గురువారం అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఉన్నట్లుండి అల్లు వారి కుటుంబం ‘అల్లు స్టూడియోస్’ను ఆరంభించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టూడియోల నిర్మాణం, వాటి మెయింటైనెన్స్ అంటే చిన్న విషయం కాదు. ఇప్పటికిప్పుడు అంత పెద్ద బాధ్యతను అల్లు ఫ్యామిలీ ఎందుకు నెత్తికెత్తుకుందని అందరికీ సందేహం కలిగింది. ఐతే అరవింద్ ఎంత తెలివైన వారో.. ఆయన ఏ అడుగు వేసినా అందులో ఎంత ప్రణాళిక ఉంటుందో ఇండస్ట్రీ జనాలకు తెలియంది కాదు.
అరవింద్ గత ఏడాది సొంతంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మొదలుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తే చాలామంది పెదవి విరిచినవాళ్లే. అప్పటికే ఉన్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో ఉండే కంటెంట్, వాటి రేంజ్ను అంచనా వేసి.. అది చాలా పెద్ద వ్యవహారం.. లోకల్గా వర్కవుట్ కాదనే చాలామంది అన్నారు. కానీ లోకల్ కంటెంట్తోనే దాన్ని విజయవంతం చేశారు అరవింద్.
కొత్త కంటెంట్, అందులోనూ ఒరిజినల్ కంటెంట్ పెంచితే తప్ప ‘ఆహా’ను విజయవంతంగా కొనసాగించడం కష్టం. అందుకే కొత్త సినిమాలు కొంటున్నారు. అలాగే పెద్ద ఎత్తున వెబ్ సిరీస్ల నిర్మాణానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఐతే సాధ్యమైనంత మేర బడ్జెట్లను నియంత్రించి తక్కువ ఖర్చుతో చేస్తే తప్ప అవి వర్కవుట్ కావని భావించిన అరవింద్.. ఆ దిశగానే స్టూడియో నిర్మాణం ప్రారంభించారని అంటున్నారు మల్టీపర్పస్గా ఉంటూ, ఎలా కావాలంటే అలా మార్చుకునే ఫ్లోర్లతోనే ఈ స్టూడియో ఏర్పాటు కానుందట.
భవిష్యత్తులో ‘ఆహా’ కోసం చేసే ఒరిజినల్స్ అన్నింటి చిత్రీకరణా చాలా వరకు ఇక్కడే కానిచ్చేస్తారట. బయటి స్టూడియోల్లో అద్దెలు భారీగా ఉన్న నేపథ్యంలో నిరంతరం సాగే వెబ్ సిరీస్ల షూటింగ్కు చాలా ఎక్కువ ఖర్చవుతుందని.. దాని బదులు స్టూడియో మీద పెట్టుబడి పెడితే ఒరిజినల్స్ అన్నీ ఇక్కడే చేసుకోవడంతో పాటు బయటి వాళ్లకు, తమ సినిమాలకు కూడా వాడుకోవచ్చని భావించి ఈ స్టూడియో నిర్మాణం చేపట్టినట్లు సమాచారం.
This post was last modified on October 2, 2020 11:36 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…