Movie News

ఆదాయం కోసం మల్టీప్లెక్సుల తిప్పలు

థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చడంలో మల్టీప్లెక్సుల పాత్ర చాలా పెద్దది. పట్టుమని పాతిక రూపాయలు ఖరీదు చేయని పాప్ కార్న్ ని అయిదు వందలకు కొనిపించేలా చేయడంలో సక్సెసైన ఘనత కూడా వీటికే దక్కుతుంది. అయితే గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో ఆదాయాలు లేకపోవడం యాజమాన్యాలను ఖంగారు పెడుతోంది. దేశవ్యాప్తంగా పేరొందిన ఒక మల్టీప్లెక్స్ సముదాయానికి మొత్తం అన్ని స్క్రీన్లు కలిపి ప్రాఫిట్ అండ్ లాస్ లెక్కలేసుకుని చూసుకుంటే నికరంగా పదిహేను కోట్లకు పైగా నష్టమే మిగిలింది తప్ప ఓనర్ కు ఒక్క రూపాయి మిగల్లేదని ట్రేడ్ టాక్.

కల్కి, దేవర, హనుమాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్లు రెవెన్యూలు తెస్తున్నప్పటికీ ఏడాది మొత్తం ఖర్చులను మేనేజ్ చేయడానికి అవి సరిపోవడం లేదు. నెలకు కనీసం మూడు సూపర్ హిట్లు లేనిది మనుగడ కష్టమైన టైంలో రెండు నెలలకోకటి రావడమే గగనమైపోతోంది. ఉదాహరణకు బాలీవుడ్ నే తీసుకుంటే స్త్రీ 2 వచ్చి రెండు నెలలు దాటుతున్నా దాన్ని మించే విజయం ఇంకే హిందీ సినిమా సాధించలేదు. మన దగ్గర దేవర తర్వాత ఎన్ని రిలీజైనా దాని దరిదాపుల్లోకి వెళ్లిన కొత్త మూవీ ఒక్కటి లేదు. ఇదంతా నిర్వహణ వ్యయం మీద తీవ్ర ప్రభావం చూపించి బడ్జెట్ లను విపరీతంగా పెంచేస్తోంది.

దీంతో ఒక మల్టీప్లెక్స్ చైన్ త్వరలో రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టే ప్రణాళికను సిద్ధం చేస్తోందట. అంటే విలాసవంతమైన విందు భోజనాలు, తిండి పదార్థాలు అందించే హోటళ్లను తమ థియేటర్లోనే పెడతారన్న మాట. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. అయితే వినోదం కోసం థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులను ఈ తిండి గోలతో విసిగిస్తే ప్లాన్ రివర్స్ అయ్యే అవకాశాలను సదరు సంస్థ సీరియస్ గా విశ్లేషించే పనిలో ఉంది. అయినా షోలు పెంచకుండా, టికెట్ రేట్లు తగ్గించకుండా, స్నాక్స్ ధరలు సవరించకుండా ఇలాంటి మార్కెటింగ్ ప్లాన్లు ఎన్ని వేసినా ప్రయోజనం తక్కువే.

This post was last modified on October 17, 2024 4:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

10 seconds ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago