గుంటూరు కారం తర్వాత మహేష్ బాబుని మళ్ళీ తెరమీద చూడలేమని బెంగపడుతున్న అభిమానులను రిలీఫ్ దక్కే శుభవార్త రాబోతోందట. అశోక్ గల్లా హీరోగా గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతున్న దేవకీనందన వాసుదేవలో మహేష్ జస్ట్ అలా కాసేపు కనిపించే చిన్న క్యామియో చేశాడనే లీక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. యూనిట్ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు కానీ నమ్మదగిన సోర్స్ నుంచి వస్తున్న సమాచారం చాలా ధీమాగా చెబుతోంది. దీనికి సంబంధించిన షూట్ రెండు నెలల క్రితమే పూర్తి చేశారని, రాజమౌళి ఆమోద ముద్ర పడిందని అంటున్నారు.
ఇది నిజమైతే మాత్రం దేవకీనందన వాసుదేవ మీద ఇప్పటిదాకా లేని బజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. హీరో ద్వారా లాంచ్ అయిన అశోక్ గల్లా ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్రశాంత్ వర్మ ఇచ్చిన కథలో సరైన మోతాదులో కుటుంబ అంశాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు చిన్న డివోషనల్ టచ్ ఉండటం వల్ల ఒప్పుకున్నట్టు తెలిసింది. ఇప్పటికైతే ప్రమోషన్లు మొదలుపెట్టలేదు కానీ దీపావళి నుంచి పబ్లిసిటీకి కొబ్బరికాయ కొట్టబోతున్నారని తెలిసింది. హనుమాన్ పుణ్యమాని కథ ఇచ్చిన ప్రశాంత్ వర్మ పేరు మీదే ఎక్కువ మార్కెట్ చేస్తున్నారు.
కంగువతో పోటీకి సిద్ధపడ్డ దేవకీనందన వాసుదేవకు సంబంధించి కథా కమామీషు ఇంకా పూర్తిగా బయటికి వదల్లేదు. టీజర్ లో క్లూస్ ఇచ్చారు తప్పించి ట్రైలర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ టాక్ బయటికి రాగానే ఒక్కసారిగా ఎక్కడ లేని ఆసక్తి మొదలువుతుంది. కంగున, వరుణ్ తేజ్ మట్కాలతో పోటీకి సిద్ధపడుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో మహేష్ బాబు క్యామియో ఉంటే మాత్రం దానివల్ల కలిగే లాభం అంతా ఇంతా ఉండదు. కాకపోతే మితిమీరి ఊహించుకోకుండా పరిమితంగా ఎక్స్ పెక్ట్ చేయడం బెటర్. ఎందుకంటే కేవలం అతి కొంత సేపు అది కూడా డైలాగు లేకుండా శ్రీకృష్ణుడిగా మహేష్ కనిపిస్తాడని వినికిడి.
This post was last modified on October 28, 2024 3:30 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…