ఎంత ఒకే ఫ్యామిలీ బంధువులు అయినంత మాత్రాన ఇద్దరు హీరోలు లేదా స్టార్లు కలిసి ఒక సినిమా చేసే పరిస్థితులు టాలీవుడ్ లో లేవు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఫుల్ లెన్త్ రోల్స్ లో చూపించే కథను ఏ దర్శకుడు రాయలేకపోయాడు. బాలయ్య తారక్ లను ఒకే ఫ్రేమ్ లో చూడాలన్న నందమూరి అభిమానుల కోరిక తీరడం కష్టమే. ఎవరిదాకో ఎందుకు అప్ కమింగ్ స్టేజిలో ఉన్న సాయి ధరమ్ తేజ్, కొత్తగా లాంచ్ అయిన వైష్ణవ్ తేజ్ లు స్క్రీన్ పంచుకోవడం ఎప్పటికి జరిగేనో. వీటికి సవాలక్ష కారణాలున్నాయి. అందులో ముఖ్యమైంది ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదోననే భయం.
అలాంటి కాంబినేషన్లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలయిక కూడా ఉంది. ఈ కాంబోలో ఎవడు చేశారు కానీ కథ ప్రకారం ఇద్దరు వేసింది ఒకే పాత్ర కాబట్టి సింగల్ ఫ్రేమ్ లో చూసే ఛాన్స్ దక్కలేదు. అప్పటికి ఇప్పటికి ఇద్దరి స్టార్ డంలో చాలా మార్పు వచ్చింది. ఆర్ఆర్ఆర్ వల్ల చరణ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంటే పుష్ప పార్ట్ 1 రూపంలో తెలుగు కంటే ఎక్కువ నార్త్ లో బ్లాక్ బస్టర్ కొట్టాడు బన్నీ. అలాంటిది ఇద్దరూ కలిసి చేస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. దానికి ఛాన్స్ ఉందంటున్నారు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్.
అలీతో నిర్వహించిన టాక్ షోలో చరణ్ బన్నీలతో కలిసి తన స్వంత బ్యానర్ మీద ఒక మల్టీ స్టారర్ తీయాలని ప్లాన్ ఉందని, అందుకే చరణ్ అర్జున్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించి ప్రతి సంవత్సరం డబ్బులు కట్టి రెన్యూవల్ చేయిస్తున్నానని చెప్పేశారు. అయితే కథ సిద్ధంగా లేదు. ఎవరైనా వీళ్ళను రాజమౌళి రేంజ్ లో హ్యాండిల్ చేసే దర్శకుడు దొరికితే అప్పుడు చేస్తారన్న మాట. సో అభిమానులు దీని కోసం ఎదురు చూడొచ్చు. ఎప్పుడో తొంబై దశకంలో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ లు కరణ్ అర్జున్ అనే సూపర్ డూపర్ హిట్ వచ్చింది. ఇప్పుడు అదే సౌండ్ లో చరణ్ అర్జున్ కూడా వస్తే రికార్డులు బద్దలే
This post was last modified on October 18, 2022 6:46 am
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…