నాలుగేళ్ల కిందట తెలుగులో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది ‘పెళ్ళిచూపులు’. దాన్ని తెలుగు సినిమా దశను మార్చిన ట్రెండ్ సెట్టింగ్ సినిమాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఈ చిత్రంతోనే విజయ్ దేవరకొండ హీరోగా మారి మంచి పేరు సంపాదించాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ పేరు మార్మోగేలా చేసిన సినిమా ఇది. ఈ చిత్రం ఇతర భాషల వాళ్లనూ మెప్పించింది.
హిందీ, తమిళ భాషల్లో రీమేక్ కోసం ఎప్పుడో హక్కులు కొన్నారు. హిందీలో ఆల్రెడీ ఈ చిత్రం రీమేక్ అయింది కూడా. తమిళ రీమేక్ మూడేళ్ల కిందటే తెరకెక్కాల్సింది. విష్ణు విశాల్, తమన్నా జంటగా ఈ సినిమాను మొదలుపెట్టారు కూడా. కానీ ఎందుకో ఆ సినిమా ముందుకు కదల్లేదు. క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ‘పెళ్ళిచూపులు’ రీమేక్ గురించి అందరూ మరిచిపోయారు.
ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ ‘పెళ్ళిచూపులు’ రీమేక్ తెరపైకి వచ్చింది. కొత్త కాంబినేషన్లో ఈ సినిమా మొదలైంది. ‘జెర్సీ’ సినిమాలో నాని కొడుకు పాత్రలో కనిపించిన హరీష్ కళ్యాణ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కథానాయికగా మారిన ఒకప్పటి టెలివిజన్ న్యూస్ ప్రెజెంటర్ ప్రియ భవానీ శంకర్ ఇందులో కథానాయిక. ‘ఓ మనప్పెన్నే’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కార్తీక్ సుందర్ అనే దర్శకుడు రూపొందించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ‘పెళ్ళిచూపులు’ హీరో అయిన విజయ్ దేవరకొండనే రిలీజ్ చేయడం విశేషం.
ఇక ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. దీన్ని నిర్మిస్తున్నది తెలుగు నిర్మాతే. గత ఏడాది తమిళ హిట్ ‘రాక్షసన్’ను ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులో నిర్మించిన కోనేరు సత్యనారాయణ.. ‘పెళ్ళిచూపులు’ రీమేక్తో తమిళంలోకి అడుగుపెడుతున్నారు. మరి తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తమిళంలో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
This post was last modified on October 2, 2020 11:46 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…