గురువారం అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఉన్నట్లుండి అల్లు వారి కుటుంబం ‘అల్లు స్టూడియోస్’ను ఆరంభించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టూడియోల నిర్మాణం, వాటి మెయింటైనెన్స్ అంటే చిన్న విషయం కాదు. ఇప్పటికిప్పుడు అంత పెద్ద బాధ్యతను అల్లు ఫ్యామిలీ ఎందుకు నెత్తికెత్తుకుందని అందరికీ సందేహం కలిగింది. ఐతే అరవింద్ ఎంత తెలివైన వారో.. ఆయన ఏ అడుగు వేసినా అందులో ఎంత ప్రణాళిక ఉంటుందో ఇండస్ట్రీ జనాలకు తెలియంది కాదు.
అరవింద్ గత ఏడాది సొంతంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మొదలుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తే చాలామంది పెదవి విరిచినవాళ్లే. అప్పటికే ఉన్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో ఉండే కంటెంట్, వాటి రేంజ్ను అంచనా వేసి.. అది చాలా పెద్ద వ్యవహారం.. లోకల్గా వర్కవుట్ కాదనే చాలామంది అన్నారు. కానీ లోకల్ కంటెంట్తోనే దాన్ని విజయవంతం చేశారు అరవింద్.
కొత్త కంటెంట్, అందులోనూ ఒరిజినల్ కంటెంట్ పెంచితే తప్ప ‘ఆహా’ను విజయవంతంగా కొనసాగించడం కష్టం. అందుకే కొత్త సినిమాలు కొంటున్నారు. అలాగే పెద్ద ఎత్తున వెబ్ సిరీస్ల నిర్మాణానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఐతే సాధ్యమైనంత మేర బడ్జెట్లను నియంత్రించి తక్కువ ఖర్చుతో చేస్తే తప్ప అవి వర్కవుట్ కావని భావించిన అరవింద్.. ఆ దిశగానే స్టూడియో నిర్మాణం ప్రారంభించారని అంటున్నారు మల్టీపర్పస్గా ఉంటూ, ఎలా కావాలంటే అలా మార్చుకునే ఫ్లోర్లతోనే ఈ స్టూడియో ఏర్పాటు కానుందట.
భవిష్యత్తులో ‘ఆహా’ కోసం చేసే ఒరిజినల్స్ అన్నింటి చిత్రీకరణా చాలా వరకు ఇక్కడే కానిచ్చేస్తారట. బయటి స్టూడియోల్లో అద్దెలు భారీగా ఉన్న నేపథ్యంలో నిరంతరం సాగే వెబ్ సిరీస్ల షూటింగ్కు చాలా ఎక్కువ ఖర్చవుతుందని.. దాని బదులు స్టూడియో మీద పెట్టుబడి పెడితే ఒరిజినల్స్ అన్నీ ఇక్కడే చేసుకోవడంతో పాటు బయటి వాళ్లకు, తమ సినిమాలకు కూడా వాడుకోవచ్చని భావించి ఈ స్టూడియో నిర్మాణం చేపట్టినట్లు సమాచారం.
This post was last modified on October 2, 2020 11:36 am
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…
2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…
తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…
ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…