థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చడంలో మల్టీప్లెక్సుల పాత్ర చాలా పెద్దది. పట్టుమని పాతిక రూపాయలు ఖరీదు చేయని పాప్ కార్న్ ని అయిదు వందలకు కొనిపించేలా చేయడంలో సక్సెసైన ఘనత కూడా వీటికే దక్కుతుంది. అయితే గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో ఆదాయాలు లేకపోవడం యాజమాన్యాలను ఖంగారు పెడుతోంది. దేశవ్యాప్తంగా పేరొందిన ఒక మల్టీప్లెక్స్ సముదాయానికి మొత్తం అన్ని స్క్రీన్లు కలిపి ప్రాఫిట్ అండ్ లాస్ లెక్కలేసుకుని చూసుకుంటే నికరంగా పదిహేను కోట్లకు పైగా నష్టమే మిగిలింది తప్ప ఓనర్ కు ఒక్క రూపాయి మిగల్లేదని ట్రేడ్ టాక్.
కల్కి, దేవర, హనుమాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్లు రెవెన్యూలు తెస్తున్నప్పటికీ ఏడాది మొత్తం ఖర్చులను మేనేజ్ చేయడానికి అవి సరిపోవడం లేదు. నెలకు కనీసం మూడు సూపర్ హిట్లు లేనిది మనుగడ కష్టమైన టైంలో రెండు నెలలకోకటి రావడమే గగనమైపోతోంది. ఉదాహరణకు బాలీవుడ్ నే తీసుకుంటే స్త్రీ 2 వచ్చి రెండు నెలలు దాటుతున్నా దాన్ని మించే విజయం ఇంకే హిందీ సినిమా సాధించలేదు. మన దగ్గర దేవర తర్వాత ఎన్ని రిలీజైనా దాని దరిదాపుల్లోకి వెళ్లిన కొత్త మూవీ ఒక్కటి లేదు. ఇదంతా నిర్వహణ వ్యయం మీద తీవ్ర ప్రభావం చూపించి బడ్జెట్ లను విపరీతంగా పెంచేస్తోంది.
దీంతో ఒక మల్టీప్లెక్స్ చైన్ త్వరలో రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టే ప్రణాళికను సిద్ధం చేస్తోందట. అంటే విలాసవంతమైన విందు భోజనాలు, తిండి పదార్థాలు అందించే హోటళ్లను తమ థియేటర్లోనే పెడతారన్న మాట. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. అయితే వినోదం కోసం థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులను ఈ తిండి గోలతో విసిగిస్తే ప్లాన్ రివర్స్ అయ్యే అవకాశాలను సదరు సంస్థ సీరియస్ గా విశ్లేషించే పనిలో ఉంది. అయినా షోలు పెంచకుండా, టికెట్ రేట్లు తగ్గించకుండా, స్నాక్స్ ధరలు సవరించకుండా ఇలాంటి మార్కెటింగ్ ప్లాన్లు ఎన్ని వేసినా ప్రయోజనం తక్కువే.
This post was last modified on October 17, 2024 4:00 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…