నాలుగేళ్ల కిందట తెలుగులో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది ‘పెళ్ళిచూపులు’. దాన్ని తెలుగు సినిమా దశను మార్చిన ట్రెండ్ సెట్టింగ్ సినిమాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఈ చిత్రంతోనే విజయ్ దేవరకొండ హీరోగా మారి మంచి పేరు సంపాదించాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ పేరు మార్మోగేలా చేసిన సినిమా ఇది. ఈ చిత్రం ఇతర భాషల వాళ్లనూ మెప్పించింది.
హిందీ, తమిళ భాషల్లో రీమేక్ కోసం ఎప్పుడో హక్కులు కొన్నారు. హిందీలో ఆల్రెడీ ఈ చిత్రం రీమేక్ అయింది కూడా. తమిళ రీమేక్ మూడేళ్ల కిందటే తెరకెక్కాల్సింది. విష్ణు విశాల్, తమన్నా జంటగా ఈ సినిమాను మొదలుపెట్టారు కూడా. కానీ ఎందుకో ఆ సినిమా ముందుకు కదల్లేదు. క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ‘పెళ్ళిచూపులు’ రీమేక్ గురించి అందరూ మరిచిపోయారు.
ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ ‘పెళ్ళిచూపులు’ రీమేక్ తెరపైకి వచ్చింది. కొత్త కాంబినేషన్లో ఈ సినిమా మొదలైంది. ‘జెర్సీ’ సినిమాలో నాని కొడుకు పాత్రలో కనిపించిన హరీష్ కళ్యాణ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కథానాయికగా మారిన ఒకప్పటి టెలివిజన్ న్యూస్ ప్రెజెంటర్ ప్రియ భవానీ శంకర్ ఇందులో కథానాయిక. ‘ఓ మనప్పెన్నే’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కార్తీక్ సుందర్ అనే దర్శకుడు రూపొందించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ‘పెళ్ళిచూపులు’ హీరో అయిన విజయ్ దేవరకొండనే రిలీజ్ చేయడం విశేషం.
ఇక ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. దీన్ని నిర్మిస్తున్నది తెలుగు నిర్మాతే. గత ఏడాది తమిళ హిట్ ‘రాక్షసన్’ను ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులో నిర్మించిన కోనేరు సత్యనారాయణ.. ‘పెళ్ళిచూపులు’ రీమేక్తో తమిళంలోకి అడుగుపెడుతున్నారు. మరి తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తమిళంలో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
This post was last modified on October 2, 2020 11:46 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…