డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్.. దర్శకరత్న దాసరి నారాయణరావే కాదు.. చాలామంది దిగ్గజాలు చెప్పే మాటే ఇది. సినిమాకు సంబంధించి అత్యంత ముఖ్యమైన వ్యక్తి దర్శకుడే అనే విషయంలో మరో మాట లేదు. అందుకే మిగతా 23 విభాగాలకు చెందిన వాళ్లు కూడా వీలుంటే దర్శకత్వం చేసేద్దామని చూస్తుంటారు.
ఆ కోరికను నెరవేర్చుకున్న వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. ఐతే ప్రొడక్షన్ డిజైన్ నుంచి దర్శకత్వంలోకి మారిన వాళ్లు పెద్దగా కనిపించరు. ఈ జాబితాలో చేరడానికి సిద్ధమవుతున్నాడట ఓ టాప్ ఆర్ట్ డైరెక్టర్. అతనే.. రవీందర్. ఛత్రపతి, మగధీర, ఈగ, నాన్నకు ప్రేమతో లాంటి భారీ చిత్రాలకు అతను కళా దర్శకుడిగా పని చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మెగా మూవీ రాధేశ్యామ్కు అతనే ఆర్ట్ డైరెక్టర్.
రాధేశ్యామ్ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ వాళ్లే రవీందర్ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. రాధశ్యామ్ చిత్రీకరణ సందర్భంగా యువి అధినేతల్ని ఇంప్రెస్ చేసిన రవీందర్.. ఓ కథ చెప్పి వారితో ఓకే చేయించుకున్నాడట. ఇది ఓ టెక్నికల్ థ్రిల్లర్ అని అంటున్నారు. ఇంకా హీరో, ఇతర వివరాలేమీ వెల్లడి కాలేదు.
కొత్త దర్శకుల్ని పరిచయం చేయడంలో యువి వాళ్లకు మంచి పేరుంది. కొరటాల శివ, సుజీత్, రాధాకృష్ణకుమార్ లాంటి దర్శకులను ఈ సంస్థే పరిచయం చేసింది. మరి వీరి కోవలోనే రవీందర్ కూడా తనదైన ముద్ర వేసి దర్శకుడిగా సత్తా చాటుతాడేమో చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
This post was last modified on August 10, 2020 6:36 am
కోలుకోలేని ప్రాణాంతక జబ్బులతో బాధపడుతూ, లైఫ్ సపోర్ట్పై ఆధారపడే రోగులకు గౌరవంగా మరణించే అవకాశం కల్పించేలా కర్ణాటక ప్రభుత్వం కీలక…
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు తెర లేసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి హడావిడి కనిపించడం…
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో హర్షిత్ రాణా అరంగేట్రం చేస్తూ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. టీమిండియా విజయంలో…
మాటల మాంత్రికుడు.. తెలుగు వారు ఎక్కడున్నా వారిని తనవైపు తిప్పుకోగల నేర్పు, ఓర్పు ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.. సీఎం…
రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ…
మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా…