మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉండి ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో అభిమానులు ఎదురు చూస్తున్న ఘట్టం జరిగిపోయింది. లక్నోలో జరిగిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో 90 సెకండ్ల టీజర్ ని రిలీజ్ చేశారు. నిన్న వచ్చిన చిన్న గ్లిమ్ప్స్ సోషల్ మీడియాని ఊపేసింది. ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోవడంతో దీన్ని బిగ్ స్క్రీన్ మీద చూడటం కోసం ఫ్యాన్స్ వెల్లువలా థియేటర్లకు వెళ్లిపోయారు. హైదరాబాద్, బెంగళూరు సహా ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో ప్రీమియర్ చేశారు. ఎడిటింగ్ కోసం చెన్నైలో ఉండటం వల్ల దర్శకుడు శంకర్ మినహా ప్రధాన క్యాస్ట్ అండ్ క్రూ ఈవెంట్ కు హాజరయ్యింది.
నిమిషంన్నర నిడివి మొత్తం రామ్ చరణ్ తోనే నిండిపోయింది. కాలేజీ విద్యార్ధి, ఐఎఎస్ ఆఫీసర్ రామ్ నందన్, రైతు అప్పన్న మొత్తం మూడు గెటప్ లను రివీల్ చేశారు. మెయిన్ విలన్ ఎస్జె సూర్యతో పాటు శ్రీకాంత్, సునీల్, జయరాం, సముతిరఖనిలను ఒక్కో షాట్ లో వేగంగా చూపించారు. కియారా అద్వానీ గ్లామర్ లుక్స్ తో పాటు తనకో చిన్న డైలాగ్ ఉంది. చివర్లో రామ్ చరణ్ ఐ యామ్ అన్ ప్రిడిక్టబుల్ అనే మాట తప్ప ఇంకేదీ అనకుండా మొత్తం సన్నివేశాలతోనే నిండిపోయింది. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఒకే ఒక్కడు తరహా ట్రీట్ మెంట్ తో శంకర్ కట్ చేయించిన విధానం హైప్ మార్చేలా ఉంది.
విపరీతమైన జాప్యం వల్ల బజ్ విషయంలో కొంచెం హెచ్చుతగ్గులకు గురైన గేమ్ ఛేంజర్ లెక్కలు ఈ ఒక్క టీజర్ తో మారిపోయేలా ఉన్నాయి. ఆద్యంతం శంకర్ మార్కు విజువల్స్ తో పాటు రామ్ చరణ్ ని ఎలివేట్ చేసిన తీరు, గెటప్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తిరు ఛాయాగ్రహణం ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడటంతో చాలా గ్యాప్ తర్వాత ఒక కమర్షియల్ గ్రాండియర్ ని చూస్తున్న ఫీల్ కలిగించింది. ఇది మెయిన్ ట్రైలర్ కాదు కాబట్టి అసలైన కంటెంట్ కోసం ఇంకా ఎదురు చూడాల్సి ఉంటుంది. జనవరి 10 ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా భాషల్లో గేమ్ ఛేంజర్ విడుదల కాబోతోంది.
This post was last modified on November 9, 2024 6:27 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…