తీసింది మూడు సినిమాలే అయినా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ బాలీవుడ్ లో ఓ రేంజులో దూసుకుపోతోంది. టి సిరీస్ సంస్థ పట్టువదలకుండా ఇతన్ని నమ్ముకునే వందల కోట్ల పెట్టుబడులు సిద్ధం చేసిందంటేనే ఏ స్థాయిలో ప్రభావం చూపించాడో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్న సందీప్ వంగా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. నిర్మాత భూషణ్ కుమార్ ఇటీవలే భూల్ భులయ్యా 3 ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చెప్పిన ప్రకారం స్పిరిట్ వేగంగా పూర్తయ్యేలా ప్లానింగ్ జరుగుతోంది.
వీలైనంత వరకు ఆరు నెలలు టార్గెట్ గా పెట్టుకున్నారట. ప్రభాస్ కున్న వరస కమిట్ మెంట్ల దృష్ట్యా ఒకే దర్శకుడికి ఎక్కువ కాల్ షీట్స్ ఇచ్చే పరిస్థితి ఎంత మాత్రం లేదు. సుదీర్ఘంగా తీస్తూ పోతామంటే కుదరదు.
బాహుబలి, సాహో, రాధే శ్యామ్ తర్వాత ఇకపై ఆలస్యానికి చోటివ్వకుండా ఏడాదికి కనీసం రెండు సినిమాలు ఇస్తానని అభిమానులకు హామీ ఇచ్చిన ప్రభాస్ దానికి అనుగుణంగానే నడుచుకుంటున్నాడు. కొత్త ప్రాజెక్టులు గ్యాప్ లేకుండా సంతకం చేస్తున్నాడు. ది రాజా సాబ్, ఫౌజీలు నిర్మాణంలో ఉండగానే హోంబాలే ఫిలింస్ కి మూడు ప్యాన్ ఇండియా కమిట్మెంట్లు ఇచ్చేశాడు.
సో స్పిరిట్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసే అవసరం పడదు. సందీప్ వంగా సైతం ఇది అవ్వగానే యానిమల్ పార్క్ మొదలు పెట్టాలి. ఆ తర్వాత అల్లు అర్జున్ కోసం రాసిన స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడో ఏడాది క్రితం అధికారిక ప్రకటన ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు.
పుష్ప 2 ది రూల్ రిలీజయ్యాక బన్నీ త్రివిక్రమ్ కాంబోలో మూవీ ఉంటుంది కాబట్టి అది అయ్యేలోగా సందీప్ వంగా స్పిరిట్, యానిమల్ పార్క్ పూర్తి చేసుకుని ఇటు వచ్చేయొచ్చు. మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్ర చేయబోతున్న ప్రభాస్ ఫస్ట్ లుక్ టెస్ట్ ని ఇటీవలే ఓకే చేశారని ఇన్ సైడ్ టాక్.
This post was last modified on November 12, 2024 2:24 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…