ఎంత ఒకే ఫ్యామిలీ బంధువులు అయినంత మాత్రాన ఇద్దరు హీరోలు లేదా స్టార్లు కలిసి ఒక సినిమా చేసే పరిస్థితులు టాలీవుడ్ లో లేవు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఫుల్ లెన్త్ రోల్స్ లో చూపించే కథను ఏ దర్శకుడు రాయలేకపోయాడు. బాలయ్య తారక్ లను ఒకే ఫ్రేమ్ లో చూడాలన్న నందమూరి అభిమానుల కోరిక తీరడం కష్టమే. ఎవరిదాకో ఎందుకు అప్ కమింగ్ స్టేజిలో ఉన్న సాయి ధరమ్ తేజ్, కొత్తగా లాంచ్ అయిన వైష్ణవ్ తేజ్ లు స్క్రీన్ పంచుకోవడం ఎప్పటికి జరిగేనో. వీటికి సవాలక్ష కారణాలున్నాయి. అందులో ముఖ్యమైంది ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదోననే భయం.
అలాంటి కాంబినేషన్లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలయిక కూడా ఉంది. ఈ కాంబోలో ఎవడు చేశారు కానీ కథ ప్రకారం ఇద్దరు వేసింది ఒకే పాత్ర కాబట్టి సింగల్ ఫ్రేమ్ లో చూసే ఛాన్స్ దక్కలేదు. అప్పటికి ఇప్పటికి ఇద్దరి స్టార్ డంలో చాలా మార్పు వచ్చింది. ఆర్ఆర్ఆర్ వల్ల చరణ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంటే పుష్ప పార్ట్ 1 రూపంలో తెలుగు కంటే ఎక్కువ నార్త్ లో బ్లాక్ బస్టర్ కొట్టాడు బన్నీ. అలాంటిది ఇద్దరూ కలిసి చేస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. దానికి ఛాన్స్ ఉందంటున్నారు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్.
అలీతో నిర్వహించిన టాక్ షోలో చరణ్ బన్నీలతో కలిసి తన స్వంత బ్యానర్ మీద ఒక మల్టీ స్టారర్ తీయాలని ప్లాన్ ఉందని, అందుకే చరణ్ అర్జున్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించి ప్రతి సంవత్సరం డబ్బులు కట్టి రెన్యూవల్ చేయిస్తున్నానని చెప్పేశారు. అయితే కథ సిద్ధంగా లేదు. ఎవరైనా వీళ్ళను రాజమౌళి రేంజ్ లో హ్యాండిల్ చేసే దర్శకుడు దొరికితే అప్పుడు చేస్తారన్న మాట. సో అభిమానులు దీని కోసం ఎదురు చూడొచ్చు. ఎప్పుడో తొంబై దశకంలో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ లు కరణ్ అర్జున్ అనే సూపర్ డూపర్ హిట్ వచ్చింది. ఇప్పుడు అదే సౌండ్ లో చరణ్ అర్జున్ కూడా వస్తే రికార్డులు బద్దలే
This post was last modified on October 18, 2022 6:46 am
రాష్ట్రంలోని 164 నియోజకవర్గాల్లో కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రజల సమస్యల పై వారు ప్రస్తావించాల్సి ఉంది. కానీ,…
వైసీపీ అధినేత జగన్.. అధికారంలో ఉన్నప్పుడు.. ఆయనను తీవ్రంగా విమర్శించిన వారిలో ముందున్నారు అప్పటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ…
రాష్ట్రంలో రాజకీయ పవనాలు మారుతున్నాయి. నాయకులు ఒక్కొక్కరుగా తమ దారి తాము చూసుకుంటున్నారు. మా నేత మారతాడనే అనుకుంటున్నాం. మారకపోతే..…
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు…
ఐపీఎల్ 2025లో అద్భుతమైన ఘట్టం నమోదైంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ బరిలోకి దిగిన బీహార్ టీనేజ్ క్రికెటర్…
భారత ప్రధాని నరేంద్ర మోదీ, టెక్ దిగ్గజం టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ మధ్య తాజాగా జరిగిన ఫోన్ సంభాషణ…