Movie News

ఫ్లాప్ ఇచ్చినా.. దిల్ రాజు పర్ఫెక్ట్ ప్లాన్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ నిర్మాతలు ఉన్నా కూడా అందులో డిఫరెంట్ కాంబినేషన్స్ ను సెట్ చేసే వారిలో దిల్ రాజు ముందుంటారు. ఒకప్పుడు కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చిన దిల్ రాజు ఇప్పుడు మాత్రం సీనియర్ దర్శకులతోనూ భారీ సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజు గారికి కనెక్ట్ అయితే ఫ్లాప్ ఇచ్చిన దర్శకులతో కూడా మరోసారి సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు.

గతంలో మున్నా సినిమాతో సక్సెస్ కాలేకపోయిన వంశీ పైడిపల్లికి బృందావనంతో ఛాన్స్ ఇచ్చి ట్రాక్ లోకి తీసుకొచ్చారు. ఇక వేణు శ్రీరామ్ ఓ మై ఫ్రెండ్ తో విఫలమైనా అతనికి MCAతో మరో అవకాశం ఇచ్చి లైన్ లోకి తెచ్చాడు. ఆ లిస్టులో జోష్ వాసువర్మ కూడా ఉన్నాడు. కాకపోతే అతను కృష్ణాష్టమి తో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు ఫ్లాప్ అందుకున్న మరో దర్శకుడితో క్రేజీ కాంబినేషన్ సెట్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ దర్శకుడు మరెవరో కాదు, ఫ్యామిలీ స్టార్ తో ఊహించని షాక్ ఇచ్చిన పరశురామ్. మంచి టాలెంటెడ్ దర్శకుడు అయినప్పటికీ గీతగోవిందం తరువాత అతని ట్రాక్ మళ్ళీ తప్పినట్లు అనిపిస్తోంది. ఇక దిల్ రాజు సలహా మేరకు మరో కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. హీరో ఎవరు అనే విషయంలో మరికొన్ని గాసిప్స్ కూడా పుట్టుకొస్తున్నాయి.  మొదటి ఛాయిస్ గా నవీన్ పోలిశెట్టిని అనుకున్నారట. కానీ ఎందుకో అతనుసెట్టవ్వలేదని టాక్.

ఇక DJ టిల్లు సిద్ధు జొన్నలగడ్డను ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. చాలా కాలంగా సిద్ధు తో కూడా దిల్ రాజు ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అలాగే పరశురామ్ కు కూడా ఫ్యామిలీ స్టార్ టైమ్ లోనే మరో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఫైనల్ గా రాజుగారు ఒక న్యూ కాంబినేషన్ లో అయితే డిఫరెంట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. మరి దర్శకుడు ఈసారి ఎలాంటి కంటెంట్ తో వస్తాడో చూడాలి.

This post was last modified on October 16, 2024 3:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

16 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

2 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

2 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

4 hours ago