డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్.. దర్శకరత్న దాసరి నారాయణరావే కాదు.. చాలామంది దిగ్గజాలు చెప్పే మాటే ఇది. సినిమాకు సంబంధించి అత్యంత ముఖ్యమైన వ్యక్తి దర్శకుడే అనే విషయంలో మరో మాట లేదు. అందుకే మిగతా 23 విభాగాలకు చెందిన వాళ్లు కూడా వీలుంటే దర్శకత్వం చేసేద్దామని చూస్తుంటారు.
ఆ కోరికను నెరవేర్చుకున్న వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. ఐతే ప్రొడక్షన్ డిజైన్ నుంచి దర్శకత్వంలోకి మారిన వాళ్లు పెద్దగా కనిపించరు. ఈ జాబితాలో చేరడానికి సిద్ధమవుతున్నాడట ఓ టాప్ ఆర్ట్ డైరెక్టర్. అతనే.. రవీందర్. ఛత్రపతి, మగధీర, ఈగ, నాన్నకు ప్రేమతో లాంటి భారీ చిత్రాలకు అతను కళా దర్శకుడిగా పని చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మెగా మూవీ రాధేశ్యామ్కు అతనే ఆర్ట్ డైరెక్టర్.
రాధేశ్యామ్ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ వాళ్లే రవీందర్ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. రాధశ్యామ్ చిత్రీకరణ సందర్భంగా యువి అధినేతల్ని ఇంప్రెస్ చేసిన రవీందర్.. ఓ కథ చెప్పి వారితో ఓకే చేయించుకున్నాడట. ఇది ఓ టెక్నికల్ థ్రిల్లర్ అని అంటున్నారు. ఇంకా హీరో, ఇతర వివరాలేమీ వెల్లడి కాలేదు.
కొత్త దర్శకుల్ని పరిచయం చేయడంలో యువి వాళ్లకు మంచి పేరుంది. కొరటాల శివ, సుజీత్, రాధాకృష్ణకుమార్ లాంటి దర్శకులను ఈ సంస్థే పరిచయం చేసింది. మరి వీరి కోవలోనే రవీందర్ కూడా తనదైన ముద్ర వేసి దర్శకుడిగా సత్తా చాటుతాడేమో చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
This post was last modified on August 10, 2020 6:36 am
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాల్లో ప్రయత్నించినా.. విద్యార్థుల ఆందోళనలను నిలువరించలేకపోతోంది. ఇప్పటికే బల ప్రయోగం చేయడంతో ఇది తీవ్ర వివాదానికి…
ఉప ముఖ్యమంత్రి పవన్ కు ఇది పెద్ద పరీక్షే. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక ముందడుగు వేస్తున్న ఆ…
ఒక దశలో ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’, ‘ఎఫ్-2’ లాంటి విజయాలతో మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కెరీర్ మంచి…
ఒకరిని పొగడ్డానికి ఇంకొకరిని కించపరచాల్సిన అవసరం లేదు. అలాగే ఒకరిని విమర్శించే క్రమంలో కూడా అవసరం లేని ఇంకొకరి పేరు…
కొన్ని సినిమాలు రిలీజ్ టైంలో సరిగా ఆడవు. కానీ తర్వాతి కాలంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. ఇలాంటి పేరు చాలా…