Movie News

హనుమంతుడు రిషబ్ అయితే రానా ఎవరు

2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ సంస్థ మారిపోయి ఈ ప్యాన్ ఇండియా మూవీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ చేతికి వచ్చాక బడ్జెట్, స్కేల్ రెండూ అమాంతం పెరిగిపోయాయి. ఊహించని విధంగా రిషబ్ శెట్టిని ప్రధాన పాత్రకు తీసుకోవడంతో ఇంకా షూటింగ్ మొదలుకుండానే అంచనాలు పీక్స్ కు వెళ్లడం మొదలయ్యింది. థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టితో పాటు దగ్గుబాటి రానా ఉన్న ఫోటోని ఎక్స్ లో షేర్ చేయడంతో కొత్త ప్రశ్న తలెత్తుతోంది.

ఒకవేళ హనుమంతుడు రిషబ్ శెట్టి అయితే మరి రానా ఎవరు అనే సందేహం వస్తోంది కదూ. ఇన్ సైడ్ టాక్ ప్రకారం దశకంఠుడు రావణాసురుడిగా రానాని ఎంచుకున్నట్టు తెలిసింది. ఇది అఫీషియల్ గా చెప్పింది కాకపోయినా అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం విశ్వసనీయంగా ఉంది. ఇది నిజమైతే పర్ఫెక్ట్ ఛాయస్ అని చెప్పాలి. రానా గంభీరమైన రూపం రావణుడికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. విగ్రహంతో పాటు గళం కూడా అదే స్థాయిలో ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద ఓ రేంజ్ లో పేలుతుంది. ఇక అసలైన ప్రశ్న హనుమంతుడు, రావణుడు అయ్యాక మరి రాముడు ఎవరనేది.

ఇంకా ఈ నిర్ణయం జరగలేదని అంటున్నారు. ప్రశాంత్ వర్మ ముందు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాని పూర్తి చేయాలి. దాని తర్వాత జై హనుమాన్ ఉంటుంది. అయితే ఇంత వరసగా అప్డేట్స్ ఇవ్వడం వెనుక మర్మం ఏమిటో కొద్దిరోజులు ఆగితే కానీ స్పష్టత రాదు. ఇవి కాకుండా సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా వేరే దర్శకురాలితో మహాకాళి లాంటి ప్యాన్ ఇండియా సినిమాను ఇప్పటికే ప్రకటించిన ప్రశాంత్ వర్మ ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులను ఎలా బ్యాలన్స్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. 2025లో రిషబ్ శెట్టి కాంతార పార్ట్ 2 విడుదల కానుండగా ఆపై 2026లో జై హనుమాన్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది.

This post was last modified on November 4, 2024 5:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

8 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

8 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

9 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

9 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

12 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

14 hours ago