తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ అధికారిక ముద్ర కోసం అభిమానులు ఎదురు చూశారు. ఇప్పుడది నెరవేరిపోయింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. తండేల్ డిసెంబర్ 20 అనుకున్నా కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదని, కానీ ఈలోగా సంక్రాంతికి రిలీజవుతుందనే ప్రచారం కొందరు చేయడం ఆశ్చర్యపరిచిందని, అసలు ఎప్పుడూ ఆ ఆప్షనే పెట్టుకోలేదని క్లారిటీ ఇచ్చారు. పలువురు స్నేహితులు పండగ డేట్ సూచించినా కొన్ని క్యాలికులేషన్లకు లోబడి నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
సో అక్కినేని ఫ్యాన్స్ భావించినట్టు తండేల్ అసలు సంక్రాంతికి రావాలని అనుకోనేలేదనే క్లారిటీ పూర్తిగా వచ్చేసింది. ఒకవేళ అలా చేసి ఉంటే రిస్క్ కూడా. ఎందుకంటే ఓపెనింగ్స్ తో పాటు టోటల్ రెవిన్యూని రామ్ చరణ్, వెంకటేష్, సందీప్ కిషన్, అజిత్ లతో పాటు పంచుకోవాల్సి వచ్చేది. పైగా థియేటర్ల కొరత ఖచ్చితంగా ఎదురయ్యేది. దానికన్నా సేఫ్ గా ఫిబ్రవరిని ఎంచుకోవడం తెలివైన ఎత్తుడని చెప్పాలి. ఉప్పెన, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, నేను లోకల్ లాంటివన్నీ ఈ నెలలో బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో ఎలా చూసుకున్నా తండేల్ డెసిషన్ సరైనదేనని చెప్పాలి.
ఇక మూడు నెలలకు పైగా సమయం ఉంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్లకు తగినంత సమయం దొరుకుతుంది. తండేల్ నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందింది. సాయిపల్లవి కాంబినేషన్ కావడంతో తమిళ, మలయాళం భాషల్లోనూ చాలా క్రేజ్ నెలకొంది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు వన్ అఫ్ ది బెస్ట్ ఆల్బమ్ గా ఉంటుందని అంతర్గతంగా వినిపిస్తోంది. జాలర్లు, సముద్రాలు, అందమైన ప్రేమకథ లాంటి అంశాలు తండేల్ ని ఎమోషనల్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు. దర్శకుడు చందూ మొండేటి సైతం ఇది బెస్ట్ డేట్ అయ్యే రెవిన్యూ వస్తుందని స్టేజి మీదే హామీ ఇచ్చారు.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…