నాలుగేళ్ల కిందట తెలుగులో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది ‘పెళ్ళిచూపులు’. దాన్ని తెలుగు సినిమా దశను మార్చిన ట్రెండ్ సెట్టింగ్ సినిమాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఈ చిత్రంతోనే విజయ్ దేవరకొండ హీరోగా మారి మంచి పేరు సంపాదించాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ పేరు మార్మోగేలా చేసిన సినిమా ఇది. ఈ చిత్రం ఇతర భాషల వాళ్లనూ మెప్పించింది.
హిందీ, తమిళ భాషల్లో రీమేక్ కోసం ఎప్పుడో హక్కులు కొన్నారు. హిందీలో ఆల్రెడీ ఈ చిత్రం రీమేక్ అయింది కూడా. తమిళ రీమేక్ మూడేళ్ల కిందటే తెరకెక్కాల్సింది. విష్ణు విశాల్, తమన్నా జంటగా ఈ సినిమాను మొదలుపెట్టారు కూడా. కానీ ఎందుకో ఆ సినిమా ముందుకు కదల్లేదు. క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ‘పెళ్ళిచూపులు’ రీమేక్ గురించి అందరూ మరిచిపోయారు.
ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ ‘పెళ్ళిచూపులు’ రీమేక్ తెరపైకి వచ్చింది. కొత్త కాంబినేషన్లో ఈ సినిమా మొదలైంది. ‘జెర్సీ’ సినిమాలో నాని కొడుకు పాత్రలో కనిపించిన హరీష్ కళ్యాణ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కథానాయికగా మారిన ఒకప్పటి టెలివిజన్ న్యూస్ ప్రెజెంటర్ ప్రియ భవానీ శంకర్ ఇందులో కథానాయిక. ‘ఓ మనప్పెన్నే’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కార్తీక్ సుందర్ అనే దర్శకుడు రూపొందించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ‘పెళ్ళిచూపులు’ హీరో అయిన విజయ్ దేవరకొండనే రిలీజ్ చేయడం విశేషం.
ఇక ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. దీన్ని నిర్మిస్తున్నది తెలుగు నిర్మాతే. గత ఏడాది తమిళ హిట్ ‘రాక్షసన్’ను ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులో నిర్మించిన కోనేరు సత్యనారాయణ.. ‘పెళ్ళిచూపులు’ రీమేక్తో తమిళంలోకి అడుగుపెడుతున్నారు. మరి తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తమిళంలో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
This post was last modified on October 2, 2020 11:46 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…