మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉండి ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో అభిమానులు ఎదురు చూస్తున్న ఘట్టం జరిగిపోయింది. లక్నోలో జరిగిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో 90 సెకండ్ల టీజర్ ని రిలీజ్ చేశారు. నిన్న వచ్చిన చిన్న గ్లిమ్ప్స్ సోషల్ మీడియాని ఊపేసింది. ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోవడంతో దీన్ని బిగ్ స్క్రీన్ మీద చూడటం కోసం ఫ్యాన్స్ వెల్లువలా థియేటర్లకు వెళ్లిపోయారు. హైదరాబాద్, బెంగళూరు సహా ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో ప్రీమియర్ చేశారు. ఎడిటింగ్ కోసం చెన్నైలో ఉండటం వల్ల దర్శకుడు శంకర్ మినహా ప్రధాన క్యాస్ట్ అండ్ క్రూ ఈవెంట్ కు హాజరయ్యింది.
నిమిషంన్నర నిడివి మొత్తం రామ్ చరణ్ తోనే నిండిపోయింది. కాలేజీ విద్యార్ధి, ఐఎఎస్ ఆఫీసర్ రామ్ నందన్, రైతు అప్పన్న మొత్తం మూడు గెటప్ లను రివీల్ చేశారు. మెయిన్ విలన్ ఎస్జె సూర్యతో పాటు శ్రీకాంత్, సునీల్, జయరాం, సముతిరఖనిలను ఒక్కో షాట్ లో వేగంగా చూపించారు. కియారా అద్వానీ గ్లామర్ లుక్స్ తో పాటు తనకో చిన్న డైలాగ్ ఉంది. చివర్లో రామ్ చరణ్ ఐ యామ్ అన్ ప్రిడిక్టబుల్ అనే మాట తప్ప ఇంకేదీ అనకుండా మొత్తం సన్నివేశాలతోనే నిండిపోయింది. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఒకే ఒక్కడు తరహా ట్రీట్ మెంట్ తో శంకర్ కట్ చేయించిన విధానం హైప్ మార్చేలా ఉంది.
విపరీతమైన జాప్యం వల్ల బజ్ విషయంలో కొంచెం హెచ్చుతగ్గులకు గురైన గేమ్ ఛేంజర్ లెక్కలు ఈ ఒక్క టీజర్ తో మారిపోయేలా ఉన్నాయి. ఆద్యంతం శంకర్ మార్కు విజువల్స్ తో పాటు రామ్ చరణ్ ని ఎలివేట్ చేసిన తీరు, గెటప్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తిరు ఛాయాగ్రహణం ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడటంతో చాలా గ్యాప్ తర్వాత ఒక కమర్షియల్ గ్రాండియర్ ని చూస్తున్న ఫీల్ కలిగించింది. ఇది మెయిన్ ట్రైలర్ కాదు కాబట్టి అసలైన కంటెంట్ కోసం ఇంకా ఎదురు చూడాల్సి ఉంటుంది. జనవరి 10 ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా భాషల్లో గేమ్ ఛేంజర్ విడుదల కాబోతోంది.
This post was last modified on November 9, 2024 6:27 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…