2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో పాటు వెంకటేష్ 76 రిలీజ్ చేయాలనే ఒత్తిడి నిర్మాత దిల్ రాజు మీద పెరుగుతోంది. వెంకీ, దర్శకుడు అనిల్ రావిపూడి ఎట్టి పరిస్థితుల్లో పండగ మిస్ చేయకూడదనే సంకల్పంతో ఉండగా, రాజుగారికేమో రామ్ చరణ్ సినిమాతో పాటు బాలయ్య 109 పంపిణి బాధ్యతలు తీసుకునే పరిస్థితి ఉండటంతో అంత సుముఖంగా లేరనే టాక్ ముందు నుంచి ఉంది. అందుకే ఎలాగైనా వెంకటేష్ ని ఒప్పించే దిశగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఫిలిం నగర్ టాక్. అందుకే నిన్న డబ్బింగ్ కు సంబంధించిన ట్వీట్ లో వెంకటేష్ సంక్రాంతికి కలుద్దాం అంటే ఎస్విసి హ్యాండిల్ లో మాత్రం డేట్ ప్రస్తావన లేదు.
సో ఇంకా సస్పెన్స్ అయిపోలేదన్న మాట. ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ చేసుకుంటే వర్కౌట్ అవుతుందని గతంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో మైత్రి మూవీ మేకర్స్ నిరూపించారు. అప్పుడు వారసుడు, తెగింపు లాంటి పోటీ ఉన్నా సరే భారీ వసూళ్లు లాగేశారు. ఇప్పుడూ అదే జరగొచ్చని వెంకీ ఫ్యాన్స్ నమ్మకం. అయితే కమర్షియల్ క్యాలికులేషన్లు వేసుకుంటున్న దిల్ రాజు ఒకటే వస్తే అది కూడా గేమ్ ఛేంజర్ అయితేనే ఎక్కువ ప్రయోజనమన్న కోణంలో ఆలోచిస్తున్నారట. చివరి నిమిషం దాకా ట్రై చేసి అవ్వకపోతే వెంకీ ఆకాంక్షకే కట్టుబడతారన్న మాట.
ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని వెంకటేష్ సినిమా టైటిల్ కోసం ఇల్లాలు ప్రియురాలు పదాలు వచ్చేలోగా పలు ఆప్షన్లు చూస్తున్నారట. సంక్రాంతి వస్తున్నాంని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఇప్పుడు దాన్ని మార్చే ఆలోచన చేస్తున్నారని తెలిసింది. ఐశ్వర్య రాజేష్ భార్యగా, మీనాక్షి చౌదరి మాజీ లవర్ గా నటిస్తున్న ఈ ఎంటర్ టైనర్ కి బీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు. ఎఫ్2, ఎఫ్3 లాగా మల్టీస్టారర్ కాకపోవడంతో వినోదం పండించే పూర్తి బాధ్యత వెంకటేష్ మీదే పడింది. దానికి వందకు రెండు వందల శాతం న్యాయం చేశారని యూనిట్ టాక్. ఇంకో రెండు రోజుల్లో దీపావళి కాబట్టి ఫైనల్ క్లారిటీ వచ్చేస్తుంది.
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…