తమిళనాడులో సరైన థియేటర్లు దొరకని కారణంగా కిరణ్ అబ్బవరం ‘క’ని అక్కడ వారం రోజులు ఆలస్యంగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అమరన్, బ్రదర్ లాంటి పెద్ద సినిమాలు ఉండటం వల్ల సరిపడా స్క్రీన్లు ఇవ్వలేమని కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని వినిపిస్తోంది. కానీ మన దగ్గర మాత్రం అమరన్ కు స్వాగతం పలుకుతున్నారు. పంపిణి పరంగా పేరొందిన సంస్థలే అండదండలు అందిస్తాయని వేరే చెప్పనక్కర్లేదు. కనీసం టైటిల్స్ మార్చకుండా యధాతథంగా తమిళ పేర్లు పెట్టడం పట్ల నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ ధోరణిలో మార్పు లేదు.
సరే ఇదంతా కాసేపు పక్కనపెడితే చిరంజీవి ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం. 2022లో గాడ్ ఫాదర్ రిలీజైన సమయంలోనూ ఇదే సమస్య వచ్చింది. దీనికి సరిగ్గా వారం ముందు పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 వచ్చింది. హిట్ టాక్ రావడంతో భారీ ఎత్తున సెకండ్ వీక్ థియేటర్లను కొనసాగించారు. దీంతో మెగాస్టార్ కు స్క్రీన్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేయడంతో తెలుగు వెర్షన్ అక్టోబర్ 5 వస్తే చాలా చోట్ల తమిళంలో అక్టోబర్ 14 వదలాల్సి వచ్చింది. అంత పెద్ద స్టార్ చిరంజీవికే ఇబ్బంది తప్పనప్పుడు కిరణ్ అబ్బవరం లాంటి అప్ కమింగ్ హీరోకు గ్రాండ్ వెల్కమ్ చెబుతారని ఎలా అనుకుంటాం.
ఏది ఏమైనా ఈ పద్దతిలో మార్పు రావాలి. మనమేమో వాళ్ళ సినిమాలను నెత్తిన బెట్టుకుంటే అక్కడేమో కనీసం డబ్బింగులుకు కాసిన్ని స్క్రీన్లు ఇవ్వడానికి కూడా బెట్టు చేస్తారు. సంక్రాంతి, దసరా, దీపావళి ఇలా పండగ ఏదైనా సరే ఎంత టైట్ ఉన్నా సరే సర్దుబాటు అనేది మనవైపు నుంచి ఎప్పుడూ జరుగుతూనే ఉంది. అజిత్, విజయ్, విక్రమ్, కార్తీ ఇలా భేదం లేకుండా అందరికీ ఆదరణ ఇస్తున్నాం. కానీ ఇందులో కనీసం సగమైనా టాలీవుడ్ మీద చూపించాలి కదా అనే ప్రశ్నకు సమాధానం ఉండదు. పెద్దలు పూనుకుంటే తప్ప పరిష్కారం కానిది ఇది. కానీ ఆ సూచనలు కనుచూపుమేరలో లేవు. ఎప్పటికైనా జరిగేనా.
This post was last modified on October 23, 2024 11:30 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…