టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ నిర్మాతలు ఉన్నా కూడా అందులో డిఫరెంట్ కాంబినేషన్స్ ను సెట్ చేసే వారిలో దిల్ రాజు ముందుంటారు. ఒకప్పుడు కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చిన దిల్ రాజు ఇప్పుడు మాత్రం సీనియర్ దర్శకులతోనూ భారీ సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజు గారికి కనెక్ట్ అయితే ఫ్లాప్ ఇచ్చిన దర్శకులతో కూడా మరోసారి సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు.
గతంలో మున్నా సినిమాతో సక్సెస్ కాలేకపోయిన వంశీ పైడిపల్లికి బృందావనంతో ఛాన్స్ ఇచ్చి ట్రాక్ లోకి తీసుకొచ్చారు. ఇక వేణు శ్రీరామ్ ఓ మై ఫ్రెండ్ తో విఫలమైనా అతనికి MCAతో మరో అవకాశం ఇచ్చి లైన్ లోకి తెచ్చాడు. ఆ లిస్టులో జోష్ వాసువర్మ కూడా ఉన్నాడు. కాకపోతే అతను కృష్ణాష్టమి తో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు ఫ్లాప్ అందుకున్న మరో దర్శకుడితో క్రేజీ కాంబినేషన్ సెట్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ దర్శకుడు మరెవరో కాదు, ఫ్యామిలీ స్టార్ తో ఊహించని షాక్ ఇచ్చిన పరశురామ్. మంచి టాలెంటెడ్ దర్శకుడు అయినప్పటికీ గీతగోవిందం తరువాత అతని ట్రాక్ మళ్ళీ తప్పినట్లు అనిపిస్తోంది. ఇక దిల్ రాజు సలహా మేరకు మరో కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. హీరో ఎవరు అనే విషయంలో మరికొన్ని గాసిప్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. మొదటి ఛాయిస్ గా నవీన్ పోలిశెట్టిని అనుకున్నారట. కానీ ఎందుకో అతనుసెట్టవ్వలేదని టాక్.
ఇక DJ టిల్లు సిద్ధు జొన్నలగడ్డను ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. చాలా కాలంగా సిద్ధు తో కూడా దిల్ రాజు ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అలాగే పరశురామ్ కు కూడా ఫ్యామిలీ స్టార్ టైమ్ లోనే మరో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఫైనల్ గా రాజుగారు ఒక న్యూ కాంబినేషన్ లో అయితే డిఫరెంట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. మరి దర్శకుడు ఈసారి ఎలాంటి కంటెంట్ తో వస్తాడో చూడాలి.
This post was last modified on October 16, 2024 3:56 pm
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…