డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్.. దర్శకరత్న దాసరి నారాయణరావే కాదు.. చాలామంది దిగ్గజాలు చెప్పే మాటే ఇది. సినిమాకు సంబంధించి అత్యంత ముఖ్యమైన వ్యక్తి దర్శకుడే అనే విషయంలో మరో మాట లేదు. అందుకే మిగతా 23 విభాగాలకు చెందిన వాళ్లు కూడా వీలుంటే దర్శకత్వం చేసేద్దామని చూస్తుంటారు.
ఆ కోరికను నెరవేర్చుకున్న వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. ఐతే ప్రొడక్షన్ డిజైన్ నుంచి దర్శకత్వంలోకి మారిన వాళ్లు పెద్దగా కనిపించరు. ఈ జాబితాలో చేరడానికి సిద్ధమవుతున్నాడట ఓ టాప్ ఆర్ట్ డైరెక్టర్. అతనే.. రవీందర్. ఛత్రపతి, మగధీర, ఈగ, నాన్నకు ప్రేమతో లాంటి భారీ చిత్రాలకు అతను కళా దర్శకుడిగా పని చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మెగా మూవీ రాధేశ్యామ్కు అతనే ఆర్ట్ డైరెక్టర్.
రాధేశ్యామ్ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ వాళ్లే రవీందర్ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. రాధశ్యామ్ చిత్రీకరణ సందర్భంగా యువి అధినేతల్ని ఇంప్రెస్ చేసిన రవీందర్.. ఓ కథ చెప్పి వారితో ఓకే చేయించుకున్నాడట. ఇది ఓ టెక్నికల్ థ్రిల్లర్ అని అంటున్నారు. ఇంకా హీరో, ఇతర వివరాలేమీ వెల్లడి కాలేదు.
కొత్త దర్శకుల్ని పరిచయం చేయడంలో యువి వాళ్లకు మంచి పేరుంది. కొరటాల శివ, సుజీత్, రాధాకృష్ణకుమార్ లాంటి దర్శకులను ఈ సంస్థే పరిచయం చేసింది. మరి వీరి కోవలోనే రవీందర్ కూడా తనదైన ముద్ర వేసి దర్శకుడిగా సత్తా చాటుతాడేమో చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…