదు. కొన్ని సినిమాలు అయితే కనీసం థియేటర్ వరకు కూడా రప్పించడం లేదు.
గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు బడ్జెట్ పరంగా గట్టి సినిమాలే. 35 నుంచి 40 కోట్ల మధ్యలో ఖర్చు చేశారు. ఇక ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే మినిమమ్ బజ్ లేక ఓపెనింగ్స్ రాబట్టలేకపోయాయి. ఏ ఒక్క సినిమా లెక్క పది కోట్లు దాటలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ గాయాన్ని మాన్పించాలి అంటే మట్కా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వాల్సిందే.
అసలే సినిమాకు బడ్జెట్ 40 కోట్ల దాటినట్లు నిర్మాత క్లారిటీ ఇచ్చారు. నిర్మాత అయితే బిజినెస్ పరంగా సేఫ్ గేమ్ ఆడారు. నాన్ థియేట్రికల్ రైట్స్ అలాగే మరికొన్ని స్ట్రాంగ్ ఏరియాల రైట్స్ అమ్మేసుకున్నరు. దీంతో లాస్ అవ్వకుండా ముందే జాగ్రత్త పడ్డారు. కానీ వరుణ్ తేజ్ స్టార్ ఇమేజ్ తో బాక్సాఫీస్ వద్ద నెంబర్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగైతేనే భవిష్యత్తు ఉంటుంది.
1980 బ్యాక్ డ్రాప్ కాబట్టి నటనకు ఎలివేషన్స్ కు పట్టున్న సినిమా. ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇక ఓపెనింగ్స్ బాగుంటేనే వీకెండ్ అనంతరం కూడా కలెక్షన్లు బాగుంటాయి. విడుదలకు మరికొన్ని గంటల సమయమే ఉంది. పరిస్థితి చూస్తుంటే మౌత్ టాక్ సినిమాకు చాలా అవసరమయ్యేలా ఉంది. మరి వరుణ్ తేజ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నెంబర్లను చూస్తాడో చూడాలి.
This post was last modified on November 13, 2024 5:59 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…