తెలంగాణాలో ఉన్న వాళ్ళు సరిపోనట్లుగా కేసీయార్ కు మరో ప్రత్యర్ధి తయారయ్యారు. ఈమధ్యనే ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీయార్ ను సవాలు చేస్తున్నారు. తొందరలోనే జనాలు ఏనుగుపైకి ఊరేగుతు ప్రగతిభవన్లోకి ప్రవేశిస్తారంటూ ప్రకటించారు. ఏనుగుపై ఎక్కటమంటే అధికారంలోకి రావటమని ప్రవీణ్ చెప్పకనే చెప్పారు. బీఎస్పీ పార్టీ ఎన్నికల గుర్తు ఏనుగన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రగతిభవన్ అంటే ముఖ్యమంత్రి అధికారిక నివాసం. ఏనుగును ఎక్కి ప్రగతిభవన్లోకి వెళతామంటే అధికారంలోకి వస్తామని చెప్పటమే.
ఇప్పటికే ఒకవైపు రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ మరోవైపు బండి నేతృత్వంలోని బీజేపీ కేసీయార్ ను గట్టిగా తగులుకుంటున్నాయి. ఇటు రేవంత్ అటు బండి ఇద్దరు కేసీయార్ తో పాటు కేటీయార్ లాంటి టీఆర్ఎస్ ప్రముఖులను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఒకపుడు కేసీయార్ ధాటికి తెలంగాణాలో సరైన సమాధానం చెప్పేవారే లేరన్నట్లుగా సాగింది రాజకీయాలు. కానీ ఎప్పుడైతే బీజేపీ అధ్యక్షుడిగా బండి నియమితులైన దగ్గరనుండి రాజకీయం మారుతోంది.
ఇదే సమయంలో రేవంత్ కూడా యాక్టివ్ అయ్యారు. దాంతో కేసీయార్ ను ఒకవైపు బండి మరోవైపు రేవంత్ గట్టిగా తగులుకుంటున్నారు. దాంతో అధికారపార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. తాజాగా రేవంత్ కే కాంగ్రెస్ పగ్గాలు దక్కటంతో ఒక్కసారిగా స్పీడుపెంచారు. వీళ్ళద్దరు కాకుండా కోదండ్ రామ్ లాంటి వ్యక్తులు కూడా కేసీయార్ టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నారు. ఇంతమంది సరిపోరన్నట్లుగా కొత్తగా ఇపుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తయారయ్యారు.
బీఎస్పీ సమన్వయకర్తగా నియమితులైన ప్రవీణ్ అధ్యక్షతన నల్గొండలో భారీ బహిరంగసభ నిర్వహించారు. మొదటి బహిరంగసభలోనే కేసీయార్ పై ప్రవీణ్ ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడ్డారు. తెలంగాణాలోని బహుజనులందరినీ ఏకం చేసి టీఆర్ఎస్ ను ఓడించటమే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు ప్రవీణ్ ప్రకటించారు. బహుజనలంటే ఎస్సీలు, బీసీలు, ఎస్టీలతో పాటు అణగారిని వర్గాలన్నీ వస్తాయి.
ప్రవీణ్ ఊపు చూస్తుంటే రేపటి హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీఎస్పీ తరపున అభ్యర్ధిని దించేట్లే ఉన్నారు. అదేగనుక జరిగితే ఏ పార్టీకి నష్టం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే బీసీలు, ఎస్సీల ఓట్లను టార్గెట్ చేసుకునే కేసీయార్ దళితబంధని ఇంకోటని ప్రకటిస్తున్నారు. ఇపుడు బీఎస్పీ కూడా ఉపఎన్నికలో యాక్టివ్ అయితే పథకాలు తీసుకునే వాళ్ళలో కొందరు ఏనుగును సమర్ధించినా కేసీయార్ కు నష్టమనే చెప్పాలి. తెలంగాణా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాల్సిందే.
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…