వరుణ్ తేజ్ మట్కా సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అతని గత 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనీసం 10 కోట్లు కూడా దాటలేకపోయాయి. డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు కానీ అవి జనాలకు అంతగా కనెక్ట్ కావడం లేదు. కొన్ని సినిమాలు అయితే కనీసం థియేటర్ వరకు కూడా రప్పించడం లేదు.
గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు బడ్జెట్ పరంగా గట్టి సినిమాలే. 35 నుంచి 40 కోట్ల మధ్యలో ఖర్చు చేశారు. ఇక ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే మినిమమ్ బజ్ లేక ఓపెనింగ్స్ రాబట్టలేకపోయాయి. ఏ ఒక్క సినిమా లెక్క పది కోట్లు దాటలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ గాయాన్ని మాన్పించాలి అంటే మట్కా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వాల్సిందే.
అసలే సినిమాకు బడ్జెట్ 40 కోట్ల దాటినట్లు నిర్మాత క్లారిటీ ఇచ్చారు. నిర్మాత అయితే బిజినెస్ పరంగా సేఫ్ గేమ్ ఆడారు. నాన్ థియేట్రికల్ రైట్స్ అలాగే మరికొన్ని స్ట్రాంగ్ ఏరియాల రైట్స్ అమ్మేసుకున్నరు. దీంతో లాస్ అవ్వకుండా ముందే జాగ్రత్త పడ్డారు. కానీ వరుణ్ తేజ్ స్టార్ ఇమేజ్ తో బాక్సాఫీస్ వద్ద నెంబర్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగైతేనే భవిష్యత్తు ఉంటుంది.
1980 బ్యాక్ డ్రాప్ కాబట్టి నటనకు ఎలివేషన్స్ కు పట్టున్న సినిమా. ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇక ఓపెనింగ్స్ బాగుంటేనే వీకెండ్ అనంతరం కూడా కలెక్షన్లు బాగుంటాయి. విడుదలకు మరికొన్ని గంటల సమయమే ఉంది. పరిస్థితి చూస్తుంటే మౌత్ టాక్ సినిమాకు చాలా అవసరమయ్యేలా ఉంది. మరి వరుణ్ తేజ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నెంబర్లను చూస్తాడో చూడాలి.
This post was last modified on November 13, 2024 5:59 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…