ఇంకో నెల రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ షూటింగ్ కు సంబంధించి బ్యాలన్స్ ఉన్న వాటిలో అతి ముఖ్యమైంది ఐటెం కం స్పెషల్ సాంగ్. దర్శకుడు సుకుమార్ ఈ పాటలో నర్తించేందుకు సరైన భామ కోసం చేసిన సుదీర్ఘమైన వేట ఎట్టకేలకు ముగింపుకొచ్చిందని ఫిలింనగర్ టాక్. శ్రీలీల, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక అద్భుతమైన మాస్ నెంబర్ ని దేవిశ్రీ ప్రసాద్ కంపోజింగ్ లో చూడొచ్చని సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఒప్పందాలు అయ్యాయని వినికిడి. పుష్ప 1 ది రూల్ కు సైతం సమంత ఉన్న సంగతి చాలా ఆలస్యంగా బయటికొచ్చింది.
సో ఇది నిజమైతే బన్నీ అభిమానులకు ఇంత కన్నా గుడ్ న్యూస్ ఉండదు. ఈ సంవత్సరం టాప్ డాన్సింగ్ నెంబర్ గా యునానిమస్ గా నిలిచింది గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి. దాంట్లో శ్రీలీల వేసిన స్టెప్పులు, చూపించి చూపించకుండా ఒలికించిన హొయలు మాస్ ప్రేక్షకులకు ఓ రేంజ్ లో కిక్ ఇచ్చాయి. మహేష్ బాబుకే రెట్టింపు ఉత్సాహం తెప్పించి స్క్రీన్లను ఊపేసిన శ్రీలీల ఇప్పుడు ఐకాన్ స్టార్ తో జోడి కడితే జరిగే భీభత్సం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. కొరియోగ్రఫీకి తొలుత జానీ మాస్టర్ అనుకున్నారు కానీ తాజాగా ఇప్పుడా స్థానంలో ప్రేమ్ రక్షిత్ వచ్చారని ఇన్ సైడ్ న్యూస్. అఫీషియల్ కాలేదు.
అసలైన లాంఛనం పూర్తవ్వబోతోంది కాబట్టి పుష్ప 2 ది రూల్ కు సంబంధించి అన్ని ఇబ్బందులు తొలగిపోయినట్టే. అన్నట్టు ఈ స్పెషల్ సాంగ్ లో శ్రీలీలతో పాటు సమంతా ఉండొచ్చని అంటున్నారు కానీ నిర్ధారణగా తెలియదు. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ మొదలుపెట్టిన పుష్ప 2 తెలుగు రాష్ట్రాల్లో దేవర తరహాలో ముందు రోజు అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలకు రంగం సిద్ధం చేస్తోంది. బిజినెస్ పరంగా ఇప్పటికే కనివిని ఎరుగని ఆఫర్లతో ట్రేడ్ మతులు పోగొడుతున్న పుష్ప 2 అటు ఉత్తరాదిలోనూ అంతే సంచలనం నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. డీల్ చేస్తున్న రేట్లు అలా ఉన్నాయి మరి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…