లాక్ డౌన్ నేపథ్యంలో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది సినీ పరిశ్రమ. మామూలు పరిస్థితుల్లో అయితే గత నెల రోజుల్లో అరడజను సినిమాలైనా రిలీజై ఉండేవి. సమ్మర్ సీజన్ కాబట్టి ఆ సినిమాలన్నీ కొంచెం రేంజ్ ఉన్నవే అయ్యుండేవి. వేసవి సందడి పీక్స్లో ఉండే మే నెలలో ఐతే సినిమాల జాతర ఇంకా ఎక్కువగా ఉండేది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’కు కూడా మేలోనే వచ్చుండేది. కరోనా ప్రభావంతో అటు ఇటుగా ఆరు నెలల పాటు సినిమాల ప్రదర్శనకు అవకాశమే లేదని ఇండస్ట్రీ జనాలే అంటున్నారు. ఇందుకు మానసికంగా సిద్ధమైపోయి ఉన్నారు. థియేటర్లు తెరుచుకున్నాక కూడా మునుపట్లా జనాలు దండిగా థియేటర్లకు వస్తారా.. కొత్త సినిమా రిలీజైతే థియేటర్లను నింపేస్తారా అన్నది సందేహమే. పెద్ద సినిమాలు ఎలాగోలా తట్టుకుంటాయి కానీ.. చిన్న, మీడియం రేంజ్ సినిమాల భవితవ్యమే అర్థం కాకుండా ఉంది.
నెలలకు నెలలు వడ్డీల భారం మోసి చివరికి థియేట్రికల్ రిలీజ్లో ఆశించిన రెవెన్యూ రాకుంటే నిర్మాతల పని దయనీయం. ఈ నేపథ్యంలో అన్ని నెలలు ఆగడం కన్నా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. పూర్తి పెట్టుబడి రాకపోయినా ఉన్నంతలో మంచి రేటొస్తే అమ్మేస్తే ఎలా ఉంటుందని నిర్మాతలు ఆలోచిస్తుండగా.. హీరోలు మాత్రం ఇందుకు పూర్తి విముఖంగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఓటీటీల్లో రిలీజ్ చేస్తే తాము ప్రచారం కూడా చేయమని వాళ్లు మొండికేస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపించాయి.
ఐతే ఈ విషయంలో హీరోల్ని నిందించడానికేమీ లేదని అంటున్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ‘‘ఓటీటీల్లో సినిమాల విడుదలపై హీరోల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయన్నది అవాస్తవం. ఆర్నెల్ల కంటే ఎక్కువ రోజులు ఆగితే సినిమాలు పాతబడే ప్రమాదం కూడా ఉంది. ఆర్నెల్లకి కూడా థియేటర్లు ఆరంభం కాకపోతే అప్పుడేం చేస్తాం? అందుకే హీరోలు కూడా వాళ్ల సినిమాలు ప్రేక్షకులకు చేరువ కావడమే ముఖ్యం అనుకుంటారు. అది ఎక్కడన్నది ప్రధానం కాదు. ఐతే ఎప్పుడైనా సరే థియేటర్లో సినిమా చూసే అనుభూతి వేరు. మా ‘వి’ సినిమా విషయంలో అదే ఆలోచించాం. ఆ సౌండ్, విజువల్స్ థియేటర్లో గొప్ప అనుభూతినిస్తాయి. థియేటర్లు తెరిచి మామూలు పరిస్థితులు నెలకొంటే ప్రేక్షకులు ఎగబడి వస్తారు’’ అని రాజు అన్నాడు.
This post was last modified on April 27, 2020 10:14 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…