ఎంత ఒకే ఫ్యామిలీ బంధువులు అయినంత మాత్రాన ఇద్దరు హీరోలు లేదా స్టార్లు కలిసి ఒక సినిమా చేసే పరిస్థితులు టాలీవుడ్ లో లేవు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఫుల్ లెన్త్ రోల్స్ లో చూపించే కథను ఏ దర్శకుడు రాయలేకపోయాడు. బాలయ్య తారక్ లను ఒకే ఫ్రేమ్ లో చూడాలన్న నందమూరి అభిమానుల కోరిక తీరడం కష్టమే. ఎవరిదాకో ఎందుకు అప్ కమింగ్ స్టేజిలో ఉన్న సాయి ధరమ్ తేజ్, కొత్తగా లాంచ్ అయిన వైష్ణవ్ తేజ్ లు స్క్రీన్ పంచుకోవడం ఎప్పటికి జరిగేనో. వీటికి సవాలక్ష కారణాలున్నాయి. అందులో ముఖ్యమైంది ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదోననే భయం.
అలాంటి కాంబినేషన్లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలయిక కూడా ఉంది. ఈ కాంబోలో ఎవడు చేశారు కానీ కథ ప్రకారం ఇద్దరు వేసింది ఒకే పాత్ర కాబట్టి సింగల్ ఫ్రేమ్ లో చూసే ఛాన్స్ దక్కలేదు. అప్పటికి ఇప్పటికి ఇద్దరి స్టార్ డంలో చాలా మార్పు వచ్చింది. ఆర్ఆర్ఆర్ వల్ల చరణ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంటే పుష్ప పార్ట్ 1 రూపంలో తెలుగు కంటే ఎక్కువ నార్త్ లో బ్లాక్ బస్టర్ కొట్టాడు బన్నీ. అలాంటిది ఇద్దరూ కలిసి చేస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. దానికి ఛాన్స్ ఉందంటున్నారు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్.
అలీతో నిర్వహించిన టాక్ షోలో చరణ్ బన్నీలతో కలిసి తన స్వంత బ్యానర్ మీద ఒక మల్టీ స్టారర్ తీయాలని ప్లాన్ ఉందని, అందుకే చరణ్ అర్జున్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించి ప్రతి సంవత్సరం డబ్బులు కట్టి రెన్యూవల్ చేయిస్తున్నానని చెప్పేశారు. అయితే కథ సిద్ధంగా లేదు. ఎవరైనా వీళ్ళను రాజమౌళి రేంజ్ లో హ్యాండిల్ చేసే దర్శకుడు దొరికితే అప్పుడు చేస్తారన్న మాట. సో అభిమానులు దీని కోసం ఎదురు చూడొచ్చు. ఎప్పుడో తొంబై దశకంలో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ లు కరణ్ అర్జున్ అనే సూపర్ డూపర్ హిట్ వచ్చింది. ఇప్పుడు అదే సౌండ్ లో చరణ్ అర్జున్ కూడా వస్తే రికార్డులు బద్దలే
This post was last modified on October 18, 2022 6:46 am
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…