నాలుగేళ్ల కిందట తెలుగులో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది ‘పెళ్ళిచూపులు’. దాన్ని తెలుగు సినిమా దశను మార్చిన ట్రెండ్ సెట్టింగ్ సినిమాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఈ చిత్రంతోనే విజయ్ దేవరకొండ హీరోగా మారి మంచి పేరు సంపాదించాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ పేరు మార్మోగేలా చేసిన సినిమా ఇది. ఈ చిత్రం ఇతర భాషల వాళ్లనూ మెప్పించింది.
హిందీ, తమిళ భాషల్లో రీమేక్ కోసం ఎప్పుడో హక్కులు కొన్నారు. హిందీలో ఆల్రెడీ ఈ చిత్రం రీమేక్ అయింది కూడా. తమిళ రీమేక్ మూడేళ్ల కిందటే తెరకెక్కాల్సింది. విష్ణు విశాల్, తమన్నా జంటగా ఈ సినిమాను మొదలుపెట్టారు కూడా. కానీ ఎందుకో ఆ సినిమా ముందుకు కదల్లేదు. క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ‘పెళ్ళిచూపులు’ రీమేక్ గురించి అందరూ మరిచిపోయారు.
ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ ‘పెళ్ళిచూపులు’ రీమేక్ తెరపైకి వచ్చింది. కొత్త కాంబినేషన్లో ఈ సినిమా మొదలైంది. ‘జెర్సీ’ సినిమాలో నాని కొడుకు పాత్రలో కనిపించిన హరీష్ కళ్యాణ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కథానాయికగా మారిన ఒకప్పటి టెలివిజన్ న్యూస్ ప్రెజెంటర్ ప్రియ భవానీ శంకర్ ఇందులో కథానాయిక. ‘ఓ మనప్పెన్నే’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కార్తీక్ సుందర్ అనే దర్శకుడు రూపొందించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ‘పెళ్ళిచూపులు’ హీరో అయిన విజయ్ దేవరకొండనే రిలీజ్ చేయడం విశేషం.
ఇక ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. దీన్ని నిర్మిస్తున్నది తెలుగు నిర్మాతే. గత ఏడాది తమిళ హిట్ ‘రాక్షసన్’ను ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులో నిర్మించిన కోనేరు సత్యనారాయణ.. ‘పెళ్ళిచూపులు’ రీమేక్తో తమిళంలోకి అడుగుపెడుతున్నారు. మరి తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తమిళంలో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
This post was last modified on October 2, 2020 11:46 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…